నూతనంగా ఎన్నికైన సభ్యులను, ఘనంగా సన్మానించిన పాత్రికేయులు

On
నూతనంగా ఎన్నికైన సభ్యులను, ఘనంగా సన్మానించిన పాత్రికేయులు

టి.యు.డబ్ల్యూ.జె,ఐజేయు జర్నలిస్టుల సన్నాహక సమావేశం 

 జగిత్యాల: సెప్టెంబర్,19

 జగిత్యాల జిల్లా కేంద్రంలో,టి యు డబ్ల్యూ యూనియన్ జర్నలిస్టుల సన్నాహక  సమావేశం గురువారం జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు అధ్యక్షతన జగిత్యాల ప్రెస్ క్లబ్ లో సమావేశం  జరిగింది జర్నలిస్టుల సమస్యలపై, వచ్చే నెలలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాదులో,ఆత్మీయ సమ్మేళనం జరగనుంది,ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యే విధంగా జర్నలిస్టులునిర్ణయం తీసుకోవడం జరిగింది యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె, సురేంద్ర కుమార్ మాట్లాడుతూ  జర్నలిస్టుల సంక్షేమమే యూనియన్ ప్రథమ కర్తవ్యం వారికి రావాల్సిన హక్కులు రావడానికి నాయకత్వం ముందుంటుందని అన్నారు  త్వరలో అర్హులైన జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం  ఉంటుందని తెలిపారు ముఖ్యమంత్రితో ఆత్మీయ సమ్మేళనానికి అధిక సంఖ్యలో సభ్యులు హాజరుకావాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏ ప్రదీప్ కుమార్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారి, నక్క లక్ష్మణ్ యాదవ్ రాష్ట్రసోషల్, డిజిటల్ మీడియా సభ్యులు టీవీ సూర్యం, దాడుల నిరోధక కమిటీ సభ్యులు, ముజాహిద్ ఆదిల్ జిల్లా కార్యవర్గంతో పాటు వివిధ మండలాల అధ్యక్ష,కార్యదర్శులు పాల్గొన్నారు

 నూతనంగా ఎన్నికైన సభ్యులను, ఘనంగా సన్మానించిన పాత్రికేయులు

 సమావేశ అనంతరం నూతనంగా ఎన్నికైన అనుబంధ కమిటీల రాష్ట్ర సభ్యులు, టీవీ సూర్యం ముజాహిద్ ఆదిల్ లను, జగిత్యాల జిల్లాలోని పాత్రికేయులు శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు

Tags