మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తం గా ఉండాలి -  ఎమ్మెల్యే సంజయ్

On
మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తం గా ఉండాలి -  ఎమ్మెల్యే సంజయ్

మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తం గా ఉండాలి -  ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల సెప్టెంబర్  :
ప్రజల్లో చైతన్యం ,యువతలో మార్పు తో మాదక ద్రవ్యాల నియంత్రణ సాధ్యం ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన పై తీసిన  స్పేస్ షార్ట్ ఫిలిం ట్రైలర్ ను  జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ రిలీజ్ చేసారు 

 ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేడు ప్రపంచం మొత్తం కూడా మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి  చేస్తుందనీ, తెలంగాణ రాష్ట్రంలో మరియు జగిత్యాలలో సైతం మత్తు పదార్థాల వినియోగం పెరిగిందనీ అరికట్టాలని సూచించారు 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మత్తు పదార్థాల నియంత్రణ కోసం ప్రత్యేక దృష్టి సారించి, వినియోగించు,సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 

మత్తుపారుదల వినియోగం,జరిగే దుష్ప్రభావాలు పై ఆలోచింపజేసే విధంగా షార్ట్ ఫిలిం తీసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ డా.వాసాల శ్రీధర్,డైరెక్టర్ సాయి చేతన్,కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్,నాయకులు అడువాల లక్ష్మణ్,పెద్దింటి రాజు,అబ్దుల్ అజీజ్, గుంటి రవి,లవ కుమార్, ఖలీం,కెమరా మెన్ విజయ్,లైటింగ్ మెన్ నిలేశ్,మ్యూజిక్ డైరెక్టర్ మన్సూర్,తదితరులు పాల్గొన్నారు.

Tags