హెల్త్ మినిస్టర్​ గాంధీ దవఖాన ఆకస్మిక పర్యటన

On
హెల్త్ మినిస్టర్​ గాంధీ దవఖాన ఆకస్మిక పర్యటన

 డ్యూటీ డాక్టర్ల గైర్హాజర్​ పై మంత్రి ఆగ్రహం
 చర్యలు తీసుకోవాలని డీఎంఈ కి ఆదేశం

సికింద్రాబాద్​ మార్చి 04 (ప్రజామంటలు) :

సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రిని రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. గాంధీకి రాగానే నేరుగా అవుట్​ పేషెంట్​ వార్డుకు వెళ్ళిన మంత్రి అక్కడున్న పేషెంట్లు, వారి సహాయకులతో మాట్లాడారు. ప్రసూతి వార్డులో అప్పుడే పుట్టిన శిశువులను పరామర్శించిన మంత్రి అక్కడున్న సౌకర్యాలపై పేషంట్లను అడిగి తెలుసుకున్నారు.

 ఆసుపత్రిలో సమస్యలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల అటెండెన్స్​ బుక్​ ను తెప్పించుకొని వారి హాజరును మంత్రి పరిశీలించారు. కొందరు డాక్టర్లు గైర్హాజరు అయినట్లుగా గ్రహించిన మంత్రి ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న డీఎంఈ డా.నరేందర్​ కుమార్​ ను ఆదేశించారు. ఓపీ వార్డులో ఉండాల్సిన ఆయా డిపార్ట్​ మెంట్​ ల ప్రొఫెసర్లు, అసోసియేట్​ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంతో మంత్రి ఆగ్రహించారు.

వారికి షోకాజ్​ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్​ డా.రాజకుమారిని ఆదేశించారు. నర్సుల అటెండెన్​ రిజిస్టర్​ లేకపోవడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. అసలు గాంధీలో పాలన యంత్రాంగం అస్తవ్యస్తంగా ఉండటంతో ఇలాంటి లోపాలు నెలకొన్నాయని మంత్రి అభిప్రాయ పడ్డారు. ఈసందర్బంగా మంత్రి ఓపీ వార్డుతో పాటు రెండో ఫ్లోర్​ లోని జనరల్​ మెడిసన్​ ఫిమేల్​ వార్డు, రేడియాలజీ డిపార్ట్ మెంట్ లోని ఎక్స్​ రే, ఎంఆర్​ఐ, సిటీ స్కానింగ్​, ఐవీఎఫ్​ కేంద్రాలకు వెళ్ళి, పరిశీలించారు.

అయితే ఐవీఎస్​ ప్రారంభమై ఏండ్లు గడుస్తున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు సంబంధిత డాక్టర్లకు షోకాజ్​ నోటీసులు ఇవ్వాలని డీఎంఈ ని మంత్రి ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..గాంధీలోని పలు అంశాలపై సీరియస్​ గా రివ్యూ చేయాల్సి ఉందన్నారు. ఇక్కడ సాగుతున్న ఇన్​ఫ్రాస్ర్టక్చర్​ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మెడికల్​, నాన్​ మెడికల్ ఉద్యోగులు ​ ఎవరైన ఖచ్చితంగా డ్యూటీలు చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు.

IMG_20250304_221209

గాంధీకి వచ్చే పేదలకు అందే వైద్యంలో నిర్లక్ష్యాన్ని తమ ప్రభుత్వం ఊపేక్షించదని వార్నింగ్​ ఇచ్చారు. తమ ఆకస్మిక తనిఖీలు తరుచుగా కొనసాగుతాయన్నారు. మంత్రి వెంట నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే డాక్టర్​  రాజేశ్​ రెడ్డి తో పాటు డీఎంఈ (అడ్మిన్​) డాక్టర్​ నరేందర్​ కుమార్​, సూపరింటెండెంట్​ డా.రాజకుమారి, ఆర్​ఎంవో లు, ఆయా డిపార్ట్ మెంట్ హెచ్​ఓడీలు, సిబ్బంది ఉన్నారు.

తెలంగాణ భవన్​ కాదు...ఇప్పుడున్నది గాంధీ భవన్​..

మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ విజిట్​ తర్వాత ఓపీ వార్డునుంచి బయటకు వచ్చే సమయంలో అక్కడున్న ఓ వృద్దురాలు మంత్రిని కలసి తన గోడు వెల్లబోసుకుంది. తాను సదరం సర్టిఫికెట్​ గురించి తెలంగాణ భవన్​ చుట్టూ తిరిగిన పని కాలేదని వాపోయింది. అందుకు స్పందించిన మంత్రి ఇప్పుడున్నది గాంధీ భవన్​...ఒక్క కాగితంపై నీ సమస్య రాసి ఇస్తే పని అయిపోతుందని భరోసా ఇచ్చారు. తన ఆపీస్​ అడ్రస్​ తో పాటు ఫోన్​ నెంబర్​ రాసి ఇచ్చారు. సదరు వృద్దురాలికి కొంత ఆర్థిక సాయాన్ని అందచేశారు. 

Tags

More News...

