పసుపుకు మద్దతు ధరను ప్రకటించాలి - ధర కోసం నిజామాబాద్ జిల్లా కలక్టరేట్ ను దిగ్భందిస్తాం - ఎమ్మెల్సీ కవిత

On
పసుపుకు మద్దతు ధరను ప్రకటించాలి - ధర కోసం నిజామాబాద్ జిల్లా కలక్టరేట్ ను దిగ్భందిస్తాం - ఎమ్మెల్సీ కవిత

చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను సమర్పిస్తున్న రేవంత్ రెడ్డి
ప్రజా భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ తర్వాతే బనకచర్ల ప్రాజెక్టును ప్రకటించిన చంద్రబాబు నాయుడు.

నిజామాబాద్ లో పసుపు మార్కెట్ IMG-20250222-WA0541యార్డును సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ ఫిబ్రవరి 22:

ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణగా కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఉన్న ప్రేమ తెలంగాణ రైతాంగంపై ఎందుకు లేదని రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. తెలంగాణ రైతుల కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబే ఎక్కువనా అని ప్రశ్నించారు. బ్యాగులతో దొరికిన రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందని, అందుకే చంద్రబాబు చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

శనివారం నాడు నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డును ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. అక్కడ పసుపు రైతులతో మాట్లాడి వారి కష్టాలు, సమస్యలు, మార్కెట్ లో ఉన్న ధరల వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ...  గతంలో ప్రజా భవన్ లో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో తర్వాత బనకచర్ల ప్రాజెక్టు చేపడుతామని చంద్రబాబు ప్రకటించారని, చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్రీఫ్ చేసిన తర్వాత... ఆయన ప్రకటన చేశారని చెప్పారు. గోదావరి నది నుంచి 200 టీఎంసీలను కృష్ణా, పెన్నా బేసిన్ లకు తరలించడానికి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు చేపడుతోందని, మన దగ్గరి నుంచి 200 టీఎంసీల నీటిని ఏపీ ఎత్తుకపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తూ నిలబడ్డారని మండిపడ్డారు. నిజంగా తెలంగాణహితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని, ప్రభుత్వం కోర్టుల్లో ఎందుకు కేసులు వేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆనాడు ఏపీ ప్రాజెక్టులు చేపడితే, కాలువలు విస్తరిస్తే కేసీఆర్ వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారని, కోర్టుల్లో కేసులు వేసి స్టే లు తీసుకొచ్చారని గుర్తు చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, అవసరమైతే కోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్టును ఆపాలని డిమాండ్ చేశారు. నోరుందికదా అని సీఎం రేవంత్ రెడ్డి గంప గయ్యాళిలా ఒర్రుతున్నారని విరుచుకుపడ్డారు.

కాగా, పేరుకే గెజిట్ జారీ చేసి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని, కానీ చట్టబద్ధత కల్పించలేదని ఎండగట్టారు. దాంతో దాంతో పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందని, బోర్డుకు చట్టబద్ధత ఉంటే బయటి దేశాల నుంచి వచ్చే నాసిరకం పసుపు దిగుమతులు తగ్గుతాయని, దాని వల్ల స్థానికంగా పసుపుకు మంచి రేటు వస్తుందని వివరించారు.  

మార్కెట్ యార్డులో వ్యాపారులంతా సిండికేట్ గా మారి పసుపు ధర తగ్గిస్తున్నారని, నాలుగైదు రోజులు వేచిచూసినా పసుపు కొనడం లేదని తెలిపారు. ఒక రకంగా రైతును బ్లాక్ మెయిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నదని, ఎంత మంచి నాణ్యతగల పసుపుకు అయినా మంచి ధర ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

 పసుపుకు 12 వేల కనీస ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని,  అంతకు తక్కువ ధర ఉంటే మిగితా డబ్బును బోనస్ రూపంలో ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు  కేవలం రూ. 8000 వేలకు మాత్రమే పసుపును కొనుగోలు చేస్తున్నారని, అయినా కూడా ప్రభుత్వం బోనస్ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.తక్షణమే పసుపుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పసుపు బోర్డుకు చట్టబద్ధతు, కనీస మద్ధతు ధర కోసం కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. ధీన స్థితిలో ఉన్న పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. వ్యాపారులు రైతులను మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ధ్వజమెత్తారు. మార్చి 1లోపు బోనస్ ప్రకటించకపోతే జిల్లా కలెక్టరేట్ ను దిగ్భందిస్తామని హెచ్చరించారు.
 
మరోవైపు, తనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవితగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసి సీఎం రేవంత్ రెడ్డి తీరు మారలేదని, తనపై మాట్లాడవద్దని సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారని తెలిపారు.

సుప్రీం కోర్టు తిట్టిన మొట్టమొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం తెలంగాణ కర్మ అని అన్నారు. తాను ఆయనలా మాట్లాడి తన స్థాయిని తగ్గించదలుచుకోవడం లేదని స్పష్టం చేశారు. నోరుందికదా అని ఎటుపడితే అటు మాట్లాడితే కుదరదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.

Tags

More News...

