విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
జగిత్యాల మార్చి 15(ప్రజా మంటలు)
పైలెట్ ప్రాజెక్టు కింద
నేటి నుండి జిల్లాలోని 21 ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా విద్య బోధన ప్రారంభం.
జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా బోధనను ప్రారంభించిన కలెక్టర్.
ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కృత్రిమ మేధను వినియోగిస్తూ సులభతరంగా విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ తెలిపారు.
శనివారం జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ) తో విద్య బోధన ను కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కంప్యూటర్ లో చేస్తున్న తెలుగు, ఆంగ్లానికి సంబంధించిన ప్రమాణాలను పరిశీలించారు. గణితంలో సంఖ్యా భావాలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు బాగాహారాలు, తెలుగులో విద్యార్థులు చేస్తున్న ప్రమాణాలను కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఈరోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 21 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ సహకారంతో వర్చువల్ రియాల్టీ విధానములో పాఠాలు చెప్పేలా ప్రారంభించుకున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 3 నుండి 5 తరగతి విద్యార్థులకు కనీస విద్య ప్రమాణాలు, అభ్యాసన సామర్థ్యాలను పెంచే లక్ష్యంగా ఏఐ ద్వారా బోధిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.
ఇప్పటికే ఆరు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా కార్యక్రమాన్ని ప్రారంభించగా అక్కడ మంచి ఫలితాలు ఇచ్చినందున రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పాటు జగిత్యాల జిల్లాలో కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో పులి మధు సుధన్ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాము, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు.తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

పెద్ధపూర్ జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో అవెర్నెస్ ర్యాలీ

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన తహసిల్దార్ ప్రసాద్.

మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ
