మ‌హిళా సంఘాల‌కు కేంద్రం 15 ల‌క్ష‌ల వ‌డ్డీ లేని రుణం ఇవ్వాలి - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

On
మ‌హిళా సంఘాల‌కు కేంద్రం 15 ల‌క్ష‌ల వ‌డ్డీ లేని రుణం ఇవ్వాలి - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

కార్పొరేట్ల‌కు 16.5 ల‌క్ష‌ల కోట్లు రుణ‌మాఫీ చేసిన బీజేపీకి మ‌హిళ‌ల‌కు రుణం ఇవ్వ‌డానికి మాత్రం మ‌న‌సురాదా ?అబ‌ద్దాల‌తో మ‌హిళ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం. గ్యాస్ ధ‌ర‌ను పెంచి మ‌హిళ‌లపై మోదీ సర్కార్ గుదిబండ‌ను మోపింది
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్  : మ‌హిళల‌కు స్వావ‌లంభ‌న క‌ల్పించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని, మ‌హిళా సంఘాల‌కు రూ 15 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం అందించాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీల‌కు రూ. 16.5 ల‌క్ష‌ల మేర రుణ‌మాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌హిళ‌ల‌కు ఇవ్వ‌డానికి మాత్రం మ‌న‌సు రావ‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాయ‌మాట‌లు చెబుతూ మ‌హిళ‌ల‌ను మోసం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ద‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిప‌డ్డారు.

బుధ‌వారం నాడు తెలంగాణ మ‌హిళా సాధికార‌త స‌మాఖ్య సంఘం స‌భ్యులు ఎమ్మెల్సీ క‌వితను త‌న నివాసంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ... కేసీఆర్ హ‌యాంలో ఎప్పుడూ తాము అబ‌ద్దం చెప్ప‌లేదని, మ‌హిళా సంఘాల‌కు రూ 5 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాలు ఇస్తున్నామ‌నే చెప్పామ‌ని, కానీ ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్రం రూ 20 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణం ఇస్తున్న‌ట్లు అబ‌ద్దాలు చెబుతున్న‌ద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా రూ 5 ల‌క్ష‌ల మేర‌నే వ‌డ్డీ లేని రుణాలు ఇస్తున్న‌ద‌ని, కానీ అబ‌ద్దాలు చెప్పి మ‌హిళ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

రాష్ట్రాలు ఏ చిన్న ప‌ని చేసినా కేంద్ర ప్ర‌భుత్వం త‌మ భాగ‌స్వామ్యం కూడా ఉంద‌ని చెప్పుకుంటుంద‌ని, ప్ర‌తీ చిన్న ప‌నికి నిధులు ఇచ్చే కేంద్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌లకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని నిందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రస్తుతం రూ 5 ల‌క్ష‌ల వ‌రకు వ‌డ్డీ లేని రుణం ఇస్తున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. బ్యాంకుల‌కు రుణాలు ఎగ‌వేసి లూటీ చేసే పెద్ద పెద్ద వ్యాపార‌వేత్త‌ల‌కు రూ 16.5 ల‌క్ష‌ల మేర రుణాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం మాఫీ చేసింద‌ని, కానీ మ‌హిళ‌ల‌కు మాత్రం రుణాలు ఇవ్వ‌డానికి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌న‌సు రాక‌పోవ‌డం శోచనీయ‌మ‌ని అన్నారు. నిజంగా మ‌హిళ‌ల అభివృద్ధి ప‌ట్ల చిత్త‌శుద్ది ఉంటే మ‌హిళ‌ల కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించాల‌ని సూచించారు.

మ‌హిళ‌ల సంక్షేమాన్ని విస్మ‌రించిన కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం గ్యాసు ధ‌ర‌ను రూ 50 పెంచి గుదిబండ‌ను మోపిందని మండిప‌డ్డారు. అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు త‌గ్గుతుంటే ఇక్క‌డ పెంచ‌డ‌మేంటని నిల‌దీశారు. ఎందుకు పెంచుతున్నార‌ని ప్ర‌శ్నిస్తే ప్ర‌ధాని మోదీ ఇంత గొప్పోడు అంత గొప్పోడు అని బీజేపీ నాయ‌కులు అంటున్నార‌ని, ఇలా ఇష్ట‌మున్న‌ట్లు ధ‌ర‌లు పెంచితే మోదీ ఎంత గొప్ప వ్య‌క్తి అయితే మాకేంటి అని అన్నారు.