Local News 

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి * పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.* ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందినీ వెంటనే భర్తీ చేయాలి.* విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలి.* మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు సికింద్రాబాద్​, మార్చి 12 ( ప్రజామంటలు): వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ...
Read More...
Local News 

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): సికింద్రాబాద్​ బౌద్ధనగర్​ డివిజన్​లో బుధవారం కార్పొరేటర్​ కంది శైలజ అధికారులతో కలసి పర్యటించారు. ఈసందర్బంగా ఆయా ప్రాంతాల్లోని స్ర్టీట్​ లైట్స్​ వెలుగుతున్నాయా...లేదా...అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట వీధిదీపాలను పెట్టాలని కార్పొరేటర్​ ఆదేశించారు. కొన్ని చోట్ల వెలుతురు తక్కువగా ఉండటంతో అక్కడ కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు...
Read More...
Local News 

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.    జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో  రవాణా శాఖ కార్యాలయము నిర్మాణమునకు అనువైన ప్రభుత్వ స్థలము కేటాయించగలరని కోరుతూ, కార్యాలయ సిబ్బందికి విధి నిర్వహణలో ఏర్పడుతున్న ఇబ్బందులు తదితర సమస్యల పరిష్కార నిమిత్తం జగిత్యాల జిల్లా కేంద్రంలో  10 ఎకరాలు (ఏ టి ఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ ఫిట్నెస్ స్టేషన్, సైంటిఫిక్ డ్రైవింగ్...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం          

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం              జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)  యశోద  హైటెక్ సిటీ సూపర్ స్పెషాలిటీ   డాక్టర్స్ హరీష్, కీర్తి, చైతన్య లచే సుమారు 250 మందికి పైగా ఉచితంగా వైద్య సేవలు అందించి అవసరమైన వారికి ఉచిత ఫిజియోథెరపీ మరియు రాయితీ లో అవసరమైన   స్కానింగ్లు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్,...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం          

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం                జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)  ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోటూరి శ్రీనివాస్, కోశాధికారి వూటూరి నవీన్, అదనపు కార్యదర్శి పల్లెర్ల నరేష్    ఎలిమిల్ల సాగర్, కట్కూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

భయం వీడితే...జయం మనదే..

భయం వీడితే...జయం మనదే.. - టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​కు సైకాలజిస్ట్ జ్యోతి రాజా సూచన  సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్లో రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రెయిన్ బో కమ్యూనిటీ కేర్, లెర్నింగ్ సెంటర్, ఆశ్రిత, బ్లూ ఫౌండేషన్, భవిత ఫౌండేషన్, పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్...
Read More...
Local News  State News 

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి సీఎం ప్రజావాణి సక్సెస్ రేటు 66 శాతం  సీఎం ప్రజావాణి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డి- పాల్గొన్న హైడ్రా కమీషనర్ రంగనాధ్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య  ## ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో  "" సిటిజన్ సెంట్రిక్...
Read More...
Local News  State News 

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు (రామ కిష్టయ్య సంగన భట్ల) శివకేశవుల సన్నిధి, భక్తుల పాలిటి పెన్నిధిగా రాష్ట్రంలో పేరెన్నికగన్న హరిహర క్షేత్రమైన ధర్మపురి పట్టణంలో బుధ వారం భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (యోగ, ఉగ్రుణ శ్రీ వేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా,  యోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ, వేంకటేశ్వర స్వాముల వార్షిక బ్రహ్మోత్సవాలను  పురస్కరించుకుని...
Read More...
Local News 

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు* భీమదేవరపల్లి మార్చి 12 (ప్రజామంటలు) హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో JSR గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించడం జరిగింది. వరుసగా నాల్గవ సంవత్సరం ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బాటసారులు,ప్రజలు,ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు...
Read More...
Local News 

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. గొల్లపల్లి / మల్యాలమార్చి 11 (ప్రజా మంటలు): మల్యాలలో అస్మా సుల్తానా నిన్న రాత్రి తన ఇంటి కి తాళాలు వేసి వారి బిడ్డ ఇంటికి జగిత్యాల కు వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, ఇంట్లోని బీరువాలో గల 5 తులాల బంగారు ఆభరణాలు,...
Read More...
Local News 

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం     అగంతకున్ని పట్టుకొని దేహశుద్ది    * అనంతరం పోలీసులకు అప్పగింత సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు):పద్మారావునగర్​ శ్రీసాయిబాబా టెంపుల్​ పక్కనున్న శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం ఓ అగంతకుడు చోరికి విఫల యత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలోనికి ప్రవేశించిన దాదాపు 50 ఏండ్ల వయస్సు కలిగిన ఓ వర్గానికి...
Read More...
Local News 

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్    సికింద్రాబాద్​, మార్చి 11 ( ప్రజామంటలు):   సంజీవరెడ్డి నగర్ పరిధిలోని గురుమూర్తి నగర్‌లో గల వినాయక స్వామి ఆలయంలో శనివారం రాత్రి దుండగులు పంచలోహ విగ్రహాలను దొంగిలించిన విషయం విదితమే. ఈనేపద్యంలో  ఘటనపై సమాచారం అందుకున్న సనత్‌నగర్ కాంగ్రెస్​ ఇన్‌చార్జ్ డా. కోట నీలిమ వెంటనే స్పందించారు. చోరీకి గురైన విగ్రహాలను త్వరగా గుర్తించి, దొంగలను...
Read More...