గల్ఫ్ లో పెంచిన ఇండియన్ పాస్పోర్ట్ ఫీజును తగ్గించాలి
పేద గల్ఫ్ కార్మికులపై నాలుగు రెట్ల ఫీజుల భారం
(రామ కిష్టయ్య సంగన భట్ల...9440595494)
కేంద్ర ప్రభుత్వం కొత్త అవుట్సోర్సింగ్ విధానంతో గల్ఫ్ దేశాలలో పాస్ పోర్ట్, కాన్సులర్ సేవలను ప్రైవేటీకరించి నాలుగు రెట్ల ఫీజులు పెంచడం పట్ల ప్రవాసి కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పెంచిన పాస్ పోర్ట్, కాన్సులర్ సేవల ఫీజులను వెంటనే తగ్గించాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు సోమవారం మెయిల్ ద్వారా, 'ఎక్స్' వేదిక ద్వారా విజ్ఞప్తి చేశారు.
విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ప్రవాస భారతీయులు 2024లో 129 బిలియన్ యుఎస్ డాలర్ల (11 లక్షల 22 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ కు పంపారు. ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతం.
ఇందులో సగానికి పైగా సొమ్ము యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమాన్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాల నుంచే వచ్చింది. ప్రవాసి కార్మికులు దేశానికి ఆర్థిక జవాన్లుగా నిలుస్తున్నారు. గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని భారత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
ఏటా 26.6 బిలియన్ యూఎస్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న బంగ్లాదేశ్ ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉన్నది. విదేశాల నుంచి ఫారెక్స్ పంపిస్తున్న తమ ప్రవాసీలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం 2.5 శాతం ప్రోత్సాహకం ఇస్తున్నది. మనకంటే చాలా చిన్న దేశం బాంగ్లాదేశ్ తమ ప్రవాసులకు ప్రోత్సాహాకాలు ఇస్తుంటే భారత్ మాత్రం ఎన్నారైలను పీడిస్తున్నదని భీంరెడ్డి అన్నారు.
ఇప్పటికే తక్కువ వేతనాలు, జీతం దొంగతనం (వేజ్ థెఫ్ట్), రుణ బానిసత్వం, బలవంతపు శ్రమ, పెరుగుతున్న జీవన వ్యయంతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు పాస్ పోర్ట్, కాన్సులర్ సేవల ఫీజుల పెంపు మరింత అన్యాయం చేస్తుంది. ప్రవాసి కార్మికులు తమ ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసినందుకు వారికి భారత ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని మంద భీంరెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవాసి కార్మికులకు సహాయం చేయడానికి బదులుగా, వారిని ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ కంపెనీలకు ఆదాయ వనరులుగా మారుస్తున్నారని ఆయన విమర్శించారు.
గల్ఫ్ దేశాలలో ఇండియన్ పాస్ పోర్ట్, కాన్సులర్ సేవల ఫీజు పెంపు ఈ విధంగా ఉన్నది. సౌదీ అరేబియా లో 200-300 రియాళ్లు (గతంలో 50-75), యూఏఈ లో 200-350 దిర్హములు (గతంలో 50-100), ఓమాన్ లో 25-35 రియాళ్లు (గతంలో 5-10), బహరేన్ లో 20-30 దీనార్లు (గతంలో 5-10), ఖతార్ లో 150-200 రియాళ్లు, కువైట్ లో 23.750 దీనార్లు వసూలు చేస్తున్నారు.
గల్ఫ్ కార్మికుల జీవితాలపై ప్రభావం చూపే ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను, వలస కార్మికుల హక్కుల సంఘాలను, పౌర సమాజ సంస్థలను, వలస కార్మికులను ఎందుకు సంప్రదించలేదు. పారదర్శకత, వాటాదారుల ప్రమేయం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని భీంరెడ్డి డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
