ముఖ్యమంత్రితో ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ భేటీ

On
ముఖ్యమంత్రితో ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ భేటీ

ముఖ్యమంత్రితో ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ భేటీ

హైదారాబాద్ సెప్టెంబర్ 05:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ (ఎమర్జింగ్ టెక్ అడ్వకెసీ) డానియెలా కాంబ్ (Daniela Combe)  మర్యాదపూర్వకంగా కలిశారు. 

హైదరాబాద్ హెఐసీసీ వేదికగా జరుగుతోన్న గ్లోబల్ ఏఐ సదస్సు #GlobalAISummit2024 ప్రాంగణంలో వీరు సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్తు, నూతన ఆవిష్కరణల అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల ప్రాంగణంలో అధునాతన ఏఐ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ఫ్యూచర్ సిటీని ఏఐ రాజధానిగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికల పట్ల ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ గారు ఆసక్తి కనబరిచారు. 

ఈ సమావేశంలో మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఉన్నతాధికారులు, ఐబీఎం ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags