భయం వీడితే...జయం మనదే..
- టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కు సైకాలజిస్ట్ జ్యోతి రాజా సూచన
సికింద్రాబాద్ మార్చి 12 (ప్రజామంటలు):
బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్లో రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రెయిన్ బో కమ్యూనిటీ కేర్, లెర్నింగ్ సెంటర్, ఆశ్రిత, బ్లూ ఫౌండేషన్, భవిత ఫౌండేషన్, పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్ ల సంయుక్త ఆధ్వర్యంలో మూడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 120 మంది పదో తరగతి విద్యార్థులకు 'భయం వీడితే జయం మనదే' ఉచిత అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య వక్తగా హాజరైన ప్రముఖ సైకాలజిస్ట్ పి.జ్యోతి రాజా మాట్లాడుతూ... పిల్లలకు పరీక్షలంటే భయం ఎందుకు ?, మానసిక ఒత్తిడిని ఎలా జయించాలి, చదివింది మరచిపోకుండా ఎలా గుర్తు పెట్టుకోవాలి అనే టెక్నిక్స్ వివరించారు. పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై విద్యార్థులకు పలు మెళుకువలను చెప్పారు. మనసులో ఉన్న భయాన్ని తొలగించి, ప్రశాంత వాతావరణంలో ప్రణాళికా బద్ధంగా చదువుకోవాలని ఆమె సూచించారు. జీవితంలో ఇంకా చాలా పరీక్షలను ఎదుర్కోవాలని, ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచనలు ఉండాలని ఆమె విద్యార్థులకు ధైర్యం చెప్పారు. పరీక్షలు అయిపోయే వరకు సోషల్ మీడియా, టీవీ, సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె అన్నారు. బన్సీలాల్ పేట్, బోయిగూడ, ఆదయ్య స్మారక ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం చక్కటి టెక్నిక్ లను చెప్పిన సైకాలజిస్ట్ పి. జ్యోతి రాజాను బన్సీలాల్ పేట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. స్వప్నమాల, ఆదయ్య స్మారక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే. నారాయణరెడ్డి లు సన్మానించి ధన్యవాదములు తెలిపారు. నాలుగు స్వచ్ఛంద సంస్థల తరఫున 120 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, స్కేల్, స్నాక్స్ లను, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈ. చంద్రశేఖర్ తన వ్యక్తిగతంగా 120 మందికి పెన్నులను అందజేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ శిబిరంలో మాజీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి రాజా నరసింహారావు, దూదిబావి పాఠశాల హెచ్ఎం మల్లికార్జున్ రెడ్డి, రెయిన్ బో ఫౌండేషన్ ప్రోగ్రాం డైరెక్టర్ ఎం. శ్రీలత, సిటీ డెస్క్ మేనేజర్ వి. క్రాంతి కిరణ్, బ్లూ ఫౌండేషన్ డైరెక్టర్ క్రాంతి కిషోర్, ఆశ్రిత సంస్థ ప్రోగ్రాం మేనేజర్ పర్వతాలు, భవిత ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ కబీర్, పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ డైరెక్టర్ సంతోష్, రెయిన్ బో పర్శన్ ఇన్చార్జి సుజాత, సిబీసి కోఆర్డినేటర్ సంధ్యారాణి, టీచర్ వెంకటలక్ష్మి, బన్సీలాల్ పెట్, బోయిగూడ, ఆదయ్య మెమోరియల్ స్కూల్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

భయం వీడితే...జయం మనదే..
.jpg)
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)