టిఎన్జిఒ భవన్ లొ ప్రజా పాలన దినోత్సవం వేడుకలు.

On
టిఎన్జిఒ భవన్ లొ ప్రజా పాలన దినోత్సవం వేడుకలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 జగిత్యాల సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు )

 టిఎన్జిఒ జిల్లా శాఖ కార్యాలయం లొ టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ అధ్యక్షతన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించటం జరిగింది.

ఈ సందర్బంగా టిఎన్జిఒ సంఘం జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ మరియు జిల్లా కార్యదర్షి మిర్యాల నాగేందర్ రెడ్డిలు తెలంగాణ పోరాట యోధులను స్మరించుకొని, జిల్లా లొ పని చేస్తున్న ఉద్యోగులందరికి తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇట్టి కార్యక్రమానికి పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, టీఎన్జీఒ నాయకులు సాహెద్ బాబు, రవిందర్, రాజేందర్, రవి కుమార్, మధుకర్, రాజేశం, అరుణ, సీనియర సిటిజన్స్ సంఘం నాయకులు విశ్వనాథం, ప్రకాష్, యాకూబ్, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags