విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..
విద్యారంగాన్ని ,విద్యార్థి లోకాన్ని విస్మరించి బతికి బట్ట కట్టిన ప్రభుత్వాలు చరిత్రలో లేవు...
ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్ కామెంట్స్
హనుమకొండ ప్రజామంటలు మార్చి 20 :
విద్యారంగ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విద్యారంగానికి కేటాయించిన నిధులను చూస్తే అర్థమవుతుందని...గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విద్యార్థి లోకాన్ని పూర్తిగా విస్మరించినందుకే ప్రత్యామ్నాయని కోరుకున్నారని.. మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో విద్యా రంగానికి 15% నిధులు కేటాయిస్తానని నయవంచన చేశారని.... ఇది ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం అని భాష బోయిన సంతోష్ విమర్శించారు. స్థానిక కేడిసి డిగ్రీ కళాశాల ముందు ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి , విద్యా వ్యతిరేక బడ్జెట్ను. నిరసిస్తూ ప్లకార్డ్ ప్రదర్శన చేశారు...ఈ సందర్భంగా *ఏఐఎస్ఎఫ్ హన్మకొండ* *జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.57% 0. 2%నిధులు కేటాయించడంలోనే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తు శుద్ధి ఉందని తెలిసిందన్నారు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో డొల్లతనం కనిపిస్తుంది అన్నారు కనీసం విద్యారంగానికి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా 15% బడ్జెట్ కేటాయించలేని నీ సహాయ పరిస్థితుల్లో ప్రభుత్వ నెటివేయబడిందని మినిమం బడ్జెట్ను కూడా విద్యారంగని కేటాయించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉన్న ఉన్నత విశ్వవిద్యాలయాలకు తక్కువ నిధులు. కేటాయించడం తగదు.
పెండింగ్ స్కాలర్ షిప్స్ ఫీజు రీయంబర్స్ గురించి ప్రస్థావన లేదని ఆయన విమర్శించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు. సుమారుగా 11,600 కోట్ల రూపాయలను కేటాయిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పరిస్థితి ఏంటి.
కస్తూరిబా ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ఊసే లేదు డిగ్రీ కళాశాలలు, ఇంటర్నేషనల్ పాఠశాలలు, స్వంత భవనాలు నిధులు లేవు. ఈ నిధులు విద్యా అభివృద్ధి కోసం కాదు ,విద్యా దారిద్య్రానికి దారి తీస్తాయని అన్నారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 30%అధిక నిధులు కేటాయించి విద్యారంగా అభివృద్ధికి పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఆయన కోరారు.. లేనియెడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కుక్కల కుమార్ , జిల్లా సమితి సభ్యులు పసల వినయ్ , నాయకులు ఆత్కూరి రవి, బొమ్మన బోయిన సురేష్, రామరాజు అనిల్ సునీల్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అందాల పోటీల పేర మహిళల కించపరచడం తగదు - దేవీప్రసాద్

శనివారం నుండి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
.jpg)
విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్

#Draft: Add Your Title

రాజస్థాన్ జిల్లా పరిషత్ బృందంతో మాజీ మంత్రి రాజేశం గౌడ్

ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.
