చిన్నారెడ్డితో పుదుచ్చేరి రాష్ట్ర మాజీ హోం మంత్రి కంద స్వామి భేటీ
చిన్నారెడ్డితో పుదుచ్చేరి రాష్ట్ర మాజీ హోం మంత్రి కంద స్వామి భేటీ
వచ్చే ఏడాది జరుగనున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలపై చర్చ -పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీకి చిన్నారెడ్డి సెంటిమెంట్
హైదరాబాద్ ఫిబ్రవరి 13:
పుదుచ్చేరి రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి కంద స్వామి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
గురువారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో జరిగిన ఈ భేటీలో పుదుచ్చేరి రాష్ట్రంలో వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల అంశం చర్చకు వచ్చింది.
కొన్నేళ్ల క్రితం పుదుచ్చేరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా చిన్నారెడ్డి ఉన్న సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పుదుచ్చేరి రాష్ట్రానికి చిన్నారెడ్డి సెంటిమెంట్ గా మారడంతో ఆ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి కందస్వామి హైదరాబాద్ కు వచ్చి చిన్నారెడ్డి తో సమావేశమయ్యారు.
పుదుచ్చేరి రాష్ట్రంలో పర్యటించాలని చిన్నారెడ్డిని కంద స్వామి ఆహ్వానించారు. పుదుచ్చేరిలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేయాల్సిందిగా కంద స్వామి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని కోరారు. త్వరలోనే పుదుచ్చేరి రాష్ట్ర పర్యటనకు వస్తానని చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. ఈ భేటీలో టిపిసిసి ఓబీసీ సెల్ సమన్వయకర్త విక్రమ్ యాదవ్ కూడా ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
