సామల వేణు కు గోల్డెన్‌ మెజీషియన్‌  అవార్డు

On
సామల వేణు కు గోల్డెన్‌ మెజీషియన్‌  అవార్డు

 లైఫ్​ టైమ్​ అచీవ్​ మెంట్ అవార్డును ప్రధానం చేసిన ఎంపీ శ్రీభరత్​

సికింద్రాబాద్​ ఫిబ్రవరి 24 (ప్రజామంటలు) :

తెలంగాణకు చెందిన ప్రఖ్యాత ఇంద్రజాలికుడు సామల వేణుకు లైఫ్​ టైమ్​ అచీవ్​మెంట్ అవార్డు ( గోల్డెన్‌ మెజీషియన్‌ ) లభించింది. బీఎస్​ రెడ్డి స్థాపించిన ఇండియన్​ మ్యాజిక్​ అకాడమీ (ఐఎంఏ) పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని  ఇంటర్నేషనల్​ మేజీషియన్​ డే సందర్బంగా  ప్రముఖ మెజీషియన్లు పీసీ సర్కార్​ జూనియర్​, సామల వేణులకు లైఫ్​ టైమ్​ అచీవ్​ మెంట్ అవార్డులను ప్రకటించారు. వైజాగ్​ లోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండువగా సాగింది.

విశాఖ పట్నం ఎంపీ శ్రీభరత్​, సెంచూరియన్‌ యూనివర్శిటీ ఛాన్సలర్‌ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు లు సామల వేణు, పీసీ సర్కార్​ జూనియర్​ లకు గోల్డెన్​ మెజీషియన్​ అవార్డులను అందచేశారు. దేశ, విదేశాల్లో వేలాది ఇంద్రజాల ప్రదర్శనలు నిర్వహించిన సామల వేణు సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రకటించినట్లు బీఎస్​రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ శ్రీభరత్​ సామల వేణును ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో ఇంకా కొన్ని చోట్ల ఉన్న మూఢ నమ్మకాలను నిర్మూలించేందుకు మెజీషియన్లు కృషి చేయాలని, సీనియర్​ మెజీషియన్లు తమ ఆధ్వర్యంలో కొత్త మెజీషియన్లను తయారు చేయాలని ఎంపీ కోరారు. ప్రభుత్వం తరపున మెజీషియన్లకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. 

గర్వంగా, ఎంతో ఆనందంగా ఉంది: వేణు

45 ఏళ్ల తన అనుభవంలో 35 దేశాల్లో 7వేలకు పైగా ఇంద్రజాల  ప్రదర్శనలిచ్చానని అవార్డు గ్రహీత సామల వేణు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ...సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో విద్యాబోధనకు అనుగుణంగా తెలుగు  యూనివర్శిటీలో డిప్లొమా ఇన్‌ మ్యాజిక్‌ కోర్సును అందుబాటులోకి  తెచ్చి ఏటా కనీసం 25మంది ఆ కోర్సును నేర్చుకుని, వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయగలిగానన్నారు. ఒక షో చేయాలంటే మేకప్‌, కాస్ట్యూమ్స్‌, లైటింగ్‌ ఇలా అన్ని అంశాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నది లేనట్టు..లేనిది ఉన్నట్టు భ్రమ కల్పించాలన్నారు. తాను ఈ వృత్తిలో ఇన్నాళ్లు మనగలిగానంటే అందుకు కుటుంబ సభ్యులతో పాటు అందరి సహకారం మరువలేనిదని, తన స్నేహితుడు బీఎస్‌ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలన్నారు. ఇంద్రజాలికులకు  లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు రావడం ఎంతో గర్వకారణమన్నారు.

మ్యాజిక్‌ చేయడంలో గిన్నిస్‌ రికార్డులు నెలకొల్పిన పీసీ సర్కార్‌ను ఆదర్శంగా తీసుకునే తాను కూడా ఈ వృత్తిని ఎంచుకున్నానని వేణు తెలిపారు.జూనియర్‌ పీసీ సర్కార్‌ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉందని, గతంలో తన ప్రదర్శనల్ని చూసి ఏపీ సీఎం చంద్రబాబు,  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వంటి వారెందరో మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. తనతో పాటు విశాఖలో పురస్కారాలందుకున్న సహచర మెజీషియన్లందరికీ వేణు అభినందనలు తెలిపారు.

Tags

More News...

Local News  State News 

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి సీఎం ప్రజావాణి సక్సెస్ రేటు 66 శాతం  సీఎం ప్రజావాణి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డి- పాల్గొన్న హైడ్రా కమీషనర్ రంగనాధ్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య  ## ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో  "" సిటిజన్ సెంట్రిక్...
Read More...
Local News  State News 

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు (రామ కిష్టయ్య సంగన భట్ల) శివకేశవుల సన్నిధి, భక్తుల పాలిటి పెన్నిధిగా రాష్ట్రంలో పేరెన్నికగన్న హరిహర క్షేత్రమైన ధర్మపురి పట్టణంలో బుధ వారం భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (యోగ, ఉగ్రుణ శ్రీ వేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా,  యోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ, వేంకటేశ్వర స్వాముల వార్షిక బ్రహ్మోత్సవాలను  పురస్కరించుకుని...
Read More...
Local News 

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు* భీమదేవరపల్లి మార్చి 12 (ప్రజామంటలు) హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో JSR గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించడం జరిగింది. వరుసగా నాల్గవ సంవత్సరం ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బాటసారులు,ప్రజలు,ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు...
Read More...
Local News 

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. గొల్లపల్లి / మల్యాలమార్చి 11 (ప్రజా మంటలు): మల్యాలలో అస్మా సుల్తానా నిన్న రాత్రి తన ఇంటి కి తాళాలు వేసి వారి బిడ్డ ఇంటికి జగిత్యాల కు వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, ఇంట్లోని బీరువాలో గల 5 తులాల బంగారు ఆభరణాలు,...
Read More...
Local News 

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం     అగంతకున్ని పట్టుకొని దేహశుద్ది    * అనంతరం పోలీసులకు అప్పగింత సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు):పద్మారావునగర్​ శ్రీసాయిబాబా టెంపుల్​ పక్కనున్న శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం ఓ అగంతకుడు చోరికి విఫల యత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలోనికి ప్రవేశించిన దాదాపు 50 ఏండ్ల వయస్సు కలిగిన ఓ వర్గానికి...
Read More...
Local News 

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్    సికింద్రాబాద్​, మార్చి 11 ( ప్రజామంటలు):   సంజీవరెడ్డి నగర్ పరిధిలోని గురుమూర్తి నగర్‌లో గల వినాయక స్వామి ఆలయంలో శనివారం రాత్రి దుండగులు పంచలోహ విగ్రహాలను దొంగిలించిన విషయం విదితమే. ఈనేపద్యంలో  ఘటనపై సమాచారం అందుకున్న సనత్‌నగర్ కాంగ్రెస్​ ఇన్‌చార్జ్ డా. కోట నీలిమ వెంటనే స్పందించారు. చోరీకి గురైన విగ్రహాలను త్వరగా గుర్తించి, దొంగలను...
Read More...
Local News 

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్​ పై దారి వదలండి

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్​ పై దారి వదలండి సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు.  సిటీలోని వివిధ ప్రాంతాల  నుంచి బస్సులు, వివిధ వాహనాల ద్వారా వచ్చే భక్తులకు ఇక్కడున్న మెయిన్​ రోడ్డు మద్యలోని మెట్రో డివైడర్ ఇబ్బందిగా మారింది. ఆలయానికి ఎదురుగా అవతల వైపు...
Read More...
Local News 

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు   ఎస్ ఈ సాలియా నాయక్    జగిత్యాల మార్చి11( ప్రజా మంటలు) రాబోవు వేసవి కాలానికి విద్యుత్ డిమాండ్ అనుగుణంగా అన్ని రకాల నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్ తెలిపారు అందులో భాగంగా జగిత్యాల డివిజన్ పరిధిలోని టౌన్ 1 సెక్షన్  లో వీక్లీ బజార్ స్కూల్ ఏరియా లోని  SS-234/100 కె.వి.ఏ నియంత్రిక సామర్థ్యంని...
Read More...
Local News 

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష. 

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.     జగిత్యాల మార్చి 11(ప్రజా మంటలు)జిల్లాలో  మంగళవారం జరిగిన ప్రథమ సంవత్సర గణిత శాస్త్రము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రము మరియు ఒకేషనల్ పరీక్షలలో 8021 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 7771 మంది విద్యార్థులు హాజరైనారు 250 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు పరీక్షల కన్వీనర్ బి. నారాయణ తెలిపారు. మొత్తం 96. 9 శాతం...
Read More...
Local News 

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ  ముఠా అరెస్ట్..

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ  ముఠా అరెస్ట్.. మెటుపల్లి / ఇబ్రహీంపట్నం మార్చి 11 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): మెట్ పల్లి,ఇబ్రహింపట్నం మండలాల పరిసర ప్రాంతాలలో గత కొంత కాలం నుండి అక్రమ ఇసుక, మొరం రవాణా, భూమి సెటిల్‌మెంట్ దందాలు చేస్తూ, వారి అక్రమాల పై ఎదురు తిరిగిన వారిపై  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీ...
Read More...
Local News 

ధరూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

ధరూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి    జగిత్యాల మార్చి 10(ప్రజా మంటలు) రూరల్ మం ధరూర్ గ్రామంలో   శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శివ పంచాయతన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజులపాటు జరిగినాయి.ఈ సందర్భంగా సోమవారం  ఏకకుండాత్మక హవనము, కళాన్యాస హోమము, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట ,ప్రాణ ప్రతిష్టాపన ,నేత్రోన్మీలనము, దృష్టి
Read More...
Local News 

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం  జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల మార్చి 11( ప్రజా మంటలు)భావోద్వేగాలకు తగ్గట్టుగా సంగీత బాణులను  వినిపించే పోలీస్ బ్యాండ్ పోలీసు శాఖలో ఎంతో ప్రాధాన్యత కలిగిన భాగంగా నిలుస్తుందని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఎస్పి  చేతులమీదుగా  పోలీస్ బ్యాండ్ సిబ్బంది కి స్పోర్ట్ డ్రెస్ ను...
Read More...