భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో మోడీ యోగి చిత్ర పటాలకు పాలాభిషేకం.
జగిత్యాల మార్చి 1 (ప్రజా మంటలు) ప్రయాగ్ రాజ్ కుంభమేళాను విజయవంతం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ,యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రపటాలకు భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు. పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు చిట్ల గంగాధర్ మాట్లాడుతూ 143 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ప్రయాగరాజ్ కుంభమేళాకు అద్భుతమైన సౌకర్యాలు కల్పించి విజయవంతం చేసేందుకు కృషిచేసిన నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ లు కారణజన్ములని కొనియాడారు. హిందూ ధర్మ రక్షణకు నిరంతరం కృషి చేస్తూ భవిష్యత్తులో సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న మహనీయులని అన్నారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఒక కొత్త నగరాన్ని సృష్టించి కుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించడంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కృషి అమోఘమని అన్నారు. సుమారు 66 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారని ఇది ప్రపంచ రికార్డు అని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భద్రతా చర్యలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏ సి ఎస్ రాజు, పుప్పాల సత్యనారాయణ, చిట్ల గంగాధర్,వేముల పోచమల్లు, నరెందుల శ్రీనివాస్, బాషెట్టీ ప్రభాకర్,వేముల దేవరజo, ఎడమల వెంకట్ రెడ్డి, కస్తూరి లక్ష్మా రెడ్డి, తూనికి అంజన్న, గాధాసు భుమన్న, రాపర్తి రవి, సిరిపురం గంగారాం, బండారి మల్లికార్జున్, బోగ దేవన్న, కొత్తకొండ బాలన్న, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
