ఎమ్మెల్యే సంజయ్ కృషితో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 5 డయాలసిస్  పడకలు ప్రారంభం 

On
ఎమ్మెల్యే సంజయ్ కృషితో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 5 డయాలసిస్  పడకలు ప్రారంభం 

ఎమ్మెల్యే సంజయ్ కృషితో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 5 డయాలసిస్  పడకలు ప్రారంభం 

కోరుట్ల ఆగస్టు15 :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో  కేసీఆర్ ప్రభుత్వంలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. 
నిత్యం రోగులతో నిండటంతో ఇట్టి 5 పడకలు సరిపోవడం లేదని పెరుగుతున్న డయాలసిస్ బాధితులను దృష్టిలో ఉంచుకొని  ప్రస్తుత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారిని మరో ఐదు అదనపు పడకలను మంజూరు చేయాలని కోరారు..
వాటిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు మంజూరు చేయగా ఈరోజు ఐదు డయాలసిస్ అదనపు పడకలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు.
 డయాలసిస్ అదనపు పడకలను మంజూరు చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్  కృతజ్ఞతలు తెలిపారు.

Tags