మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

On
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

సీఎం ప్రజావాణి సక్సెస్ రేటు 66 శాతం 
సీఎం ప్రజావాణి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డి- పాల్గొన్న హైడ్రా కమీషనర్ రంగనాధ్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య 
## ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో  "" సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ -- ది రోల్ అఫ్ ప్రజావాణి అండ్ ప్రజా పాలన ఇన్ తెలంగాణ "" అనే అంశంపై సింపోసియం

హైదరాబాద్ మార్చ్ 12:

సమస్య మూలాలకు వెళ్లి ఆ సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని,  సీఎం ప్రజావాణిలో ఇదే తరహా పద్ధతిని తాము అనుసరిస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు.

బుధవారం ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో  "" సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ -- ది రోల్ అఫ్ ప్రజావాణి అండ్ ప్రజా పాలన ఇన్ తెలంగాణ "" అనే అంశంపై జరిగిన సింపోసియంలో చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.IMG-20250312-WA0831

 ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో సీఎం ప్రజావాణి అధికారులు, సిబ్బంది అంకితభావంతో బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

 ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహించే ప్రజావాణి ఇప్పటివరకు 110 వారాలు పూర్తి చేసుకుందని, ఇప్పటివరకు 92,072 దరఖాస్తు వచ్చాయని, అందులో వివిధ సమస్యలపై 53,303 దరఖాస్తులు రాగా అందులో 35,001 దరఖాస్తులను పరిష్కరించినట్లు చిన్నారెడ్డి వివరించారు. దరఖాస్తులు సక్సెస్ రేటు 66% ఉందని ఆయన తెలిపారు. మిగతా 38,769 దరఖాస్తులు వివిధ పథకాల కోసం రావడంతో వాటిని పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారులకు పంపినట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు.

 సీఎం ప్రజావాణి పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని ప్రజావాణి కి వెళితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రజల్లో విశ్వాసం కలుగుతోందని ఇది కదా ప్రజాపాలన అని చిన్నారెడ్డి అన్నారు.

దరఖాస్థులలో ఎక్కువ శాతం ఇళ్ల కోసం, రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం వస్తున్నాయని, ధరణి లోపాలపై కూడా చాలా దరఖాస్తులు వస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రజావాణిలో పకడ్బందీగా  సిస్టం ఏర్పాటు చేశామని, శాఖల వారీగా డెస్క్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్, స్టేట్ నోడల్ ఆఫీసర్, ఆన్లైన్ ద్వారా ఆయా శాఖలకు దరఖాస్థులు పంపించి మానిటరింగ్ చేసే డెస్క్, ట్రాకింగ్ డెస్క్ వ్యవస్థ పనిచేస్తోందని చిన్నారెడ్డి వివరించారు.

ధరఖాస్థులు తాము స్వీకరించడమే కాకుండా వాటిపై ఎందర్స్మెంట్ చేసి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లేడుతున్నామని చిన్నారెడ్డి తెలిపారు.

ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ మాట్లాడుతూ సీఎం ప్రజావాణిని ప్రతిస్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో క్షేత్ర స్థాయిలోనే సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నట్లు దివ్య పేర్కొన్నారు.

హైడ్రా కమీషనర్ వీ. రంగనాధ్ మాట్లాడుతూ చెరువులు, కుంటలు, నాలాలను చెరబట్టిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగిస్తున్నామని, ప్రభుత్వ భూములు, ఆస్తులను కబ్జా చేస్తే సహించేది లేదని రంగనాధ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ హెడ్ కెప్టెన్ లింగాల పాండురంగా రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం జగిత్యాల మార్చి12 (ప్రజా మంటలు)    జిల్లా కేంద్రంలోని శ్రీ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వార్షిక. దశమ బ్రహ్మోత్సవాలలో భాగంగా  మూడవరోజు సుప్రభాతం, సేవా కాలం, పంచ హారతి, నిత్య హోమం మరియు సాయంత్రం డోలోత్సవం నిత్య హోమం బలిహరణం తీర్థ ప్రసాద వితరణ జరిగింది. ఈనాటి డోలోత్సవం కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు డాక్టర్...
Read More...
Local News 

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి * పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.* ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందినీ వెంటనే భర్తీ చేయాలి.* విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలి.* మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు సికింద్రాబాద్​, మార్చి 12 ( ప్రజామంటలు): వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ...
Read More...
Local News 

