నగరంలో నిరాశ్రయులకు, అనాథలకు 258వ అన్నదాన కార్యక్రమం

On
నగరంలో నిరాశ్రయులకు, అనాథలకు 258వ అన్నదాన కార్యక్రమం

నగరంలో నిరాశ్రయులకు, అనాథలకు 258వ అన్నదాన కార్యక్రమం
హైదరాబాద్ ఆగస్టు 11:

నగరంలో అనేక ప్రాంతాలలో  రోజు రోజుకు నిరాశ్రయుల సంఖ్య పెరుగుతుంది.   ఆశ్రయం కరువై ఆకలితో అలమటిస్తూ రోడ్ల పక్కన ఫుట్ పాత్ల మీదనే దయనీయస్థితులలో  జీవనం సాగిస్తున్నారు. ఈ అభాగ్యులందరికి ఆశ్రయం కలిపించి ఆహారం, వైద్యం అందించి స్వయం ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని స్కై ఫౌండేషన్ తరపున  విజ్ఞప్తి  చేస్తున్నాము.  హైదరాబాద్ నగరంలో వాహనంలో సంచరిస్తూ ఆకలితో ఉన్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారిని గుర్తించి  258వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ అన్నదాన కార్యక్రమములో ప్రెసిడెంట్  వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పావని.ఓ, సేవసభ్యులు హరీష్ కుమార్, ఇఫ్రాన్, సాయితేజ మొదలగు వాళ్ళు పాల్గొన్నారు.
 

Tags