సీఎం ఢిల్లీ పోతరో.. మోదీ కాళ్లు పట్టుకుంటారో.. మిర్చికి మాత్రం మద్ధతు ధర సాధించాలి
కేసముద్రం మిర్చి యార్డును సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
మహబూబాబాద్ ఫిబ్రవరి 24:
ముఖ్యమంత్రి ఢిల్లీ పోతారా... ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటారా... ఏం చేస్తారో మాకు సంబంధం లేదు. కానీ కచ్చితంగా రూ. 25 వేల మద్ధతు ధర సాధించాల్సిందే అని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మిర్చి ధరలు తగ్గగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి లొల్లి లొల్లి చేశారని, ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఒక మాట కూడా మాట్లాడడం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత కేసముంద్రం మిర్చి యార్డును సందర్శించారు. కష్టాలను, ఇబ్బందులు, మిర్చి ధరల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే మాట్లాడుతూ...ధరలు తగ్గి రాష్ట్రవ్యాప్తంగా మిర్చి రైతులంతా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది క్వింటాలు మిర్చి ధర రూ. 25 వేలు ఉండగా... అది ఈ సారి రూ. 11 వేలకు పడిపోయిందని తెలిపారు.
రైతులకు గిట్టుబాటు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఒక ఎకరా మిర్చి పంట సాగు చేయడానికి రూ. 2-3 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే గిట్టుబాటు ధరను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చితో పాటు కూడా పసుపు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు.
మహబూబాబాద్ - కేసముద్రం ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ఎప్పుడూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టే ఉంటారని, ఓటుకు నోటు కేసులో కూడా ఒకరు ఏ1, మరొకరు ఏ3గా ఉన్నారని, అయినా కూడా మిర్చి రైతుల కష్టాలు సీఎంకు చెప్పడానికి వేం నరేందర్ రెడ్డికి ఒక్క నిమిషం దొరకడం లేదా అని ప్రశ్నించారు.
కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని, దాంతో మహబూబాబాద్ ప్రాంతంలో 3 లక్షల ఎకరాలు ఎండిపోయాయని చెప్పారు. ఈ ఏడాది నీళ్లు విడుదల చేయాల్సిందేనని, లేదంటే రైతుల తరఫున తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్
