హెల్త్ మినిస్టర్​ గాంధీ దవఖాన ఆకస్మిక పర్యటన

On
హెల్త్ మినిస్టర్​ గాంధీ దవఖాన ఆకస్మిక పర్యటన

 డ్యూటీ డాక్టర్ల గైర్హాజర్​ పై మంత్రి ఆగ్రహం
 చర్యలు తీసుకోవాలని డీఎంఈ కి ఆదేశం

సికింద్రాబాద్​ మార్చి 04 (ప్రజామంటలు) :

సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రిని రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. గాంధీకి రాగానే నేరుగా అవుట్​ పేషెంట్​ వార్డుకు వెళ్ళిన మంత్రి అక్కడున్న పేషెంట్లు, వారి సహాయకులతో మాట్లాడారు. ప్రసూతి వార్డులో అప్పుడే పుట్టిన శిశువులను పరామర్శించిన మంత్రి అక్కడున్న సౌకర్యాలపై పేషంట్లను అడిగి తెలుసుకున్నారు.

 ఆసుపత్రిలో సమస్యలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల అటెండెన్స్​ బుక్​ ను తెప్పించుకొని వారి హాజరును మంత్రి పరిశీలించారు. కొందరు డాక్టర్లు గైర్హాజరు అయినట్లుగా గ్రహించిన మంత్రి ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న డీఎంఈ డా.నరేందర్​ కుమార్​ ను ఆదేశించారు. ఓపీ వార్డులో ఉండాల్సిన ఆయా డిపార్ట్​ మెంట్​ ల ప్రొఫెసర్లు, అసోసియేట్​ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంతో మంత్రి ఆగ్రహించారు.

వారికి షోకాజ్​ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్​ డా.రాజకుమారిని ఆదేశించారు. నర్సుల అటెండెన్​ రిజిస్టర్​ లేకపోవడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. అసలు గాంధీలో పాలన యంత్రాంగం అస్తవ్యస్తంగా ఉండటంతో ఇలాంటి లోపాలు నెలకొన్నాయని మంత్రి అభిప్రాయ పడ్డారు. ఈసందర్బంగా మంత్రి ఓపీ వార్డుతో పాటు రెండో ఫ్లోర్​ లోని జనరల్​ మెడిసన్​ ఫిమేల్​ వార్డు, రేడియాలజీ డిపార్ట్ మెంట్ లోని ఎక్స్​ రే, ఎంఆర్​ఐ, సిటీ స్కానింగ్​, ఐవీఎఫ్​ కేంద్రాలకు వెళ్ళి, పరిశీలించారు.

అయితే ఐవీఎస్​ ప్రారంభమై ఏండ్లు గడుస్తున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు సంబంధిత డాక్టర్లకు షోకాజ్​ నోటీసులు ఇవ్వాలని డీఎంఈ ని మంత్రి ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..గాంధీలోని పలు అంశాలపై సీరియస్​ గా రివ్యూ చేయాల్సి ఉందన్నారు. ఇక్కడ సాగుతున్న ఇన్​ఫ్రాస్ర్టక్చర్​ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మెడికల్​, నాన్​ మెడికల్ ఉద్యోగులు ​ ఎవరైన ఖచ్చితంగా డ్యూటీలు చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు.

IMG_20250304_221209

గాంధీకి వచ్చే పేదలకు అందే వైద్యంలో నిర్లక్ష్యాన్ని తమ ప్రభుత్వం ఊపేక్షించదని వార్నింగ్​ ఇచ్చారు. తమ ఆకస్మిక తనిఖీలు తరుచుగా కొనసాగుతాయన్నారు. మంత్రి వెంట నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే డాక్టర్​  రాజేశ్​ రెడ్డి తో పాటు డీఎంఈ (అడ్మిన్​) డాక్టర్​ నరేందర్​ కుమార్​, సూపరింటెండెంట్​ డా.రాజకుమారి, ఆర్​ఎంవో లు, ఆయా డిపార్ట్ మెంట్ హెచ్​ఓడీలు, సిబ్బంది ఉన్నారు.

తెలంగాణ భవన్​ కాదు...ఇప్పుడున్నది గాంధీ భవన్​..

మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ విజిట్​ తర్వాత ఓపీ వార్డునుంచి బయటకు వచ్చే సమయంలో అక్కడున్న ఓ వృద్దురాలు మంత్రిని కలసి తన గోడు వెల్లబోసుకుంది. తాను సదరం సర్టిఫికెట్​ గురించి తెలంగాణ భవన్​ చుట్టూ తిరిగిన పని కాలేదని వాపోయింది. అందుకు స్పందించిన మంత్రి ఇప్పుడున్నది గాంధీ భవన్​...ఒక్క కాగితంపై నీ సమస్య రాసి ఇస్తే పని అయిపోతుందని భరోసా ఇచ్చారు. తన ఆపీస్​ అడ్రస్​ తో పాటు ఫోన్​ నెంబర్​ రాసి ఇచ్చారు. సదరు వృద్దురాలికి కొంత ఆర్థిక సాయాన్ని అందచేశారు. 

Tags

More News...

