జగిత్యాల పట్టణంలో ఘనంగా నిమజ్జనోత్సవ వేడుకలు.

On
జగిత్యాల పట్టణంలో ఘనంగా నిమజ్జనోత్సవ వేడుకలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు)

నవరాత్రుల పాటు పూజలు అందుకున్న లంబోదరుడు సోమవారం నిమజ్జనోత్సవానికి బయలుదేరాడు.

ఆయా మంటపాలవారు గణేష విగ్రహాలను ప్రత్యేక వాహనంపై ఆసీనులను చేసి శోభాయాత్రగా పట్టణ ప్రధాన వీధుల గుండా చింతకుంట తటాకానికి నిమజ్జోత్సవానికై డప్పు చప్పుళ్ళు, మంగళవాద్యాల నడుమ తరలించారు ..

కాగా స్థానిక విశ్వహిందూ పరిషత్ నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు టవర్ సర్కిల్ వద్ద ఆయా విగ్రహ మంటపాల నిర్వహకుల వారికి స్వాగతం పలికి జ్ఞాపకాలు అందజేశారు.

కాగా స్థానిక ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా శోభాయాత్ర వేడుకలను వీక్షింపజేశారు.

వివిధ శాఖల అధికారులు సమన్వయంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాట్లు పూర్తి చేశారు.

జిల్లా ఎస్పీ అశోక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిఘా నీడలో నిమజ్జనోత్సవం వేడుకలు కొనసాగించారు.

గంగాపుత్ర సంఘం వారు వినాయక విగ్రహాలను నిమజ్జోత్సవాన్ని కొనసాగించారు.ఆర్ డి ఓ పులి మధుసూదన్ గౌడ్ చింతకుంట తటాకం వద్ద నిమజ్జనోత్సవం పర్యవేక్షణ చేశారు.

Tags