అబద్దాలను ప్రచారం చేయడం ముఖ్యమంత్రికి తగదు

On
అబద్దాలను ప్రచారం చేయడం ముఖ్యమంత్రికి తగదు

మోడీ కులం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు
బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ రాజేశ్వరి 

సికింద్రాబాద్ ఫిబ్రవరి 15 (ప్రజామంటలు):

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ కులానికి చెందినవారు కాదని లీగల్లీ కన్వెర్టెడ్ బిసి అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనాయకులు అయినా సోనియా, రాహుల్, ప్రియాంకలు ఏ కులానికి చెందినవారో స్పష్టం చేయాలని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు.

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏఒక్క పథకం కూడా అమలు చేయలేదని కానీ అన్ని అమలు చేసినట్లుగా అబద్దాలు ప్రచారం చేయడం ముఖ్యమంత్రికి తగదని అన్నారు. గత ఖరీఫ్ లో ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వలేదని ఇప్పుడు గత ఖరీఫ్ సీజన్ మరియు ప్రస్తుత రబీ సీజన్ రెండు పంటలకు కలిపి పన్నెండు వేలు రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలని అన్నారు.

పేదవారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఖాళీ జాగా ఉంటే అయిదు లక్షలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏఒక్కరికి ఇవ్వలేదని అన్నారు.అయిదు వందలకే సిలిండర్ ఇవ్వడం లేదని అన్ని రకాల వడ్లకు అయిదు వందలు బోనస్ అని కేవలం సన్న వడ్లకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు.దేశంలో తెలంగాణా రాష్టం తప్ప ఏరాష్ట్రము రుణమాఫీ చేయలేదని గప్పాలు కొడుతూ రైతు రుణమాఫీ కొందరికే చేసి అందరికి చేసినట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.భూమిలేని వ్యవసాయ కూలీలకు,

ఆటో డ్రైవర్లకు ఏటా పన్నెండు వేల చొప్పున ఇస్తామని ఇంతవరకు ఏఒక్కరికి ఇవ్వలేదని ఒకవేళ ఇచ్చినట్లయితే చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కామారెడ్డి ప్రజలు ఒక్క కేసీఆర్ ఒక్కరినే బండకేసి కొట్టలేదని రేవంత్ రెడ్డిని కూడా బండకేసి కొట్టిన విషయం మరచిపోకూడదు అన్నారు. 1931లో బ్రిటిష్ కాలంలో కులగణన జరిగితే 95 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసిందని బిజెపి ప్రభుత్వం మూడు సార్లు అధికారంలోకి వచ్చిన ఎందుకు చేయలేదని ప్రశ్నించడం సిగ్గుచేటని అరవై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కులగణన చేయకుండా గుడ్డి గుర్రాల పండ్లు తోమిండ్రా అని ఎద్దేవాచేశారు.

ఎస్సీ వర్గీకరణ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పడం మందికి పుట్టిన పిల్లల్ని మనకు పుట్టిన పిల్లలు అని సంబుర పడ్డట్టుందని అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు నిధులు తేవడం లేదని ముఖ్యమంత్రి ఆరోపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రం నుండి పది నెలల్లో యాభై వేల కోట్లు నిధులు కేంద్రం నుండి తెచ్చాం అనడం ఇందుకు నిదర్శనం అన్నారు. తెలంగాణా రాష్టం నుండి వంద కోట్ల నిధులు పన్నుల రూపంలో పోతుంటే 42%మాత్రమే రాష్ట్రానికి తిరిగి ఇస్తున్నారని ఇది అన్యాయం అన్న ముఖ్యమంత్రి తెలంగాణాలో అత్యధిక ఆదాయం హైదరాబాద్ నగరం నుండి మాత్రమే వస్తుందని అలాంటప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధికే ఖర్చు చేయకుండా మిగతా జిల్లాలలోని 118 నియోజకవర్గాలకు అంతంత మాత్రమే ఇచ్చి ఒక్క కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చిస్తున్నారని ప్రశ్నించారు.ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక కేంద్రంపై విమర్శలు చేయడం మానుకోవాలని ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అయిన అమెరికా నరేంద్ర మోడీకి ఇచ్చిన గౌరవాన్ని జీర్ణించుకోలేక చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో   ఓబీసీ మోర్చా స్టేట్ కో కన్వీనర్ సరోజ, మెట్టుగూడ డివిజన్  ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆవుల  గణేష్  పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు* భీమదేవరపల్లి మార్చి 12 (ప్రజామంటలు) హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో JSR గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించడం జరిగింది. వరుసగా నాల్గవ సంవత్సరం ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బాటసారులు,ప్రజలు,ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు...
Read More...
Local News 

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. గొల్లపల్లి / మల్యాలమార్చి 11 (ప్రజా మంటలు): మల్యాలలో అస్మా సుల్తానా నిన్న రాత్రి తన ఇంటి కి తాళాలు వేసి వారి బిడ్డ ఇంటికి జగిత్యాల కు వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, ఇంట్లోని బీరువాలో గల 5 తులాల బంగారు ఆభరణాలు,...
Read More...
Local News 

