ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు
(రామ కిష్టయ్య సంగన భట్ల) శివకేశవుల సన్నిధి, భక్తుల పాలిటి పెన్నిధిగా రాష్ట్రంలో పేరెన్నికగన్న హరిహర క్షేత్రమైన ధర్మపురి పట్టణంలో బుధ వారం భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (యోగ, ఉగ్రుణ శ్రీ వేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, యోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ, వేంకటేశ్వర స్వాముల వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రం నలు మూలల నుండే కాక, రాష్ట్రేతర సుదూర
ప్రాంతాలనుండి కళ్యాణానికి
ఏతెంచిన భక్తులు గోదా వరి స్నానాదులు ముగించుకుని రాత్రి క్షేత్రంలోనే నిద్రించారు. అలాగే దర్శనాలకై బుధవారం ఉదయాత్పూర్వం నుండే పిల్లా పాపలను చంకలో ఎత్తుకుని, మూటా ముల్లే నెత్తిన ఉంచుకుని జానపద బాణీలలో పాటలు పాడుకుంటూ పరిసరాలను మైమరచి, తరతరాల వారసత్వ ఆచార నేపథ్యంలో క్షేత్రానికి అరుదెంచి, పవిత్ర గోదావరి నదిలో మంగళ స్నానాలను ఆచరించి దైవ దర్శనా లకై బారులు తీరి వివిధ ఆలయా లముందు వేచియున్నారు. అనంతరం ప్రత్యేక పూజాదులలో పాల్గొని స్వామికి పట్టెనా మాలు, కోరమీసాల సమర్పణ, కోడె మెుక్కు ఆదిగా మెక్కులు చెల్లించు కున్నారు.
తల నీలాలు సమర్పించుకున్నారు. దేవస్థాన పౌరోహితులు పురుషోత్తమా
చార్యులు, వేదపండితులు రమేశ శర్మ, ఉప ప్రధానార్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్య, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్య, వివిధ ఆర్చకుల ఆధ్వర్యంలో
దేవసానం ఈ ఓ, ఈఓ శ్రీనివాస్,
సిబ్బంది పర్యవేక్షణలో ప్రత్యేక ఆర్చనలు గావించారు. ముఖ్యంగా ప్రధానాలయ హోమశాలయందు వాసుదేవ వాచనం, అగ్ని ప్రతిష్ఠ, ద్వాదశాక్షర మంత్రహవనం, గర్భాదాన, పుంసవన, సీమంత, జాతకరణ, నామకరణ, అన్న ప్రాసన, కాలో పయన, ప్రాజాపత్య హవనములు, వైష్ణవ సిద్ధికై వైష్ణత్వ హోమములు, సమిధల హోమం, సప్తా వరణ హోమాలు, పంచసూక హవనాలు, శాంతి హోమాలను నిర్వహించగా భక్తులు తన్మయత్వంతో భాగస్వాములైనారు. మద్యాహ్నం దేవాలయాలలో ఆళ్వారులకు బలి ప్రదానం, అష్ట దిక్పాలకులకు బలి ప్రదానం, రాగ తాళ యుక్తంగా నిర్వహించారు. పట్టణ పుర వీధులగుండా అందంగా అలంకరించిన ఉత్సవ మూర్తులను ఊరేగించారు. అనంతరం సుదర్శన, విశ్వక్సేన యాగం, సర్వదేవతా ఆవాహ నయా గం, గరుడ హోమం, వ్యాహృతి హోమాలు, సర్వదేవతా ఆవాహన యాగం, గరుడ హోమం, వ్యాహృతి హోమాలు, బలి ప్రదాన హారతి, మంత్ర పుప్పాది భగవత్సేవా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆశేష భక్త జనం ఈ కార్యక్రమాలను తనివితీరా వీక్షించి తరించారు. క్షేత్రానికి ఎతెంచిన వేలాది మంది భక్తులు దేవస్తానం పక్షాన నిర్వహించిన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. భక్తులు, స్థానికులు అన్నదానానికై బియ్యం, పప్పు, నూనెలు, నగదును అందజేశారు. స్వచ్ఛంద సంస్థల బాధ్యులు భక్తులకు వడ్డనలు చేశారు.
ఉచిత అన్న దానికి విశేష స్పందన
బ్రహ్మోత్సవాలలో బుధ వారం సుదూర ప్రాంతాల నుండి క్షేత్రానికి వాహనాలు, బస్సుల ద్వారా వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. రుచికరమైన వంటలను తిని ఆకలి తీర్చుకుని సంతోషంతో తిరిగి వెళ్ళారు.
ఆకట్టుకున్న సంగీత విభావరి
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దేవస్థానం పక్షాన నిర్వహిసున్న సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా బుధ వారం రాత్రి దేవసానంలో ని శేషప్ప కళా వేదికపై, ప్రముఖ గాయకులు
శశికళ బృందం గర్శకుర్తి, డాక్టర్ తిరుమల బృందం కరీం నగర్, శ్రీరాం భట్టార్ హరికథ
ఆకట్టుకున్నాయి. సంగీతజ్ఞులను పరవశులు చేశాయి. దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసులు సంగీతరత్న కొరిడె నరహరి శర్మ నిర్వహించిన కార్యక్రమంలో దేవస్తానం ఈ ఓ శ్రీనివాస్ కళాకారులను సత్కరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

భయం వీడితే...జయం మనదే..
.jpg)
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)