పార్శీగుట్టలో తల్లి, కొడుకుల ఆత్మహత్య

On
పార్శీగుట్టలో తల్లి, కొడుకుల ఆత్మహత్య

పార్శీగుట్టలో తల్లి, కొడుకుల ఆత్మహత్య
  * అప్పుల బాధనే కారణమన్న పోలీసులు

సికింద్రాబాద్, సెప్టెంబర్​ 28 ( ప్రజామంటలు ) :

వారాసిగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పార్శీగుట్టలో విషాదం చోటు చేసుకుంది. వారాసిగూడ ఎస్​.ఐ సుధాకర్​ తెలిపిన వివరాల ప్రకారం..శనివారం సాయంత్రం డయల్​100 కు వచ్చిన కాల్ ఆధారంగా పార్శీగుట్ట న్యూ అశోక్​ నగర్​ కు వెళ్ళిన పోలీసులకు ఓ ఇంట్లో రెండు శవాలు కనిపించాయి. నాంపరి జయలక్ష్మీ (63), నాంపరి రవికాంత్​ (36) లుగా గుర్తించారు. తల్లి, కొడుకులైన వీరు అప్పుల బాధ భరించలేకనే ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మోనోసిల్​ అనే పురుగుల మందు తాగి సూసైడ్​ చేసుకున్నారు. కుమారుడు రవికాంత్​ ప్రైవేట్ జాబ్​ చేస్తుండగా, ఇతడికి ఇంకా వివాహం కాలేదని, తల్లి జయలక్ష్మీ ఇంటి వద్దనే ఉండేదని స్థానికులు తెలిపారు.  ఈరోజు మద్యాహ్నం ఇంటి ఒనర్​ కు అనుమానం వచ్చి వీరి గది తలుపుకొట్టగా, తీయకపోవడంతో అనుమానం వచ్చి డయల్​ 100 కు కాల్ చేశాడు. పోలీసులు వచ్చి చూడగా ఈ ఘోరం వెలుగు చూసింది.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
–––––––––––––––
–ఫొటో: : విగత జీవులుగా పడి ఉన్న తల్లి, కొడుకులు
––––––

Tags