హెల్త్ మినిస్టర్ గాంధీ దవఖాన ఆకస్మిక పర్యటన
డ్యూటీ డాక్టర్ల గైర్హాజర్ పై మంత్రి ఆగ్రహం
చర్యలు తీసుకోవాలని డీఎంఈ కి ఆదేశం
సికింద్రాబాద్ మార్చి 04 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. గాంధీకి రాగానే నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్ళిన మంత్రి అక్కడున్న పేషెంట్లు, వారి సహాయకులతో మాట్లాడారు. ప్రసూతి వార్డులో అప్పుడే పుట్టిన శిశువులను పరామర్శించిన మంత్రి అక్కడున్న సౌకర్యాలపై పేషంట్లను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో సమస్యలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల అటెండెన్స్ బుక్ ను తెప్పించుకొని వారి హాజరును మంత్రి పరిశీలించారు. కొందరు డాక్టర్లు గైర్హాజరు అయినట్లుగా గ్రహించిన మంత్రి ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న డీఎంఈ డా.నరేందర్ కుమార్ ను ఆదేశించారు. ఓపీ వార్డులో ఉండాల్సిన ఆయా డిపార్ట్ మెంట్ ల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంతో మంత్రి ఆగ్రహించారు.
వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్ డా.రాజకుమారిని ఆదేశించారు. నర్సుల అటెండెన్ రిజిస్టర్ లేకపోవడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. అసలు గాంధీలో పాలన యంత్రాంగం అస్తవ్యస్తంగా ఉండటంతో ఇలాంటి లోపాలు నెలకొన్నాయని మంత్రి అభిప్రాయ పడ్డారు. ఈసందర్బంగా మంత్రి ఓపీ వార్డుతో పాటు రెండో ఫ్లోర్ లోని జనరల్ మెడిసన్ ఫిమేల్ వార్డు, రేడియాలజీ డిపార్ట్ మెంట్ లోని ఎక్స్ రే, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, ఐవీఎఫ్ కేంద్రాలకు వెళ్ళి, పరిశీలించారు.
అయితే ఐవీఎస్ ప్రారంభమై ఏండ్లు గడుస్తున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు సంబంధిత డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీఎంఈ ని మంత్రి ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..గాంధీలోని పలు అంశాలపై సీరియస్ గా రివ్యూ చేయాల్సి ఉందన్నారు. ఇక్కడ సాగుతున్న ఇన్ఫ్రాస్ర్టక్చర్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మెడికల్, నాన్ మెడికల్ ఉద్యోగులు ఎవరైన ఖచ్చితంగా డ్యూటీలు చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు.
గాంధీకి వచ్చే పేదలకు అందే వైద్యంలో నిర్లక్ష్యాన్ని తమ ప్రభుత్వం ఊపేక్షించదని వార్నింగ్ ఇచ్చారు. తమ ఆకస్మిక తనిఖీలు తరుచుగా కొనసాగుతాయన్నారు. మంత్రి వెంట నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి తో పాటు డీఎంఈ (అడ్మిన్) డాక్టర్ నరేందర్ కుమార్, సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ఆర్ఎంవో లు, ఆయా డిపార్ట్ మెంట్ హెచ్ఓడీలు, సిబ్బంది ఉన్నారు.
తెలంగాణ భవన్ కాదు...ఇప్పుడున్నది గాంధీ భవన్..
మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ విజిట్ తర్వాత ఓపీ వార్డునుంచి బయటకు వచ్చే సమయంలో అక్కడున్న ఓ వృద్దురాలు మంత్రిని కలసి తన గోడు వెల్లబోసుకుంది. తాను సదరం సర్టిఫికెట్ గురించి తెలంగాణ భవన్ చుట్టూ తిరిగిన పని కాలేదని వాపోయింది. అందుకు స్పందించిన మంత్రి ఇప్పుడున్నది గాంధీ భవన్...ఒక్క కాగితంపై నీ సమస్య రాసి ఇస్తే పని అయిపోతుందని భరోసా ఇచ్చారు. తన ఆపీస్ అడ్రస్ తో పాటు ఫోన్ నెంబర్ రాసి ఇచ్చారు. సదరు వృద్దురాలికి కొంత ఆర్థిక సాయాన్ని అందచేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
