ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు వరకు ఉద్యమం కొనసాగిస్తాం - జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు

On
ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు వరకు ఉద్యమం కొనసాగిస్తాం - జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు

ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు వరకు ఉద్యమం కొనసాగిస్తాం
జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు

జగిత్యాల ఆగస్ట్ 11 (ప్రజా మంటలు) :

తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాస్ రావు అన్నారు .జిల్లా కేంద్రంలో గత తొమ్మిది రోజులుగా జర్నలిస్టులు తమకు ఇండ్ల స్థలాలు ఇప్పించాలని దీక్షలు కొనసాగిస్తుండగా ఆదివారం దీక్షా శిబిరాన్ని జమాతే ఇస్లాం హింద్ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ  స్థాపక సభ్యులుషాయాబ్ ఉల్ హాక్ అబ్దుల్ అలీం,ఖాజా సలావుద్దీన్,  వారు దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. తపస్ ఉపాధ్యాయ సంఘ నాయకులు బోనగిరి దేవయ్య ,ఐలినేని నరేందర్ రావు, వొడ్నాల రాజశేఖర్, ప్రసాద్ రావు సంఘీభావం ప్రకటించి జర్నలిస్టుల ఉద్యమ వెంట తాము ఉంటామని తెలిపారు. ఇదిలా ఉండగా శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత ముసిపట్ల రాజేందర్, డైరెక్టర్ మల్లేశం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు .

Tags