Tags

More News...

Local News 

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది *సేవలో తరిస్తున్న వాసవి మహిళ సంఘం ఎంతో  గ్రేట్..    *విశాఖ ఇండస్ర్టీస్ ఎండీ సరోజ వివేక్ వెంకటస్వామి సికింద్రాబాద్ ఏప్రిల్ 17 (ప్రజామంటలు): ఫ్యాషన్ వల్లే  మనం ఏదైనా సాధించ గలుగుతామని. అలాగే వాసవి మహిళా సంఘం నిర్వాహకులు  నిరుపేదల సేవలో చురుగ్గా పాల్గొంటు, తమ కంటూ గుర్తింపు తెచ్చుకున్నారని విశాఖ ఇండస్ర్టీస్ ఎండీ, డా.అంబేడ్కర్...
Read More...
Local News 

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. 

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..  గొల్లపల్లి ఎప్రిల్ 17 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని చందోలి, బొంకూరు, వెనుగుమట్ల, లోత్తునూరు,వెంగళపూర్, శంకర్రావుపేట్ గ్రామాల్లో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గొల్లపల్లి ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్  గురువారం రోజు ప్రారంభించారు.ఈ సందర్బంగా సంతోష్ మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాలలో రైతులకు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా  అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను...
Read More...
Local News 

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ    సికింద్రాబాద్, ఏప్రిల్ 17 ( ప్రజామంటలు): అమర్ నాథ్ యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఏప్రిల్ 21వ తేదీ నుండి ప్రతి సోమ బుధ, శుక్ర వారాలలో  ఉదయం 10:30 గంటలకు ప్రధాన భవనం, మొదటి అంతస్తులోని మెడికల్...
Read More...
Local News 

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు విజయం సాధించిన డా.సుభోద్, డా.రాజేశ్ సికింద్రాబాద్ ఏప్రిల్ 17 (ప్రజామంటలు): తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ) సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి యూనిట్ లో ఇటీవల ఖాళీ అయిన రెండు జనరల్ కౌన్సిల్ మెంబర్ (ఒకటి ప్రొఫెసర్ క్యాడర్, మరొకటి అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ) పోస్టులకు గురువారం గాంధీ ఆసుపత్రిలో ఎన్నికలు జరిగాయి. ఉదయం...
Read More...
Local News 

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి 

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి  గొల్లపల్లి ఎప్రిల్ 17 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలోని వెంగలాపూర్ అంగన్వాడి కేంద్రంలో సిడిపిఓ మల్యాల వీరలక్ష్మి  ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా  పిల్లల బరువుల గురించి తల్లులకు అవగాహన కల్పించడం  బరువు తక్కువ ఉన్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మరియు స్థానికంగా లభించే పండ్లు కూరగాయలు గుడ్డు ఆకుకూరలు పాలు వల్ల...
Read More...
State News 

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు   జపాన్ పర్యటన నుంచి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి   మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించాలని అధికారులను ఆదేశించిన సీఎం  (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి ఎప్రిల్ 17:ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి...
Read More...
Local News 

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ సానుకూలంగా స్పందించిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
Read More...
Local News 

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది - ముల్కనూర్ పిహెచ్సి వైద్యులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి
Read More...
Local News 

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి 

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి  గొల్లపల్లి ఎప్రిల్ 16 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళి అక్కడ ఇటీవల హత్యకు గురికాగ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  బుధవారం రోజున శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు....
Read More...
Local News 

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర సికింద్రాబాద్  ఏప్రిల్ 16 (ప్రజా మంటలు):  దశాబ్దల తరబడిగా ముదిరాజులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నెల 18 నుంచి ముదిరాజ్ నాయకులు యువరాజ్ పాదయాత్ర చేపట్టబోతున్నారు.  మేడారం సమ్మక్క సారక్క క్షేత్రం నుండి పాదయాత్ర ప్రారంభం అవుతుందని జాతీయ కోలీ సమాజ్ ఈసీ నెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ తెలిపారు. మేడారం...
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో చేస్తున్న యాత్రలు బూటకం - బిజెపి నాయకురాలు రాజేశ్వరి  సికింద్రాబాద్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబెడ్కర్ ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అవమానించారని ఆయనను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని కాంగ్రెస్ నాయకులు...
Read More...
Local News 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి ఎప్రిల్ 16 (ప్రజా మంటలు): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు బుధవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు....
Read More...