జగిత్యాల జిల్లాలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ..... తెలంగాణ రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి
జగిత్యాల మార్చ్ 24:
జిల్లాలో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . భారీ ఈదురు గాలులు, వడగండ్లు, అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న, వరి, నువ్వు, కూరగాయలు, తదితర పంటలు నెలకోరిగి దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో అకాల వర్షాల కారణంగా దెబ్బ తినడంతో రైతులు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారనీ శేర్ నర్సారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని అధికార యంత్రాంగం వెంటనే క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే జరిపి పంట నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసి రైతులకు తగిన నష్టపరిహారం అందేలా తగు చర్యలు తీసుకోని ఆదుకోవాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