Local News 

అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్

అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్ జగిత్యాల ఏప్రిల్ 02:    ఇటీవల అనారోగ్యంతో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు వారి ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారుసమాచారం తెలుసుకున్న జగిత్యాల జిల్లా కేంద్రం చెందిన సామాజిక సేవకులు సూరజ్ శివశంకర్ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి వెళ్లి ఇల్లు లేని మృతులో అలవాల గంగాధర్ సరోజ దంపతుల పిల్లల చదువు కోసం...
Read More...
Local News  State News 

ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు సికింద్రాబాద్,  ఏప్రిల్ 02 ( ప్రజామంటలు)::    రహస్యంగా గత మూడు సంవత్సరాలుగా  ఆన్‌లైన్‌లో సట్టా బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతరాష్ర్ట గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్‌చేసి నగదు, సట్టా చిట్టీలు, విలువైన కంప్యూటర్‌ఎక్విప్మెంట్ను  స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇందులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.  ఈస్ట్ జోన్ ‌టాస్క్ ఫోర్స్‌అడిషనల్‌ డీసీపీ అందె శ్రీనివాసరావు...
Read More...
Local News 

మిషన్ భగీరథ నీళ్ళు -  మురికి కాలువల పాలు 

మిషన్ భగీరథ నీళ్ళు -  మురికి కాలువల పాలు  పైప్ లైన్ లీకేజీలు - పట్టించుకోని అధికారులు అధికారుల నిర్లక్ష్యం -  ఆగ్రహిస్తున్న ప్రజలు     బుగ్గారం ఏప్రిల్ 02 (ప్రజా మంటలు):    జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట మిషన్ భగీరథ నీరంతా మురికి కాలువల పాలౌతోంది. గత కొన్ని నెలల నుండి పైపు లైన్ లీకేజీలతో నీరంతా రోడ్డు...
Read More...
Local News  State News 

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్  - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్   - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం బుగ్గారం ఎంపిఓ పై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు క్రిమినల్ కేసుల నమోదుకు పిర్యాదు చేయని ఎంపీఓ భారీగా అవినీతికి పాల్పడి ఉంటాడని ఆరోపణలు    బుగ్గారం / జగిత్యాల ఏప్రిల్ 02::     జగిత్యాల జిల్లా బుగ్గారం మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా పై పలు ఆరోపణలతో బుధవారం తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా...
Read More...
Local News 

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ  మెడల్  మరియు  నగదు బహుమతి -అభినందనలు

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ  మెడల్  మరియు  నగదు బహుమతి -అభినందనలు ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 2 (ప్రజా మంటలు దగ్గుల అశోక్)    జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా ప్రభుత్వ పాఠశాల లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి నేమురి బ్లెస్సికా కు పి. యం శ్రీ పథకం గురించి జిల్లా పరిషత్ హైస్కూల్ ఇబ్రహీంపట్నం వారు నిర్వహించిన ప్రతిభ పోటీలో డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నేమురి...
Read More...
Local News 

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ. ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 2 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ): శాసనసభ ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు  మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచిత సన్నబియ్యం పథకము ప్రవేశపెట్టిన సందర్భంగా   ఇబ్రహీంపట్నం  వర్ష కొండ గ్రామంలో శ్రీ జువ్వాడి కృష్ణారావు గారు రాష్ట్ర...
Read More...
Local News 

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు సికింద్రాబాద్, ఏప్రిల్ 02 (ప్రజామంటలు):    ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాని ఘటన చిలకలగూడ పీఎస్ పరిధిలో జరిగింది.  ఎస్సై వి.జ్ఞానేశ్వర్ తెలిపిన వివరాలు.. దూద్ బావికి చెందిన పాస్తం  నాగరాజు కుమారుడు పోచయ్య@ నవీన్(11) ప్రభుత్వ స్కూలులో ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు. ఈనెల 31న ఫ్రెండ్స్ తో కలిసి...
Read More...
Local News 

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ సికింద్రాబాద్, ఏప్రిల్ 02 ( ప్రజామంటలు)    మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉగాది, రంజాన్ పండుగలు రెండు రోజులు వరుసగా వచ్చాయి. ఈ నేపథ్యంలో వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ను  సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట, సనత్ నగర్,...
Read More...
Local News 

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత 

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత  జగిత్యాల ఏప్రిల్ 2(ప్రజా మంటలు)నోరున్న జనంపైకి బుల్డోజర్ - నోరు లేని మూగజీవాల మీదకు బుల్డోజర్! పచ్చని అడవిని నాశనం చేయొద్దని నిరసనకు దిగిన  హెచ్ సి  యూ విద్యార్ధులపై లాఠీఛార్జ్ ను ఖండించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ * పచ్చని అడవిని నాశనం చేయొద్దని నిరసనకు దిగిన...
Read More...
Local News 

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత జగిత్యాల ఏప్రిల్ -02( ప్రజా మంటలు) సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు జిల్లా అదనపు కలెక్టర్ ఘన నివాళులు అర్పించారు.  బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా...
Read More...
Local News 

శాంతి భద్రత ల దృష్టిలో  జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

శాంతి భద్రత ల దృష్టిలో  జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  జగిత్యాల ఏప్రిల్ 2(ప్రజా మంటలు)జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల ( ఏప్రిల్ 1వ తేది నుండి 30 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ   తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు,...
Read More...
Local News 

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 1(ప్రజా మంటలు)సన్న బియ్యం పేదల పాలిట వరం అన్నారు శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  పట్టణ 8వ వార్డు బుడగ జంగాల కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  నిరుపేదలకు...
Read More...