అప్పులు తీసుకొచ్చి బడా కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్ - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

On
అప్పులు తీసుకొచ్చి బడా కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్ - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

సీఎంకు పేదల పట్ల ఆలోచన లేదు - కేసీఆర్ పదేళ్లలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించారు

15 నెలలు... ₹ 1,50,000,00,00,000 అప్పు - లక్ష 50 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా ఆడపిల్లలకు ఒక్క స్కూటీ కూడా ఇవ్వలేదు

 అప్పు తెచ్చి కూడా ఒక్క మహిళకూ 2500 ఇవ్వడం లేదు
అప్పులు, ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదారాబాద్ మార్చ్ 10:

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి బడా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. 15 నెలల పాలనలో రేవంత్ రెడ్డి సర్కారు రూ. లక్షా 52 వేలకుపైగా అప్పులు చేసిందని ఎండగట్టారు. కానీ పేద ప్రజలకు ఒక్క మంచి పనీ చేయలేదని, ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, మరి ఈ డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. అప్పులు, ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

సోమవారం నాడు తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ.... తెలంగాణ గొప్పగా, ఉన్నతంగా ఉందంటూ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పదేళ్లలో కేసీఆర్ చాటిచెప్పి పెట్టుబడులను ఆహ్వానిస్తే... ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగలేదని అబద్దాలు చెబుతున్నారని, ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి రెడ్డి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరమని మండిపడ్డారు. దాంతో దేశంలో ఉన్న అన్ని పత్రికలు కూడా తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉందని రాశాయని, ఇది బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల రేవంత్ రెడ్డికి గౌరవం లేదని విరుచుకుపడ్డారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కనీసం రూ 500 కోట్లు కూడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడానికి (మూలధన వ్యయం) ఖర్చు చేయలేకపోతున్నామని, రాష్ట్రానికి రూ 5500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం రావడం లేదని అని అబద్దాలు చెప్పారని గుర్తు చేశారు. కానీ రాష్ట్రానికి నెలకు రూ 18 వేల కోట్లు వస్తున్నాయని, రూ 6 వేల కోట్లు ఖర్చవుతున్నాయని, దాదాపు రూ 12 వేల కోట్లు రాష్ట్రానికి మిగులుతున్నాయని వెల్లడించారు. సగటున దాదాపు రూ 3 వేల కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేస్తున్నారని, కానీ ముఖ్యమంత్రి మాత్రం అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాలు ముఖ్యమంత్రికి తెలియదా లేక అవగాహన లేదా..? అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.  

హామీలను అమలు చేయకుండా తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి దొంగ లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. తప్పుడు లెక్కలతో సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రికి సామాజిక స్పృహ, దృక్పథం లేదని, హామీలు అమలు చేయాలన్న నియ్యత్ లేదని, భవిష్యత్తు పట్ల దూరదృష్టి లేదు పేదల కడుపునింపాలన్న ఆలోచన లేదని మండిపడ్డారు. 15 నెలల్లో పేదలకు ఒక్క మంచి పనీ చేయలేదని, కానీ బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం నిరంతరం కొనసాగుతుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యత పెద్దవాళ్లపై ఉందని,  పేద వాళ్లపై లేదని విమర్శించారు. IMG_20250310_184620

2023 నవంబరు నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.  లక్షా 50 వేల కోట్లు అప్పు చేసిందని, అంటే సగటున నెలకు రూ 10 వేల కోట్లు అప్పు తెస్తున్నారని, మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నట్లని  ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ 2500 ఇవ్వడం లేదు, రైతు రుణ మాఫీ, రైతు భరోసా పథకం సంపూర్ణంగా అమలు కాలేదు, వరికి బోనస్ బోగస్ అయింది.. ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయని నిలదీశారు. 

కాగా, “కేసీఆర్ లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారని బద్నాం చేశారు. కేసీఆర్ చేసిన అప్పుకు ప్రతీ పైసాకు లెక్క చెప్తాం. మరి లక్షా 50 వేల కోట్ల అప్పుకు లెక్క చెప్తారా ? పదేళ్లలో కేసీఆర్ కేవలం 4 లక్షల 30 వేల కోట్లు అప్పు తెచ్చారు. కానీ అంతకు రెట్టింపు అభివృద్ధి చేశారు.. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ 90 వేల కోట్లు ఖర్చు చేశారు, ఇతర ఇరిగేషన్  ప్రాజెక్టులకు రూ లక్షా  35 వేల కోట్లు , మిషన్ భగీరథకు - 37 వేల కోట్లు, రుణమాఫీకి  - రూ 30 వేల కోట్లు,  ఉచిత విద్యుత్తుకు - 36 వేల కోట్లు,  రైతు బంధుకు - 73 వేల కోట్లు , రైతు బీమాకు - 6800 కోట్లు, విద్యుత్తు రంగంపై - రూ లక్షా 38 వేల కోట్లు, ఆరోగ్య  రంగంపై - 61 వేల కోట్లు, సంక్షేమ రంగంపై రూ - 2 లక్షల 83 వేల కోట్లు ఖర్చు చేశారు. అప్పు 4 లక్షల కోట్లు అయితే.. సృష్టించిన సంపద 50 లక్షల కోట్లు.”  అని వ్యాఖ్యానించారు.

Tags

More News...

