నిర్లక్ష్యంగా లారీని నడిపి ఒకరి మరణానికి కారణమైన నిందితుడికి 18 నెలల జైలు శిక్ష, 5500 రూపాయల జరిమాన
*
జగిత్యాల ఫిబ్రవరి 21(ప్రజా మంటలు)
ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం గ్రామానికి చెందిన గటికె కృష్ణమూర్తి అనే వ్యక్తి తేదీ 02-05-2018 రోజున పని నిమిత్తం రాయపట్నం నుండి ధర్మపురికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రాత్రి 8 గంటలకు ద్విచక్ర వాహనం పై వస్తున్న క్రమంలో రామయ్య పల్లె బస్ స్టేజ్ వద్ద వెనుక నుండి AP 16 AY 0689 గల లారీ అతివేగంగా వచ్చి వెనుక నుండి కృష్ణమూర్తి ద్విచక్ర వాహన ఢీకొట్టగా కృష్ణమూర్తి తీవ్ర గాయాలయి అయి అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ యొక్క ప్రమాదం సంభవించినదని తెలిసినా కూడా లారీ డ్రైవర్ జగిరి మల్లేశ్,26 సంవత్సరాలు అనే వ్యక్తి అక్కడ ఆగకుండా వెళ్ళగా దీన్ని గమనించిన స్థానికులు లారీని వెంబడించి రాయపట్నం దగ్గర అపి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఇట్టి విషయం గురించి గటికె కృష్ణమూర్తి బార్య అనురాధ ధర్మపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడి పై కేసు నమోదు చేసి విచారణ జరిపి ఛార్జ్ షీటు దాఖలు చేశారు.
సాక్షులను విచారించిన జడ్జి శ్యామ్ ప్రసాద్, జె ఎం ఎఫ్ ఎస్ ధర్మపురి నిందితుడైన మల్లేష్ కు 18 నెలల జైలు శిక్ష, 5500/- రూపాయల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు. పై కేస్ లో నిందితునికి శిక్ష పడటం లో కృషి చేసిన అడిషనల్ పీపీ రాజేష్ ,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, కోర్ట్ కానిస్టేబుల్ రాము ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా కలెక్టరు ని కలిసిన జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కార్యవర్గం

ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ పోటీల ఆహ్వాన పత్రం పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లకు అందజేత

విద్యార్థినులకు స్కూటీలు ఏవి ? బి అర్ ఎస్ నాయకుల నిలదీత

టీడీఎఫ్ ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్రెడ్డికి సీఎస్ఆర్ అవార్డు

గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
