సీఎం సారు ఫీజు బకాయిలు మంజూరు చేయండి - ఫీజులు కట్టలేకపోతున్నాం - ప్రైవేటు కళాశాల విద్యార్థుల పోస్ట్ కార్డు ఉద్యమం

On
సీఎం సారు ఫీజు బకాయిలు మంజూరు చేయండి - ఫీజులు కట్టలేకపోతున్నాం - ప్రైవేటు కళాశాల విద్యార్థుల పోస్ట్ కార్డు ఉద్యమం

సీఎం సారు ఫీజు బకాయిలు మంజూరు చేయండి - ఫీజులు కట్టలేకపోతున్నాం - ప్రైవేటు కళాశాల విద్యార్థుల పోస్ట్ కార్డు ఉద్యమం

ధర్మపురి ఆగస్టు 09 ;
 తమ ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించి తమను ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని శ్రీ చైతన్య, నవోదయ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పోస్ట్ కార్డుల ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. గత రెండు సంవత్సరాల నుండి విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఆర్టీఎఫ్ మరియు ఎంటిఎఫ్ ఫీజులు చెల్లించక పోవడం వలన లక్షలాది మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. రవాణా చార్జీలు మరియు కళాశాలలో పరీక్షల ఫీజులు చెల్లించలేక పలువురు విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని అన్నారు.
 గత ప్రభుత్వ వైఫల్యం వల్ల తాము చదువుకు దూరమయ్యే పరిస్థితులు తలెత్తాయని విద్యార్థులు వాపోయారు. 
 రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఉపకార వేతనాలు మంజూరు కాకపోవడంతో ప్రైవేటు కళాశాలలు నడపలేని స్థితికి చేరాయనీ తెలిపారు. కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు,సిబ్బంది సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఉపకార వేతనాలు సకాలంలో చెల్లించనట్లయితే ఎంతోమంది 
 పేద,గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ ఫీజు బకాయిలను విడుదల చేయాలని విద్యార్థులు కోరారు.

Tags