ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా ఇంటర్ విద్యాధికారి నారాయణ
జగిత్యాల ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు)
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి నారాయణ అన్నారు.
ఈనెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలో డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరిండెంట్ లతో నిర్వహించిన ఇంటర్ పరీక్షల సన్నాహక సమావేశంలో నారాయణ పాల్గొని మాట్లాడారు. ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. జిల్లాల మొత్తం 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అందులో 13 ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ,14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక్కటి మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 7073 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 7,377 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మార్చి 5వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని పరీక్ష కేంద్రాల వద్ద తగిన వసతులు కల్పించాలని సూచించారు. ఉదయం 8:30 గంటలకు పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకోవాలని తెలిపారు. ఏ లాంటి ప్రింటెడ్ మెటీరియల్ మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవన్నారు. విద్యార్థులు పరీక్షల విషయంలో ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్న టెలి మానస్ 14416 కాల్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబరు 94403 81 255, 8500470642 లకు కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ పరీక్షల విభాగం అధికారులు కొక్కుల. గంగాధర్, రమేష్ బాబు, వంగల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
