రామ కథా శ్రవణం... ముక్తి దాయకం - డాక్టర్ సంగన భట్ల నరసయ్య
(రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్)
శ్రీ సీతా రామ కథా శ్రవణం ముక్తి దాయకమని,
లబ్దప్రతిష్టులైన సాహితీ వేత్త, చారిత్రక సాహిత్య పరిశోధకులు, సంస్కృతాంధ్ర భాషా పండితులు, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ నాట్య మండలి అధ్యక్షులు, సంగీతజ్ఞుులు, పౌరాణిక నాటక నటులు, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ ప్రాచ్య కళాశాల విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ సంగన భట్ల నరసయ్య ఉద్ఘాటించారు. రామ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా క్షేత్రంలో గోదావరీ తీరాన వెలసిన రామాలయంలో, దేవాలయ వంశ పారంపర్య నిర్వాహకులు అర్చకులు తాడూరి రఘునాథ్ శర్మ ఆద్వర్యంలో శ్రీరామ నవమి వరకు
నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణ సందర్భంగా గురువారం డాక్టర్ నరసయ్య ఆధ్యాత్మిక ప్రవచనం గావిస్తూ, రామాయణ విశేషాలను వివరించారు. క్రౌంచ పక్షుల మృతి కళ్ళారా చూసిన మహాకవి వాల్మీకి
శోకం శ్లోకంగా, గ్రంథస్థ తొలి కావ్య రచనగా రూపు దిద్దుకున్న నేపథ్యాన్ని వివరించారు. ఉత్తర రామాయణం వాల్మీకి రాయలేదని ప్రక్షిప్తమని, ఉత్తర రామాయణ రచన అవాల్మీకమని సోదాహరణంగా వివరించారు. మానవ పరిణామ క్రమాన్ని తెలిపే మహా విష్ణువు అవతారాల గురించి వివరించారు. రామో విగ్రహవాన్ ధర్మః అంటూ మానవ ధర్మానికి ప్రతిరూపమైన రాముని గుణ గణాలను ఉదాత్త లక్షణాలను వివరించారు. ప్రధానంగా వాల్మీకి కృత రామాయణం, ఆధ్యాత్మ రామాయణం లలో పేర్కొన్న అంశాలను పరిచయం చేస్తూ, సరి పోలుస్తూ న భూతో న భవిష్యతిగా సోదాహరణంగా వివరించారు.
కార్యక్రమంలో నిర్వహణ బాధ్యులు తాడూరి బాల కిష్టయ్య, బలరాం, బాల చందర్, రఘునాథ్, మోహన్, ఆశ్విత్, మహిళా మండలి సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు భాగస్వాము లైనారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహిళా సంఘాలకు కేంద్రం 15 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బౌద్దనగర్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం

మెట్ పల్లి పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర

ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన సదస్సు

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వినియోగంపై అవగాహన

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ రఘు చందర్

హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం

ఆడబిడ్డ పెళ్లికి వెండి ఆభరణాల బహుకరణ

కిమ్స్ -సన్షైన్ హాస్పిటల్ -లో రీనల్ డెనర్వేషన్ థెరపీ సెంటర్ ఏర్పాటు

బార్ అసోసియేషన్ నాయకులకు సన్మానం

దమ్ముంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల పై అధికారులతో కలెక్టర్ సమావేశం