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): సికింద్రాబాద్​ బౌద్ధనగర్​ డివిజన్​లో బుధవారం కార్పొరేటర్​ కంది శైలజ అధికారులతో కలసి పర్యటించారు. ఈసందర్బంగా ఆయా ప్రాంతాల్లోని స్ర్టీట్​ లైట్స్​ వెలుగుతున్నాయా...లేదా...అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట వీధిదీపాలను పెట్టాలని కార్పొరేటర్​ ఆదేశించారు. కొన్ని చోట్ల వెలుతురు తక్కువగా ఉండటంతో అక్కడ కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు...
Read More...
Local News 

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.    జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో  రవాణా శాఖ కార్యాలయము నిర్మాణమునకు అనువైన ప్రభుత్వ స్థలము కేటాయించగలరని కోరుతూ, కార్యాలయ సిబ్బందికి విధి నిర్వహణలో ఏర్పడుతున్న ఇబ్బందులు తదితర సమస్యల పరిష్కార నిమిత్తం జగిత్యాల జిల్లా కేంద్రంలో  10 ఎకరాలు (ఏ టి ఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ ఫిట్నెస్ స్టేషన్, సైంటిఫిక్ డ్రైవింగ్...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం          

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం              జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)  యశోద  హైటెక్ సిటీ సూపర్ స్పెషాలిటీ   డాక్టర్స్ హరీష్, కీర్తి, చైతన్య లచే సుమారు 250 మందికి పైగా ఉచితంగా వైద్య సేవలు అందించి అవసరమైన వారికి ఉచిత ఫిజియోథెరపీ మరియు రాయితీ లో అవసరమైన   స్కానింగ్లు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్,...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం          

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం                జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)  ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోటూరి శ్రీనివాస్, కోశాధికారి వూటూరి నవీన్, అదనపు కార్యదర్శి పల్లెర్ల నరేష్    ఎలిమిల్ల సాగర్, కట్కూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

భయం వీడితే...జయం మనదే..

భయం వీడితే...జయం మనదే.. - టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​కు సైకాలజిస్ట్ జ్యోతి రాజా సూచన  సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్లో రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రెయిన్ బో కమ్యూనిటీ కేర్, లెర్నింగ్ సెంటర్, ఆశ్రిత, బ్లూ ఫౌండేషన్, భవిత ఫౌండేషన్, పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్...
Read More...
Local News  State News 

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి సీఎం ప్రజావాణి సక్సెస్ రేటు 66 శాతం  సీఎం ప్రజావాణి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డి- పాల్గొన్న హైడ్రా కమీషనర్ రంగనాధ్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య  ## ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో  "" సిటిజన్ సెంట్రిక్...
Read More...
Local News  State News 

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు (రామ కిష్టయ్య సంగన భట్ల) శివకేశవుల సన్నిధి, భక్తుల పాలిటి పెన్నిధిగా రాష్ట్రంలో పేరెన్నికగన్న హరిహర క్షేత్రమైన ధర్మపురి పట్టణంలో బుధ వారం భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (యోగ, ఉగ్రుణ శ్రీ వేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా,  యోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ, వేంకటేశ్వర స్వాముల వార్షిక బ్రహ్మోత్సవాలను  పురస్కరించుకుని...
Read More...
Local News 

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు* భీమదేవరపల్లి మార్చి 12 (ప్రజామంటలు) హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో JSR గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించడం జరిగింది. వరుసగా నాల్గవ సంవత్సరం ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బాటసారులు,ప్రజలు,ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు...
Read More...
Local News 

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. గొల్లపల్లి / మల్యాలమార్చి 11 (ప్రజా మంటలు): మల్యాలలో అస్మా సుల్తానా నిన్న రాత్రి తన ఇంటి కి తాళాలు వేసి వారి బిడ్డ ఇంటికి జగిత్యాల కు వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, ఇంట్లోని బీరువాలో గల 5 తులాల బంగారు ఆభరణాలు,...
Read More...
Local News 

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం     అగంతకున్ని పట్టుకొని దేహశుద్ది    * అనంతరం పోలీసులకు అప్పగింత సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు):పద్మారావునగర్​ శ్రీసాయిబాబా టెంపుల్​ పక్కనున్న శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం ఓ అగంతకుడు చోరికి విఫల యత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలోనికి ప్రవేశించిన దాదాపు 50 ఏండ్ల వయస్సు కలిగిన ఓ వర్గానికి...
Read More...