మహిళ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా తో సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే ,మున్సిపల్ చైర్ పర్సన్.

On
మహిళ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా తో సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే ,మున్సిపల్ చైర్ పర్సన్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు) : 

మహిళా డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వారు ఆటానమస్ హోదా జారీచేసిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొని ఉపాధ్యాయులకు,విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .ఈ సందర్భంగా ఎమ్మెల్యే ని శాలువా తో సత్కరించిన కళాశాల ఉపాద్యాయులు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ...

గతంలో యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ వారు కళాశాలకు బి++ గెడ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

పిఎం ఉషా కార్యక్రమం లో భాగంగా 4 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి..టెండర్ కూడా పూర్తి అయింది అని,త్వరలో పనులు ప్రారంభం అవుతాయి అన్నారు.

నూతన బిల్డింగ్ ప్లాన్ కూడా బాగుంది అన్నారు.ఆడిటోరియం ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తా అన్నారు.

కళాశాల లో సమస్యలు దృష్టికి వచ్చాయి అని పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు.కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల తో పాటు జగిత్యాల కు అటానమస్ రావడం అభినందనీయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,కౌన్సిలర్ చుక్క నవీన్,ప్రిన్సిపల్ రామ కృష్ణ,ఉపాద్యాయులు, విద్యార్ధులు,తదితరులు పాల్గొన్నారు.

Tags