Local News 

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 1(ప్రజా మంటలు)సన్న బియ్యం పేదల పాలిట వరం అన్నారు శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  పట్టణ 8వ వార్డు బుడగ జంగాల కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  నిరుపేదలకు...
Read More...
Local News 

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు   జగిత్యాల ఏప్రిల్ 01: బిసి రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో ఏప్రిల్ 2న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే బిసిల పోరు గర్జన మహా ధర్నా కార్యక్రమానికి జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు  తరలివెళ్లారు. ఈ...
Read More...
Local News 

రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)    గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎడ్ల బండి పోటీలు నిర్వహించారు  ప్రథమ స్థానంలో  దొనకొండ.సుధీర్ శకల్ల గారి పావుతుల బంగారం మూస్క్ నిశాంతిరెడ్డి అందజేశారు   ధ్వితిమ స్థానంలో క్యతం.జితేందర్ జగదేవ్ పేట,  వారికి 10గ్రా వెండి కీర్తిశేషులు దాసరి లచ్చవ్వ -భీమయ్య...
Read More...
Local News 

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్  *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్  *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని *15 ఏండ్లుగా ప్రతి వేసవిలో అన్నదానం, చలివేంద్రం   *ఆదర్శంగా శ్రీనివాస సమాజ సేవ ఛారిటబుల్ట్రస్ట్    సికింద్రాబాద్, ఏప్రిల్ 01 (ప్రజామంటలు) :    వయస్సు పైబడిన కూడ పేద ప్రజలకు సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం చాల గొప్పదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సనత్ నగర్ లోని...
Read More...
Local News 

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య 

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య  గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)    గొల్లపల్లి మండల కేంద్రంలో ఎనగందుల జయంతి 25 సం డిగ్రీ వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నది. జయంతి గత కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పితో  మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో కుటుంబీకులు నిద్రిస్తున్న సమయంలో,  రూమ్ లో ఐరన్...
Read More...
Local News 

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య. గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)      గొల్లపల్లి మండలము లోని గోవింద పల్లె గ్రామానికి చెందిన  చెందిన బింగి వెంకటమ్మ 72 సం వృద్ధురాలు కొంతకాలం నుండి  థైరాయిడ్  షుగర్ సంబంధిత వ్యాధులతో బాధ పడుతూ డాక్టర్ల సలహా మేరకు మందులు వాడుతున్నప్పటికీ  20 రోజుల క్రితం వెంకటమ్మకు కడుపులో నొప్పి రాగా, కొడుకు
Read More...
Local News 

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ సికింద్రాబాద్, ఏప్రిల్ 01 ( ప్రజామంటలు ) :    అసలే పేదరికం..ఆపై అనారోగ్య సమస్యలు..శరీరం సహకరించక మద్యలోనే చదువు ఆపేసిన  యువతికి ఓ సంస్థ అండగా నిలిచింది. వివరాలు ఇవి..బన్సీలాల్ పేట డివిజన్ జయనగర్ కు చెందిన డి.దశరథ్, వాణీ ల కుమార్తె పూజిత(17) డయాబెటిక్, థైరాయిడ్ తో బాధపడుతోంది. తన మూడేండ్ల వయస్సు నుంచే...
Read More...

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం 

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం  జగిత్యాల ఏప్రిల్ 1( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం అరవింద్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గత ఐదు వారాలుగా ప్రతి మంగళవారం జరుగుతున్న సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ఈ  మంగళవారం ఐదో వారము కు చేరింది.  ఈనాటి హనుమాన్ చాలీసా పారాయణoలో భక్తులు  విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు...
Read More...
Local News 

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఢిల్లీ/గుంతకల్లు ఏప్రిల్ 1 (ప్రజా మంటలు)*అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో గుంతకల్ కసాపురం దేవాలయ దర్శనం కొరకు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా అందులో విలీనం చేయవలసిందిగా కోరుతూ వనగుంది విజయలక్ష్మి  బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.. ఢిల్లీలోని కేంద్ర రైల్వే...
Read More...
Local News 

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం    మార్చి 31 (ప్రజా మంటలు)   జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో సాయిసప్తాహం ప్రారంభమైంది. ఈరోజు సోమవారం నుండి వచ్చే సోమవారం వరకు అఖండ సాయి నామ సప్తహం జరుగుతుందని, నిర్వాహకులు తెలిపారు. సన్నిధిలో ఒక వెయ్యి ఎనిమిది కలుశాలు స్థాపించి ప్రతిరోజు పూజలు జరుగుతాయని, ఎనిమిదో రోజు మళ్లీ...
Read More...
Local News 

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు గొల్లపల్లి మార్చి 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం లోని తిర్మలాపుర్ గ్రామంలోనీ శ్రీ స్వయంభూ గుండు మల్లన్న స్వామి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లు  పోటీల్లో నిర్వహించారు ఈ పోటీల్లో 16 బండ్లు పాల్గొనగా విజేతలకు    బహుమతులు అందజేశారు మొదటి బహుమతి షేక్ అక్బర్ తిర్మలపూర్ కు బాయిన లక్ష్మి- లక్ష్మయ్య పావుతున్న బంగారం అందజేశారు, ద్వితీయ...
Read More...
Local News 

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు 

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు  గొల్లపల్లి మార్చి 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం చిలువ్వ కోడూరులోని  శ్రీరామలింగేశ్వర స్వామి  జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి జాతర ఉత్సవాల్లో భాగంగా  సోమవారం రథోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి గ్రామంలోని  ప్రధాన వీధుల గుండా  నిర్వహించిన రథోత్సవాన్ని చూడటానికి మండల నలుమూల గ్రామాల  భక్తులు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ...
Read More...