సనాతన ధర్మం వైపు పయనించాలి హ డాక్టర్ శిల్పా కళ దీదీ..
గొల్లపల్లి ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):
సనాతనం అంటే నిత్య నవీనం, సత్యం, పరోపకారం, త్యాగం, సేవా, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు అని నేటితరం ఆచరించి ధర్మం వైపు పయనించాలని డాక్టర్ శిల్పా కళ దీదీ అన్నారు. మండలంలోని భీంరాజ్ పల్లి గ్రామంలో బీబీకే ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సనాతన ధర్మం, హిందూ ధర్మం, శ్రీరాముని ధర్మ ప్రవచనాలపై నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు.
గ్రామంలో ముందుగా శ్రీరాముని శోభయాత్ర, ర్యాలీ అత్యంత వైభవంగా జరిగాయి శోభ యాత్రలో శిల్పా దిది పాల్గొని ఉత్సాహాన్ని నింపారు.భక్తులు, మహిళల వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోలాటం ఆటలు, హనుమాన్ భక్తుల నృత్యాల నడుమ కన్నుల పండువగ శోభయాత్ర జరిగింది. అనంతరం ప్రవచనాల కార్యక్రమంలో భాగంగా డాక్టర్ శిల్ప దీదీ మాట్లాడుతూ
ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు అందరూ వేరువేరు రూపాల్లో హైందవం కొలుచుకుంటున్న దైవాలు. కానీ ఉన్నది ఒక్కటే ఏక్ సంతు విప్రా బహుదావదంతి అన్నారు.
మతాలు వేరైనా దైవం ఒకటే అని సనాతనం ధర్మం చెబుతుందన్నారు. మాతృదేవోభవ పితృదేవోభవ, ఆచార్యదేవోభవ ఇలాంటి మేటి మాటల సారాంశమే సనాతన ధర్మమన్నారు. కాలానుగుణంగా సాంప్రదాయాలు, ఆచారాలు మారవచ్చు కానీ ధర్మం మారదు అన్నారు. శ్రీరాముడి ఆదర్శవంతమైన జీవితమని ఆయన జీవితం ధర్మం, నీతి, మర్యాద,ప్రేమ వంటి గొప్ప విలువలకు నిదర్శనం అన్నారు. ఆయన ఆదర్శాలను అనుసరించడం ద్వారా వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవితాలలో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అన్నారు . అందుకే శ్రీరాముని ఆదర్శం మానవులకు ఎల్లప్పుడూ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇంత చిన్న గ్రామంలో నా చేత కార్యక్రమం నిర్వహించినటువంటి బి బి కే ఫౌండర్ బొమ్మన కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్డ్ జెసి కందుకూరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి యువత రాముడు జీవితం ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ఇంతటి చక్కటి కార్యక్రమం మా ఊరిలో బి బి కే ఫౌండర్ కుమార్ నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా భవిష్యత్తులో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి గ్రామాన్ని అభివృద్ధి పరచాలన్నారు. అనంతరం బీబీకే ఆధ్వర్యంలో శిల్పాకలా దీదీకి ఘన సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో బిపికె ట్రస్ట్, ఫౌండర్ అధినేత బొమ్మెన కుమార్,లీడ్ ఇండియా ట్రైనింగ్ మేనేజర్ తాడూరు శ్రీనివాస ఆచార్య, హిందు వాహిని టోలి మెంబెర్ వేముల సంతోష్, తిరుపతిరావు,జిల్లా గోరక్షక్ ప్రముఖ్ ఆడెపు నరేష్, భజరంగ్ దళ్ మండల కన్వీనర్ ఎనగందుల రమేష్, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు కందుకూరి రమాదేవి, ఉపాధ్యాయులు మధుకర్ రెడ్డి, కంది స్వామి, ఎనగందుల రూపేష్, సింగారపు దొంగయ్య లచ్చయ్య, మహేష్, రేవెల్ల సత్తయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
