పోలీస్ అకాడమీ లో పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్యమంత్రి రీవంత్ రెడ్డి. 

On
పోలీస్ అకాడమీ లో పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్యమంత్రి రీవంత్ రెడ్డి. 

తెలంగాణ హోంశాఖ లో త్వరలో కొత్తగా 547 మంది "ఎస్ఐ"లు చేరబోతున్నారు. సివిల్,ఏఆర్,స్పెషల్ పోలీస్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ,ఫింగర్ ప్రింట్ బ్యూరో, స్పెషల్ ప్రోటక్షన్ ఫోర్స్ విభాగలలో వీరికి పోస్టింగ్ ఇవ్వనుంది.వీరందరూ తాజాగా రాజా బహద్దూర్‌ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీలో 9 నెలల పాటు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర హోంశాఖ పరిధిలోని ఆయా విభాగాల్లో వీరికి విధులు అప్పగించేందుకు ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు. *ఈ మేరకు ఈరోజు ( బుధవారం) పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ (పీవోపీ) నిర్వహించబోతున్నట్లు అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిష్త్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.*

Tags