Local News 

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. గొల్లపల్లి / మల్యాలమార్చి 11 (ప్రజా మంటలు): మల్యాలలో అస్మా సుల్తానా నిన్న రాత్రి తన ఇంటి కి తాళాలు వేసి వారి బిడ్డ ఇంటికి జగిత్యాల కు వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, ఇంట్లోని బీరువాలో గల 5 తులాల బంగారు ఆభరణాలు,...
Read More...
Local News 

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం     అగంతకున్ని పట్టుకొని దేహశుద్ది    * అనంతరం పోలీసులకు అప్పగింత సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు):పద్మారావునగర్​ శ్రీసాయిబాబా టెంపుల్​ పక్కనున్న శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం ఓ అగంతకుడు చోరికి విఫల యత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలోనికి ప్రవేశించిన దాదాపు 50 ఏండ్ల వయస్సు కలిగిన ఓ వర్గానికి...
Read More...
Local News 

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్    సికింద్రాబాద్​, మార్చి 11 ( ప్రజామంటలు):   సంజీవరెడ్డి నగర్ పరిధిలోని గురుమూర్తి నగర్‌లో గల వినాయక స్వామి ఆలయంలో శనివారం రాత్రి దుండగులు పంచలోహ విగ్రహాలను దొంగిలించిన విషయం విదితమే. ఈనేపద్యంలో  ఘటనపై సమాచారం అందుకున్న సనత్‌నగర్ కాంగ్రెస్​ ఇన్‌చార్జ్ డా. కోట నీలిమ వెంటనే స్పందించారు. చోరీకి గురైన విగ్రహాలను త్వరగా గుర్తించి, దొంగలను...
Read More...
Local News 

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్​ పై దారి వదలండి

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్​ పై దారి వదలండి సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు.  సిటీలోని వివిధ ప్రాంతాల  నుంచి బస్సులు, వివిధ వాహనాల ద్వారా వచ్చే భక్తులకు ఇక్కడున్న మెయిన్​ రోడ్డు మద్యలోని మెట్రో డివైడర్ ఇబ్బందిగా మారింది. ఆలయానికి ఎదురుగా అవతల వైపు...
Read More...
Local News 

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు   ఎస్ ఈ సాలియా నాయక్    జగిత్యాల మార్చి11( ప్రజా మంటలు) రాబోవు వేసవి కాలానికి విద్యుత్ డిమాండ్ అనుగుణంగా అన్ని రకాల నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్ తెలిపారు అందులో భాగంగా జగిత్యాల డివిజన్ పరిధిలోని టౌన్ 1 సెక్షన్  లో వీక్లీ బజార్ స్కూల్ ఏరియా లోని  SS-234/100 కె.వి.ఏ నియంత్రిక సామర్థ్యంని...
Read More...
Local News 

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష. 

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.     జగిత్యాల మార్చి 11(ప్రజా మంటలు)జిల్లాలో  మంగళవారం జరిగిన ప్రథమ సంవత్సర గణిత శాస్త్రము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రము మరియు ఒకేషనల్ పరీక్షలలో 8021 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 7771 మంది విద్యార్థులు హాజరైనారు 250 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు పరీక్షల కన్వీనర్ బి. నారాయణ తెలిపారు. మొత్తం 96. 9 శాతం...
Read More...
Local News 

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ  ముఠా అరెస్ట్..

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ  ముఠా అరెస్ట్.. మెటుపల్లి / ఇబ్రహీంపట్నం మార్చి 11 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): మెట్ పల్లి,ఇబ్రహింపట్నం మండలాల పరిసర ప్రాంతాలలో గత కొంత కాలం నుండి అక్రమ ఇసుక, మొరం రవాణా, భూమి సెటిల్‌మెంట్ దందాలు చేస్తూ, వారి అక్రమాల పై ఎదురు తిరిగిన వారిపై  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీ...
Read More...
Local News 

ధరూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

ధరూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి    జగిత్యాల మార్చి 10(ప్రజా మంటలు) రూరల్ మం ధరూర్ గ్రామంలో   శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శివ పంచాయతన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజులపాటు జరిగినాయి.ఈ సందర్భంగా సోమవారం  ఏకకుండాత్మక హవనము, కళాన్యాస హోమము, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట ,ప్రాణ ప్రతిష్టాపన ,నేత్రోన్మీలనము, దృష్టి
Read More...
Local News 

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం  జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల మార్చి 11( ప్రజా మంటలు)భావోద్వేగాలకు తగ్గట్టుగా సంగీత బాణులను  వినిపించే పోలీస్ బ్యాండ్ పోలీసు శాఖలో ఎంతో ప్రాధాన్యత కలిగిన భాగంగా నిలుస్తుందని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఎస్పి  చేతులమీదుగా  పోలీస్ బ్యాండ్ సిబ్బంది కి స్పోర్ట్ డ్రెస్ ను...
Read More...
Local News 

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ 

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్     జగిత్యాల మార్చి 10(ప్రజా మంటలు) ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపాలని జిల్లా  కలెక్టర్ బి,సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా...
Read More...
Local News 

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు ప్రజామంటలు మార్చి 10 భీమదేవరపల్లి : మండలంలోని ముల్కనూర్ అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మార్పీఎస్ కడారి ప్రభాస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు, గ్రూప్ 1,2,3 లతోపాటు అన్ని రకాల ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు చేపట్టారు. ఈ...
Read More...
Local News 

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు.  సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు.   సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.    బుడగ జంగాల కాలనీలో ఘనంగా గాయత్రి మహాయజ్ఞం.  జగిత్యాల. మార్చి 10(ప్రజా మంటలు) హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడే జాతి బేడ బుడగ జంగాల ది అని, సంస్కృతి పరిరక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. జగిత్యాల సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సోమవారం బేడ...
Read More...