సంఘానికి విద్యార్ధి "దేహం" వంటివాడైతే, ఉపాధ్యాయుడు "ఆత్మ". - దావ వసంత సురేష్, జగిత్యాల తొలి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.

On
సంఘానికి విద్యార్ధి

సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల 05 సెప్టెంబర్ (ప్రజా మంటలు) : 

సెప్టెంబర్ 05 గురుపూజోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణ మరియు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్. 

ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ... 

మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు.

అలాగే నా జీవితంలో కూడా పాఠశాల విధ్యనుండి, నేటి వరకు గురువుల పాత్ర ఎంతో విలువైనది అని అన్నారు. 

సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించదగ్గ విషయం. ఇది సర్వత్రా వాంఛనీయం.

సంఘానికి విద్యార్ధి "దేహం" వంటివాడైతే ఉపాధ్యాయుడు "ఆత్మ" వంటి వారు.

అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

Tags