నీటి ప్రవాహిత ప్రాంతాలైన 10,25, 30 వార్డులో పర్యటించిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.

On
నీటి ప్రవాహిత ప్రాంతాలైన 10,25, 30 వార్డులో పర్యటించిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల సెప్టెంబర్ 2 ( ప్రజా మంటలు ) : 

వర్షపు నీరు ఎక్కువగా వచ్చిన ప్రాంతాలలో సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు మరియు ఇండ్లలోకి వచ్చిన నీరుని మోటార్ పంప్ సాయంతో తీసి వేయించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే ఇండ్ల చుట్టూ చేరిన వర్షపు నీరు మరియు ఇండ్ల లోకి చేరిన వర్షపు నీరు ఉన్న వాళ్లను గుర్తించి పునరావాస కేంద్రాల తరలించి వారికి వసతులు కల్పించాలని ఆదేశించారు.తడిగా ఉన్న విద్యుత్ స్థంబాల, తడి చేతులతో స్టార్టర్లు మోటార్లు స్విచ్ బోర్డులు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని అన్నారు.

అలాగే చిన్న పిల్లలు కరెంటు వస్తువుల జోలికి రాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. ఇంత తీగల పైన దుస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరబెట్టుకోకూడదని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏ ఈ అనిల్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ , స్థానిక కౌన్సిలర్స్ ,మున్సిపల్ సిబ్బంది , పాల్గొన్నారు.

Tags