రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రైతుల సంక్షేమం కోసం రూ. 55,256 కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వం.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు
పదేళ్ల కాలంలో రైతులకు బీ.ఆర్.ఎస్. చేసిందేమీ లేదు
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి
హైదరాబాద్ ఫిబ్రవరి 11:
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తోందని, రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర కాలంలోనే రైతుల సంక్షేమం కోసం రూ. 55,256 వేల కోట్లు వ్యయం చేసిందని చిన్నారెడ్డి తెలిపారు. రైతు భరోసా ద్వారా సుమారు రూ. 40 వేల కోట్లు రైతుల ఖాతాలో నేరుగా జమ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని చిన్నారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి పంట కాలంలో 25 లక్షల 36 వేల మంది రైతులకు రూ. 20,617 వేల కోట్లు రుణ మాఫీ చేసిందని చిన్నారెడ్డి తెలిపారు.
రైతులకు మంచి చేయాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం తపిస్తోందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, రైతుల కోసం చేసింది ఏమీ లేదని చిన్నారెడ్డి ఆరోపించారు.
అధికారం కోల్పోయిన తర్వాత బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుతున్నారని చిన్నారెడ్డి అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
