ధాన్యం సేకరణ చిత్త శుద్ది తో యజ్ఞం లా నిర్వహించాలి అధనపు కలెక్టర్ లత
జగిత్యాల మార్చి 27(ప్రజా మంటలు)
జగిత్యాల: జిల్లాలో రానున్న రబీ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియను ఒక యజ్ఞంల చిత్తశుద్ధిగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్.లత ఉద్భోదించారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యాసంగి ధాన్యం సేకరణ పై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రానున్న రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు తేకుండా వ్యవసాయ అధికారులు చూడాలన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ధాన్యం కొనుగోలులో పారదర్శకత పాటించాలన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సహకార అధికారి సి.హెచ్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలదే కీలకపాత్ర అన్నారు. పౌరసరఫరాల శాఖ సూచనల ప్రకారమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ రైతులు తెచ్చే ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలను నిర్ధారించాలని మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జితేందర్ ప్రసాద్ జిల్లాలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు వివరాలను తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి, సహకార, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ, రవాణా, లీగల్ మెట్రలజి అధికారులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
