సనాతన ధర్మం వైపు పయనించాలి  హ డాక్టర్ శిల్పా కళ దీదీ..

On
సనాతన ధర్మం వైపు పయనించాలి  హ డాక్టర్ శిల్పా కళ దీదీ..

గొల్లపల్లి ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):
 
సనాతనం అంటే నిత్య నవీనం, సత్యం, పరోపకారం, త్యాగం, సేవా, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు అని నేటితరం  ఆచరించి  ధర్మం వైపు పయనించాలని  డాక్టర్ శిల్పా కళ దీదీ అన్నారు. మండలంలోని భీంరాజ్ పల్లి గ్రామంలో బీబీకే ట్రస్ట్ అండ్ ఫౌండేషన్  ఆధ్వర్యంలో సనాతన ధర్మం, హిందూ ధర్మం, శ్రీరాముని ధర్మ ప్రవచనాలపై  నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు.

గ్రామంలో ముందుగా  శ్రీరాముని శోభయాత్ర, ర్యాలీ అత్యంత వైభవంగా జరిగాయి శోభ యాత్రలో శిల్పా దిది పాల్గొని ఉత్సాహాన్ని నింపారు.భక్తులు, మహిళల వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోలాటం ఆటలు, హనుమాన్ భక్తుల నృత్యాల నడుమ కన్నుల పండువగ శోభయాత్ర జరిగింది. అనంతరం ప్రవచనాల కార్యక్రమంలో భాగంగా  డాక్టర్ శిల్ప దీదీ మాట్లాడుతూ
  ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు అందరూ వేరువేరు రూపాల్లో హైందవం కొలుచుకుంటున్న దైవాలు. కానీ ఉన్నది ఒక్కటే ఏక్ సంతు విప్రా బహుదావదంతి అన్నారు.

మతాలు వేరైనా దైవం ఒకటే అని సనాతనం ధర్మం చెబుతుందన్నారు. మాతృదేవోభవ పితృదేవోభవ, ఆచార్యదేవోభవ ఇలాంటి మేటి మాటల సారాంశమే సనాతన ధర్మమన్నారు. కాలానుగుణంగా సాంప్రదాయాలు, ఆచారాలు మారవచ్చు కానీ ధర్మం మారదు అన్నారు. శ్రీరాముడి ఆదర్శవంతమైన జీవితమని ఆయన జీవితం ధర్మం, నీతి, మర్యాద,ప్రేమ వంటి గొప్ప విలువలకు నిదర్శనం అన్నారు. ఆయన ఆదర్శాలను అనుసరించడం ద్వారా వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవితాలలో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అన్నారు . అందుకే శ్రీరాముని ఆదర్శం మానవులకు ఎల్లప్పుడూ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇంత చిన్న గ్రామంలో నా చేత కార్యక్రమం నిర్వహించినటువంటి బి బి కే ఫౌండర్ బొమ్మన కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్డ్ జెసి  కందుకూరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి యువత రాముడు జీవితం ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ఇంతటి చక్కటి కార్యక్రమం మా ఊరిలో బి బి కే  ఫౌండర్ కుమార్ నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా భవిష్యత్తులో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి గ్రామాన్ని అభివృద్ధి పరచాలన్నారు. అనంతరం బీబీకే ఆధ్వర్యంలో శిల్పాకలా దీదీకి  ఘన సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో బిపికె ట్రస్ట్, ఫౌండర్ అధినేత బొమ్మెన కుమార్,లీడ్ ఇండియా ట్రైనింగ్ మేనేజర్ తాడూరు శ్రీనివాస ఆచార్య, హిందు వాహిని టోలి మెంబెర్ వేముల సంతోష్, తిరుపతిరావు,జిల్లా గోరక్షక్ ప్రముఖ్ ఆడెపు నరేష్, భజరంగ్ దళ్    మండల కన్వీనర్ ఎనగందుల రమేష్, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు  కందుకూరి రమాదేవి, ఉపాధ్యాయులు మధుకర్ రెడ్డి, కంది స్వామి, ఎనగందుల రూపేష్, సింగారపు దొంగయ్య లచ్చయ్య, మహేష్, రేవెల్ల సత్తయ్య  గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ సానుకూలంగా స్పందించిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
Read More...
Local News 

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది - ముల్కనూర్ పిహెచ్సి వైద్యులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి
Read More...
Local News 

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి 

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి  గొల్లపల్లి ఎప్రిల్ 16 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళి అక్కడ ఇటీవల హత్యకు గురికాగ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  బుధవారం రోజున శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు....
Read More...
Local News 

