రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు యూరియా కొరత లేకుండా చూస్తాం - ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
బోనస్ డబ్బులు కూడా సాధ్యమైనంత త్వరగా రైతులకు అందేలా చర్యలు తీసుకుంటాం
ధర్మపురి ఫిబ్రవరి 20:
ధర్మపురి మండలం జైన గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని గురువారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులతో కలిసి సందర్శించి,రైతులతో మాట్లాడారు.
*ధర్మపురి మండలం జైన గ్రామంలో యూరియా నిల్వలు సరిపడ లేక పంట సాగుకు కొంత ఇబ్బందికి జరుగుతుందని రైతులు నా దృష్టికి తీసుకురావడం జరిగిందని,వెంటనే సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ,మరియు డైరెక్టర్,జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ధర్మపురి నియోజక వర్గంలోని 12 సహకార సంఘాలకు సరిపడ యూరియాను పంపించాలని కోరడం జరిగిందని,వారు కూడా వెంటనే స్పందించి ఈ రోజు రాత్రి వరకు యూరియాను పంపించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని,రైతులు ఎలాంటి అందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
గత ఏడాది కంటే ఈ సారి కొంత రైతులు ఎక్కువ యూరియాను వాడటం జరుగుతుందని,ఇతర పంటల వైపు కూడా రైతులు మొగ్గు చూపడంతో కొత్త యూరియా వాడకం ఎక్కువగా అవ్వడం జరిగిందని,అయినప్పటికీ రైతులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులతో మాట్లాడి యూరియాను పంపిస్తామని,వడ్ల కొనుగోలు కూడా ఎక్కడ కట్టింగ్ లేకుండా పూర్తి చేయడం జరిగిందని,కానీ గత పాలకులు మాత్రం రైతులను మిలర్లతో మాట్లాడుకోండి అని వ్యగంగా సమాధానం చెప్పడం జరిగిందని,కానీ మేము అలా కాకుండా సమస్య ఉంది అని తెలిసిన వెంటనే సొసైటి వద్దకు వచ్చి రైతులతో మాట్లాడటం జరిగిందని తెలిపారు.
అదే విధంగా బొనస్ డబ్బులు కూడా కొంత మంది రైతులకు రాలేదు అని చెప్పడం జరిగిందని,రైతులకు పూర్తిగా మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని,బోనస్ కూడా సాధ్యమంత త్వరలో రైతులకు అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష
.jpeg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
.jpg)
భయం వీడితే విజయం మనదే...
