దళిత బంధు నిధులను బడ్జెట్ లోపు విడుదల చేయాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఎస్సీ వర్గీకరణలో రేవంత్ రెడ్డి పాత్రేమీ లేదు
- షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికను బహీర్గతం చేయలి
- అన్ని వర్గాలకు న్యాయం చేసేలా వర్గీకరణ చేపట్టాలి
- వర్గీకరణ వంకతో జాబు క్యాలెండర్ అమలును నిలిపివేయవద్దు
- దళిత బంధు సాధన సమితి సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ ఫిబ్రవరి 20:
ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని, సుప్రీం కోర్టు తీర్పు వల్ల వర్గీకరణకు బాటలు పడ్డాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. దళితుల మధ్య పంచాయతీ పెట్టవద్దని, ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
గురువారం నాడు తన నివాసంలో జరిగిన దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు మహేష్ కోగిల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి, వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారని, వర్గీకరణకు, ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి లింక్ పెడుతున్నారని అన్నారు. వర్గీకరణ వంకతో జాబు క్యాలెండర్ అమలును నిలిపివేయవద్దని సూచించారు. కోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడిచినా ఆలూలేదు చూలు లేదన్నట్లుగా ఉందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి మాటలు చెబితే నమ్మరని ఢిల్లీ నుంచి ప్రియాంకా గాంధీని తీసుకొచ్చి హామీ ఇప్పించారని, దళిత కుటుంబాలకు రూ 10 లక్షలకు బదులు రూ 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి కుదేలు చేశారని తెలిపారు.
ఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 18 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులను విడుదల చేయాలని సవాలు చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే ఈ డబ్బులు విడుదల చేయాలని అన్నారు. ఎస్సీలకు బడ్జెట్ లో రూ. 33 వేల కోట్లు కేటాయించి... కేవలం రూ 9800 కోట్లే ఖర్చు చేశారని ఎండగట్టారు.
రేవంత్ రెడ్డిది మనసున్న ప్రభుత్వం కాదని, మానవత్వం లేదని విమర్శించారు. కేసీఆర్ ఆలోచన పెద్దగా ఉండేదని, చిన్నవాళ్లపై చూపు ఉండేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చిన్నదని, చూపు పెద్దవాళ్లపైనే ఉందని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలదండ కూడా వేయలేదని, అంబేద్కర్ తో పాటు, ఆయన వారసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు.
అంబేద్కర్ జయంతిలోపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు మంత్రివర్గం మొత్తం వెళ్లి పూలదండలు వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వం మూసివేసిన గేట్లను బద్దలుకొట్టి తాము అంబేద్కర్ ను గౌరవించుకుంటామని తేల్చిచెప్పారు. అంబేద్కర్ ని గౌరవించని ముఖ్యమంత్రి... మన ఆకలిని అర్థం చేసుకుంటారా ? అని ప్రశ్నించారు. అట్టడుగు వర్గాల వారిని వేలు పట్టుకొని ముందుకు నడిపించాలన్నది కేసీఆర్ ఆలోచన అని, పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేయాలని కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు ఆత్మబంధువు అంబేద్కర్ అని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని, అంబేద్కర్ పై ప్రేమను ప్రదర్శించడానికి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. రెండు మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని, దళితులకు మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు.
దళితులను ధనవంతులను చేయాలన్న ఉద్ధేశంతో కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టారని, ఎన్నికల కోసం కాకుండా... రానున్న తరాల కోసం కేసీఆర్ ఆలోచిస్తారని తెలిపారు.
మరోవైపు, అట్టడుగు వర్గాలకు సరైన మార్గం చూపాలన్నదే కేసీఆర్ ఆలోచన విధానమని, దళితుల్లో పేదరికాన్ని పారద్రోలడానికి కేసీఆర్ ఆనాడు సంకల్పించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ 10 లక్షల ఇవ్వాలన్న విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని, అంత ధైర్యంగా నిర్ణయం తీసుకున్న సాహసోపేత నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. దళితుల కోసం రూ 57 వేల కోట్లు ఖర్చు చేయాలని కేసీఆర్ భావించారని, కేసీఆర్ ఆలోచన అమలైతే దళిత కుటుంబాల్లో దరిద్రం ఉంటుందా ? అని అడిగారు.
దళిత బంధును అమలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దళితులను మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. దళిత బంధు సాధన సమితి ఉద్యమానికి అండగా ఉన్నందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఎమ్మెల్సీ కవితకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ , చిటిమల్ల సమ్మయ్య, మడికొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