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర సికింద్రాబాద్  ఏప్రిల్ 16 (ప్రజా మంటలు):  దశాబ్దల తరబడిగా ముదిరాజులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నెల 18 నుంచి ముదిరాజ్ నాయకులు యువరాజ్ పాదయాత్ర చేపట్టబోతున్నారు.  మేడారం సమ్మక్క సారక్క క్షేత్రం నుండి పాదయాత్ర ప్రారంభం అవుతుందని జాతీయ కోలీ సమాజ్ ఈసీ నెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ తెలిపారు. మేడారం...
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో చేస్తున్న యాత్రలు బూటకం - బిజెపి నాయకురాలు రాజేశ్వరి  సికింద్రాబాద్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబెడ్కర్ ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అవమానించారని ఆయనను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని కాంగ్రెస్ నాయకులు...
Read More...
Local News 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి ఎప్రిల్ 16 (ప్రజా మంటలు): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు బుధవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు....
Read More...
Local News 

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి గొల్లపల్లి ఎప్రిల్ 16 :(ప్రజా మంటలు) గొల్లపల్లి మండలం  లోని తిరుమలాపూర్ అంగన్వాడీ సెంటర్ లో పోషణ పక్వాడ్ ప్రోగ్రాము లో ముఖ్య అతిధిగా మల్యాల సీడీపీఓ వీరలక్మి మాట్లాడుతూ 1000 రోజుల ప్రాముఖ్యత ను తెలియచేస్తు గర్భిణీలు పౌష్టిక ఆహారం, చిరు ధన్యలను ఉపయోగించి అనుబంధ ఆహార వంటలు చేయటం పట్ల అవగాహనా కల్పించారు...
Read More...
Local News  State News 

ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు

ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు జగిత్యాల ఎప్రిల్ 16: ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి వెళదాం.25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేద్దాం. కార్యకర్తల్లారా తరలి రండి అంటూ BRS నాయకురాలు,ఎమ్మెల్సీ కవిత గోడమీద రాస్తూ, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కౌన్సిలర్ దేవేందర్ నాయక్, ఇతర కార్యకర్తలు వెంట ఉన్నారు. ఈరోజు జగిత్యాలలో జరిగే...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోషణ జాతర 

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోషణ జాతర  ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 16 (ప్రజామంటలు దగ్గుల అశోక్) జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బుధవారం రోజున సంఘ భవనంలో పోషణ అభయన్ లో భాగంగా పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ మణెమ్మ మాట్లాడుతూ మొదట 1000 రోజులు సంరక్షణ తల్లి బిడ్డలకు జీవిత కాలపు రక్షణ...
Read More...
State News 

కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు -  జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత 

కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు -  జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత  ఎల్కతుర్తిలో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలి తెలంగాణ ఇస్తాని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్... ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేస్తోంది జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్పొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల ఎప్రిల్ 16: బిఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం జగిత్యాలలో జిల్లా...
Read More...
National  International  

ట్రంప్ నిబంధనలను వ్యతిరేకించిన  హార్వర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని  అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా  ప్రశంసించారు

ట్రంప్ నిబంధనలను వ్యతిరేకించిన  హార్వర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని  అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా  ప్రశంసించారు ట్రంప్ మంగళవారం విశ్వవిద్యాలయం తన పన్ను మినహాయింపు హోదాను కోల్పోవాలని  సూచించాడు. ఏప్రిల్ 15, డిమాండ్లను ధిక్కరించిన తర్వాత వైట్ హౌస్ హార్వర్డ్‌కు నిధులను స్తంభింపజేసింది ట్రంప్ పరిపాలన $2 బిలియన్లకు పైగా ఫెడరల్ గ్రాంట్ డబ్బును స్తంభింపజేసింది.. యూదు వ్యతిరేకతపై చర్య తీసుకోలేదని ఆరోపిస్తూ విశ్వవిద్యాలయం నిధుల స్తంభనను ఎదుర్కొంటున్నందున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...
Read More...
State News 

ఏసీబీకి చిక్కిన. చాంద్రాయణగుట్ట అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్

ఏసీబీకి చిక్కిన. చాంద్రాయణగుట్ట  అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్    హైదరాబాద్ ఏప్రిల్ 15: శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ ఏసీబీ వలకు చిక్కారు.   రూ.70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.  చార్మినార్ జోన్ ఇన్ఛార్జిగా శ్రీనివాస్.అదనపు బాధ్యతలు  నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో చాంద్రాయణగుట్ట సర్కిల్లో అర్బన్ బయో డైవర్సిటీ విభాగంలో రూ. 45 లక్షల
Read More...