తెలంగాణలో మొదటి స్థానానికి ఎదిగి మల్టీ స్టేట్ బ్యాంకు గా గాయత్రి బ్యాంకు.  బ్యాంక్  చైర్మన్ లక్ష్మారెడ్డి

On
తెలంగాణలో మొదటి స్థానానికి ఎదిగి మల్టీ స్టేట్ బ్యాంకు గా గాయత్రి బ్యాంకు.  బ్యాంక్  చైర్మన్ లక్ష్మారెడ్డి

 

గొల్లపల్లి ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా యందలి గొల్లపెల్లి యందు ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క 57 వ శాఖను బ్యాంకు చైర్మన్  ముత్యాల లక్ష్మణ్ రెడ్డి  ప్రారంభించారు. ఈ రోజు జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లు, పురప్రముఖులు, సహకార అధికారులు, ముఖ్యకార్యనిర్వహణాధికారి గార్లు పాల్గొని బ్యాంకు యొక్క వివిధ విభాగాలను ప్రారంభించారు.

అనంతరం జరిగిన సమావేశంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ ముత్యాల లక్ష్మణ్ రెడ్డి  మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ప్రారంభించబడిన గాయత్రి బ్యాంకు నిరంతర కృషితో నేడు మల్టీస్టేట్ బ్యాంకుగా రూ॥ 3062.50 కోట్ల వ్యాపారాన్ని సాధించి తెలంగాణలోని కో-ఆపరేటివ్ బ్యాంకులలో అతి పెద్ద బ్యాంకుగా అవతరించి కో-ఆపరేటివ్ వ్యవస్థలో అగ్రగామిగ పనిచేస్తున్నామని అన్నారు. గొల్లపెల్లి ప్రాంత ప్రజలు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకోని బ్యాంకును ఆదరించాలని కోరారు. సహకార వ్యవస్థలో, కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా పనిచేస్తూ, 24 సంవత్సరాల కాలంలోనే 1741.15 కోట్ల డిపాజిట్లతో, 1321.35 కోట్ల ఋణాలను కలిగి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా 56 బ్రాంచీలతో, 7 లక్షల 62 వేల మంది వినియోగదారులను కలిగి అన్ని విధాలుగా మంచి అభివృద్ధిని సాధించామని అన్నారు. బ్యాంకు యందు మొబైల్ బ్యాంకింగ్, ఎఇపిఎస్, యు.పి.ఐ. ఎ.టి.ఎమ్ సర్వీసులు, ఆర్.టి.జి.ఎస్ వంటి టెక్నాలాజికల్ సేవలతో పాటుగా, నిరక్షరాస్యులకు సహాయకంగా ఉండేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశామని, ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తుందని, ఖాతాదారులకు అవసరమైన ఫోటో మరియు జిరాక్స్లను బ్యాంకు యందే ఉచితంగా అందిస్తూన్నామని తెలియజేశారు.

బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్  మాట్లాడుతూ బ్యాంకు ముఖ్య ఉద్దేశ్యం సామాన్య మధ్యతరగతి, వర్తక వాణిజ్య వర్గాల ప్రజలకు కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా సేవలందించడమేనని, ఆన్లైన్ సేవలతో పాటుగా ATM, AePS, UPI, RTGS/NEFT వంటి అధునాతన సేవలను అందిస్తున్నామని, గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతా ద్వారా 1 లక్ష రూపాయల ప్రమాదభీమా సౌకర్యాన్ని అందిస్తున్నామని, వర్తక, వ్యాపార, ఉద్యోగులకు కావలసిన అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను సత్వరంగా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఇట్టి సేవలను గొల్లపల్లి నగర వాసులు వినియోగించుకొని బ్యాంకును ఆదరించాలని కోరారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మరో 09 బ్రాంచీలను ప్రారంబించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తద్వారా మొత్తం 66 బ్రాంచీలకు చేరుకుంటామని అన్నారు.

అనంతరం బింగి తిరుపతి,  ఏ జి ఎం మాట్లాడుతూ వినియోగదారులు మాపై చూపిస్తున్న ఎనలేని ఆదరాభిమానాల వల్ల బ్యాంకును మరింత అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని, నగరవాసులు మరియు పరిసర గ్రామాల ప్రజలు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకొని బ్యాంకును ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం బ్రాంచి హెడ్ నేరెళ్ళ మునీందర్  మాట్లాడుతూ ఆధార్ నంబరు ద్వారా నగదు బదిలీ పథకం క్రింద వచ్చు సబ్సిడీ బదలాయింపులను, ప్రభుత్వ ఆసరా పెన్షన్లను పొందవచ్చని, బంగారు ఆభరణాలపై ఋణాలను అందజేస్తామని రైతులకు వ్యాపారులకు ఆస్థి తనఖాపై ఋణ సౌకర్యం కల్పిస్తామని, వినియోగదారులు బ్యాంకును ఆదరించి ప్రోత్సహించాలని కోరారు.

బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పుర: ప్రముఖులు, వ్యాపారులు, సహకార అధికారులు, బ్యాంకు పాలక వర్గ సభ్యులైన ఎమ్. సౌజన్య, ఎ. రాజిరెడ్డి, ఎ.సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, జి.గంగాధర్, వి. మాధవి, ఆర్. సతీష్, ఎస్. రవి కుమార్ గార్లు, మరియు ఇతర సభ్యులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం 

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం  జిల్లా ప్రధానకార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ  గొల్లపల్లి  (జగిత్యాల)మార్చి 17 (ప్రజా మంటలు) నర్సింగాపూర్ గ్రామం 437, 251 సర్వే నంబరులో వందల కొద్ది ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా ధరణి పట్టాలు సృష్టించుకున్న వాటిని రద్దు చేయాలని బిజెపి నాయకులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నాయకులు మాట్లాడుతూ నర్సింగాపూర్లో ప్రభుత్వ భూమిని కబ్జా...
Read More...
Local News  State News 

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష మెట్ పల్లి మార్చ్ 17 :  మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించిన కేసులో మెట్ పల్లి కోర్టు, ఇద్దరు నిందితులకు 2 నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి పదివేల రూపాయలు జరిమానా విధించింది  మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన పీట్ల సూరి (21)  కొమిరి నరేష్ (20 )...
Read More...
Local News 

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.    జగిత్యాల మార్చి 17(ప్రజా మంటలు) ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ బి.ఎస్.లత తో...
Read More...
Local News 

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .జగిత్యాల మార్చి 17(ప్రజా మంటలు)  సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు,తహసిల్దార్లు,అదనపు కలెక్టర్ బి.ఎస్ లత తో కలసి సమీక్ష నిర్వహించారు.ఆయా మండల వారిగా ధరణి దరఖాస్తులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో వున్న అన్ని దరఖాస్తు ఈ నెల చివరి వరకు పూర్తి...
Read More...
Local News 

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు *  కాంగ్రెస్ అంటే మహిళలని మోసం చేయడమే...        *  బీజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి... సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు):   వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడిన మాటలు అన్ని తప్పుల తడక అని కాంగ్రెస్ అంటే మహిళాభివృద్ధి కాదని మహిళలను మోసం చేయడమే కాంగ్రెస్ విధానం అని ముఖ్యమంత్రి...
Read More...
Local News  State News 

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

 ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు (రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494) ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగానంద), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాల సందర్భంగా, దేవస్థానం లోని ప్రధానాలయాలలో సోమ వారం విధివిదాన  సాంప్రదాయ ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన యజ్ఞా చార్యులు కందాల పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, ఆలయాల...
Read More...
Local News 

విద్యకు బడ్జెట్​ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

విద్యకు బడ్జెట్​ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి *  సికింద్రాబాద్​ పీజీ కాలేజీ వద్ద ఏబీవీపీ ధర్నా  * ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు): నేడు ప్రవేశపెట్టబోయే రాష్ర్ట బడ్జెట్ లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ 15 శాతం నిధులను కేటాయించాలని, తక్షణమే విద్యామంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం సికింద్రాబాద్​ పీజీ కాలేజీ వద్ద...
Read More...
Local News  State News 

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ మహిళలను మోసం చేశామని ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటు -  *కాంగ్రెస్ మెనిఫెస్టో చిత్తుకాగితమని తేలిపోయింది* *మహిళా వ్యతిరేక సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలుస్తారు  శాసన మండలి సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ బండారం  మిర్చికి 25 వేల మద్ధతు ధర ప్రకటించాలి: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ మార్చ్ 17:   మహిళలకు మోసం చేశామని స్వయంగా కాంగ్రెస్...
Read More...
Local News 

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత 

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత  సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు) : పద్మారావు నగర్ లోని శ్రీవత్స నృసింహ పాలపర్తి మోరంపూడి ఫౌండేషన్ కార్యాలయం ఆవరణలో సోమవారం స్వర్గీయ పాలపర్తి వెంకటేశ్వర్లు వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం పలువురు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేశారు. ముగ్గురికి వీల్ చైర్లు, ఒకరికి కమోడ్ తో కూడిన వీల్ చైర్, ఒకరికి ఎడమ కాలు,...
Read More...
Local News 

భయం వీడితే విజయం మనదే...

భయం వీడితే విజయం మనదే...   * టెన్త్​ విద్యార్తులకు  వీడ్కోలు సికింద్రాబాద్​, మార్చి 17 ( ప్రజామంటలు): పరీక్షలంటే భయపడకూడదని, జాగ్రత్తగా, ప్రశాంతంగా చదివితే పరీక్షల్లో విజయం మన సొంతం అవుతుందని పలువురు వక్తలు విద్యార్థులకు సూచించారు. సోమవారం భోలక్​ పూర్​ కృష్ణవేణి టాలెంట్​ స్కూల్​ లోని పదవతరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి..మంచి ఫలితాలు...
Read More...
Local News  State News 

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక     *  డీఎంఈ డా.నరేంద్ర కుమార్​ వార్నింగ్​    *  గాంధీ ఆసుపత్రి తనిఖీ సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు) : గాంధీ ఆసుపత్రి,మెడికల్ కాలేజీలో ప్రతి ప్రొఫెసర్​, అసోసియేట్​ ప్రొఫెసర్లు, హెచ్​ఓడీ లందరూ ఓపీ, ఐపీ టైమింగ్స్​ పాటించాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్టేట్​ డైరెక్టరేట్​ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్​( డీఎంఈ) డా.నరేంద్రకుమార్​ వార్నింగ్ ఇచ్చారు....
Read More...
Local News 

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత ▪️ ▪️జగిత్యాల మార్చి 17( ప్రజా మంటలు)  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్ లో కలిసి శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి  నవమ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు విశ్వ బ్రాహ్మణ సంఘం బాధ్యులు జగిత్యాల  విశ్వ బ్రాహ్మణ సంఘం  జిల్లా...
Read More...