పసుపుకు మద్దతు ధరను ప్రకటించాలి - ధర కోసం నిజామాబాద్ జిల్లా కలక్టరేట్ ను దిగ్భందిస్తాం - ఎమ్మెల్సీ కవిత
చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను సమర్పిస్తున్న రేవంత్ రెడ్డి
ప్రజా భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ తర్వాతే బనకచర్ల ప్రాజెక్టును ప్రకటించిన చంద్రబాబు నాయుడు.
నిజామాబాద్ లో పసుపు మార్కెట్ యార్డును సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ ఫిబ్రవరి 22:
ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణగా కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఉన్న ప్రేమ తెలంగాణ రైతాంగంపై ఎందుకు లేదని రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. తెలంగాణ రైతుల కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబే ఎక్కువనా అని ప్రశ్నించారు. బ్యాగులతో దొరికిన రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందని, అందుకే చంద్రబాబు చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
శనివారం నాడు నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డును ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. అక్కడ పసుపు రైతులతో మాట్లాడి వారి కష్టాలు, సమస్యలు, మార్కెట్ లో ఉన్న ధరల వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... గతంలో ప్రజా భవన్ లో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో తర్వాత బనకచర్ల ప్రాజెక్టు చేపడుతామని చంద్రబాబు ప్రకటించారని, చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్రీఫ్ చేసిన తర్వాత... ఆయన ప్రకటన చేశారని చెప్పారు. గోదావరి నది నుంచి 200 టీఎంసీలను కృష్ణా, పెన్నా బేసిన్ లకు తరలించడానికి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు చేపడుతోందని, మన దగ్గరి నుంచి 200 టీఎంసీల నీటిని ఏపీ ఎత్తుకపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తూ నిలబడ్డారని మండిపడ్డారు. నిజంగా తెలంగాణహితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని, ప్రభుత్వం కోర్టుల్లో ఎందుకు కేసులు వేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆనాడు ఏపీ ప్రాజెక్టులు చేపడితే, కాలువలు విస్తరిస్తే కేసీఆర్ వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారని, కోర్టుల్లో కేసులు వేసి స్టే లు తీసుకొచ్చారని గుర్తు చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, అవసరమైతే కోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్టును ఆపాలని డిమాండ్ చేశారు. నోరుందికదా అని సీఎం రేవంత్ రెడ్డి గంప గయ్యాళిలా ఒర్రుతున్నారని విరుచుకుపడ్డారు.
కాగా, పేరుకే గెజిట్ జారీ చేసి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని, కానీ చట్టబద్ధత కల్పించలేదని ఎండగట్టారు. దాంతో దాంతో పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందని, బోర్డుకు చట్టబద్ధత ఉంటే బయటి దేశాల నుంచి వచ్చే నాసిరకం పసుపు దిగుమతులు తగ్గుతాయని, దాని వల్ల స్థానికంగా పసుపుకు మంచి రేటు వస్తుందని వివరించారు.
మార్కెట్ యార్డులో వ్యాపారులంతా సిండికేట్ గా మారి పసుపు ధర తగ్గిస్తున్నారని, నాలుగైదు రోజులు వేచిచూసినా పసుపు కొనడం లేదని తెలిపారు. ఒక రకంగా రైతును బ్లాక్ మెయిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నదని, ఎంత మంచి నాణ్యతగల పసుపుకు అయినా మంచి ధర ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
పసుపుకు 12 వేల కనీస ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, అంతకు తక్కువ ధర ఉంటే మిగితా డబ్బును బోనస్ రూపంలో ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కేవలం రూ. 8000 వేలకు మాత్రమే పసుపును కొనుగోలు చేస్తున్నారని, అయినా కూడా ప్రభుత్వం బోనస్ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.తక్షణమే పసుపుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పసుపు బోర్డుకు చట్టబద్ధతు, కనీస మద్ధతు ధర కోసం కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. ధీన స్థితిలో ఉన్న పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. వ్యాపారులు రైతులను మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ధ్వజమెత్తారు. మార్చి 1లోపు బోనస్ ప్రకటించకపోతే జిల్లా కలెక్టరేట్ ను దిగ్భందిస్తామని హెచ్చరించారు.
మరోవైపు, తనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవితగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసి సీఎం రేవంత్ రెడ్డి తీరు మారలేదని, తనపై మాట్లాడవద్దని సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారని తెలిపారు.
సుప్రీం కోర్టు తిట్టిన మొట్టమొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం తెలంగాణ కర్మ అని అన్నారు. తాను ఆయనలా మాట్లాడి తన స్థాయిని తగ్గించదలుచుకోవడం లేదని స్పష్టం చేశారు. నోరుందికదా అని ఎటుపడితే అటు మాట్లాడితే కుదరదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
