ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..
మెటుపల్లి / ఇబ్రహీంపట్నం మార్చి 11 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్ పల్లి,ఇబ్రహింపట్నం మండలాల పరిసర ప్రాంతాలలో గత కొంత కాలం నుండి అక్రమ ఇసుక, మొరం రవాణా, భూమి సెటిల్మెంట్ దందాలు చేస్తూ, వారి అక్రమాల పై ఎదురు తిరిగిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీ ముఠా అమాయక ప్రజలు, వ్యాపారాలు, ప్రభుత్వ అధికారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న రౌడీముఠాను మెట్పల్లి ది ఐ, ఏ. నిరంజన్ రెడ్డి, ఇబ్రహింపట్నం ఎస్సై, ఏ. అనిల్ లు మంగళవారం అరెస్టు చేశారు.
సీఐ నిరంజన్ రెడ్డి, నిందితులు రెంజర్ల అజయ్(31), బత్తుల భరత్ (36),జెట్టి లక్ష్మణ్ (33) లను అరెస్టు చేసినట్లు, ఎన్నం రమేష్ అనే నిందుతుడు పరారిలో ఉన్నట్లు తెలిపారు.నిందితులు ఒక ముఠాగా ఏర్పడి గత కొంత కాలం నుండి అక్రమ ఇసుక, మొరం రవాణా చేస్తూ, సెటిల్మెంట్ దందాలు చేస్తూ, అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. ఎవరైనా వారి మాట వినకపోతే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించేవారు. ఈ విధంగా వచ్చిన డబ్బులను పంచుకుని ఖర్చు చేసుకునేవారని అన్నారు.
ముఖ్యంగ ఇందులో బత్తుల భరత్ అనే వ్యక్తి గతంలో వివిధ నేరాలకు పాల్పడగా అతని పై మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ తో పాటు ఇతర కేసుల లో నిందితుడిగా ఉన్నాడని అన్నారు. ఫిబ్రవరి 12న రెంజర్ల అజయ్ అనే నిందుతుడు రాజేశ్వర్రాపేట్లో అక్రమ మొరం రవాణా చేస్తుండగా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డీఈఈ లక్కంపల్లి అరుణోదయ్ కుమార్,వర్క్ ఇన్స్పెక్టర్ లస్మయ్యలు అడ్డుకున్నారని అన్నారు వెంటనే అజయ్ ఈ విషయాన్ని ఎన్నం రమేష్కు ఫోన్ ద్వారా తెలియజేయగా, రమేష్ అక్కడికి వచ్చి డీఈఈ అరుణోదయ్ కుమార్ను దూషించాడని వారి అక్రమ రవాణాను అడ్డుకుంటే డీఈఈ అరుణోదయ్ కుమార్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని రమేష్ బెదిరించడంతో డీఈఈ అరుణోదయ్ కుమార్ భయపడి అక్కడి నుంచి పారిపోయారని అన్నారు.
ఆ తర్వాత బత్తుల భరత్ డీఈఈ అరుణోదయ్ కుమార్కు ఫోన్ చేసి, కులం పేరుతో దూషించారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని, చంపుతామని బెదిరించి, కేసు పెట్టకుండా ఉండాలంటే మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు.ఫిబ్రవరి 15 న జెట్టి లక్ష్మణ్ కూడా డీఈఈ అరుణోదయ్ కుమార్కు ఫోన్ చేసి, వెంకట్రావుపేట్ గుట్ట వద్దకు వచ్చి మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని, లేకపోతే చంపుతామని బెదిరించాడని అన్నారు. దీంతో భయపడిన డీఈఈ అరుణోదయ్ కుమార్ బత్తుల భరత్కు ఫోన్ ద్వారా రెండుసార్లు మొత్తం లక్షా పది వేలు పంపించారని,నలుబై వేలు నగదు రూపంలో జెట్టి లక్ష్మణ్కు ఇచ్చారని అన్నారు.ఆ తర్వాత కూడా తరుచు వారు డీఈఈ అరుణోదయ్ కుమార్ కు ఫోన్ చేసి మిగతా లక్ష యాబైవేల రూపాయలు ఇవ్వాలని లేకపోతే చంపుతామని బెదిరింపులకి పాల్పడగా, వారి వేదింపులు తట్టుకోలేక డీఈఈ అరుణోదయ్ కుమార్ మార్చ్ 06 వ తేదీన ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ అనిల్ కుమార్ కు పిర్యాదు చేయగా నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అన్నారు.
మార్చి 10 రాత్రి ముగ్గురు నిందితులయిన, అజయ్, భరత్, లక్ష్మణ్లు గండి హనుమాన్ దేవాలయం సమీపంలో మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి, ఇబ్రహింపట్నం ఎస్సై అనిల్ కుమార్ పట్టుకొని వారి వద్ద నుండి రెండు ఫోన్లు,ఎనుబై వేల రూపాయల నగదు స్వాధీనపరుచుకొని తదుపరి చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపరుచానైనదని అన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఎన్నం రమేష్ను అతి త్వరలోనే పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.మెట్పల్లి సర్కిల్ పరిధిలో ఎవరైనా అక్రమ ఇసుక, మొరం రవాణా, భూముల సెటిల్మెంట్ దందాలకు పాల్పడి ప్రజల నుండి డబ్బులు వసూలు చేసినట్టు తెలిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోని అట్టి నేరస్తులపై పి.డి. ఆక్ట్ విధించబడునని సిఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