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం     అగంతకున్ని పట్టుకొని దేహశుద్ది    * అనంతరం పోలీసులకు అప్పగింత సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు):పద్మారావునగర్​ శ్రీసాయిబాబా టెంపుల్​ పక్కనున్న శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం ఓ అగంతకుడు చోరికి విఫల యత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలోనికి ప్రవేశించిన దాదాపు 50 ఏండ్ల వయస్సు కలిగిన ఓ వర్గానికి...
Read More...
Local News 

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్    సికింద్రాబాద్​, మార్చి 11 ( ప్రజామంటలు):   సంజీవరెడ్డి నగర్ పరిధిలోని గురుమూర్తి నగర్‌లో గల వినాయక స్వామి ఆలయంలో శనివారం రాత్రి దుండగులు పంచలోహ విగ్రహాలను దొంగిలించిన విషయం విదితమే. ఈనేపద్యంలో  ఘటనపై సమాచారం అందుకున్న సనత్‌నగర్ కాంగ్రెస్​ ఇన్‌చార్జ్ డా. కోట నీలిమ వెంటనే స్పందించారు. చోరీకి గురైన విగ్రహాలను త్వరగా గుర్తించి, దొంగలను...
Read More...
Local News 

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్​ పై దారి వదలండి

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్​ పై దారి వదలండి సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు.  సిటీలోని వివిధ ప్రాంతాల  నుంచి బస్సులు, వివిధ వాహనాల ద్వారా వచ్చే భక్తులకు ఇక్కడున్న మెయిన్​ రోడ్డు మద్యలోని మెట్రో డివైడర్ ఇబ్బందిగా మారింది. ఆలయానికి ఎదురుగా అవతల వైపు...
Read More...
Local News 

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు   ఎస్ ఈ సాలియా నాయక్    జగిత్యాల మార్చి11( ప్రజా మంటలు) రాబోవు వేసవి కాలానికి విద్యుత్ డిమాండ్ అనుగుణంగా అన్ని రకాల నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్ తెలిపారు అందులో భాగంగా జగిత్యాల డివిజన్ పరిధిలోని టౌన్ 1 సెక్షన్  లో వీక్లీ బజార్ స్కూల్ ఏరియా లోని  SS-234/100 కె.వి.ఏ నియంత్రిక సామర్థ్యంని...
Read More...
Local News 

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష. 

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.     జగిత్యాల మార్చి 11(ప్రజా మంటలు)జిల్లాలో  మంగళవారం జరిగిన ప్రథమ సంవత్సర గణిత శాస్త్రము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రము మరియు ఒకేషనల్ పరీక్షలలో 8021 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 7771 మంది విద్యార్థులు హాజరైనారు 250 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు పరీక్షల కన్వీనర్ బి. నారాయణ తెలిపారు. మొత్తం 96. 9 శాతం...
Read More...
Local News 

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ  ముఠా అరెస్ట్..

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ  ముఠా అరెస్ట్.. మెటుపల్లి / ఇబ్రహీంపట్నం మార్చి 11 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): మెట్ పల్లి,ఇబ్రహింపట్నం మండలాల పరిసర ప్రాంతాలలో గత కొంత కాలం నుండి అక్రమ ఇసుక, మొరం రవాణా, భూమి సెటిల్‌మెంట్ దందాలు చేస్తూ, వారి అక్రమాల పై ఎదురు తిరిగిన వారిపై  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీ...
Read More...
Local News 

ధరూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

ధరూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి    జగిత్యాల మార్చి 10(ప్రజా మంటలు) రూరల్ మం ధరూర్ గ్రామంలో   శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శివ పంచాయతన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజులపాటు జరిగినాయి.ఈ సందర్భంగా సోమవారం  ఏకకుండాత్మక హవనము, కళాన్యాస హోమము, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట ,ప్రాణ ప్రతిష్టాపన ,నేత్రోన్మీలనము, దృష్టి
Read More...
Local News 

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం  జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల మార్చి 11( ప్రజా మంటలు)భావోద్వేగాలకు తగ్గట్టుగా సంగీత బాణులను  వినిపించే పోలీస్ బ్యాండ్ పోలీసు శాఖలో ఎంతో ప్రాధాన్యత కలిగిన భాగంగా నిలుస్తుందని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఎస్పి  చేతులమీదుగా  పోలీస్ బ్యాండ్ సిబ్బంది కి స్పోర్ట్ డ్రెస్ ను...
Read More...
Local News 

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ 

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్     జగిత్యాల మార్చి 10(ప్రజా మంటలు) ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపాలని జిల్లా  కలెక్టర్ బి,సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా...
Read More...
Local News 

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు ప్రజామంటలు మార్చి 10 భీమదేవరపల్లి : మండలంలోని ముల్కనూర్ అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మార్పీఎస్ కడారి ప్రభాస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు, గ్రూప్ 1,2,3 లతోపాటు అన్ని రకాల ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు చేపట్టారు. ఈ...
Read More...