పోలీసుల అదుపులో పలువురు గంజాయి విక్రేతలు, విక్రయించిన , వినియోగించిన చట్టప్రకారం కఠిన చర్యలు డి ఎస్పీ రఘు చందర్

On
పోలీసుల అదుపులో పలువురు గంజాయి విక్రేతలు, విక్రయించిన , వినియోగించిన చట్టప్రకారం కఠిన చర్యలు డి ఎస్పీ రఘు చందర్


జగిత్యాల ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు)
గంజాయి అమ్ముతున్నారన్న  పక్కా సమాచారంతో ఐదుగురు గంజాయి విక్రేతలను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పి తెలిపారు. బుధవారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించి నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు. జగిత్యాల రూరల్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని కండ్లపల్లి శివారులో గంజాయి కలిగి ఉన్న 1 మానుక కులదీప్ 21 (జగిత్యాల గాంధీ నగర్)   2 బొక్కనపల్లి పవన్ కుమార్ 20 జగిత్యాల రూరల్ మండలం (గుట్రాజుపల్లి) 3 మగ్గిడి రాకేష్ 21 జగిత్యాల టౌన్ కు చెందిన వీరిని పట్టుకొని వారి వద్ద నుండి 130 గ్రాముల నిషేధిత గంజాయి మూడు మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు .అదే విధంగా బుధవారం మధ్యాహ్నం రఘురాముల కోట శివారులో గంజాయి కలిగి ఉన్న జగిత్యాలకు చెందిన కోరేపు సాయి 22 ,జగిత్యాల మార్కండేయ నగర్ కు చెందిన ఆనుమల్ల లోకేష్ కుమార్ 25 లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్రేతలు ఉట్నూర్ లోని ఒక వ్యక్తి వద్ద నుండి గంజాయి కొనుక్కొని వారి జల్సాల డబ్బుల కోసం ఇక్కడ యువకులకు అమ్ముతున్నారని సమాచారం మేరకు వారి వద్ద నుండి 1211 గ్రాముల నిషేధిత గంజాయి రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీన పరుచుకున్నారన్నారు. సమాచారం తెలిసినవారు పోలీసులకు తెలపాలన్నారు. నిషేధిత గంజాయిని విక్రయించిన, వినియోగించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి నిందితులను పట్టుకున్న జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి ,రూరల్ ఎస్సై ఎన్. సధాకర్ కానిస్టేబుల్ ఎం. శ్రీనివాస్, ఉమర్, మోహన్, శ్రీనివాస్ లను డీఎస్పీ రఘు చందర్ అభినందించారు.

Tags

More News...

Local News 

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం 

బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం  జిల్లా ప్రధానకార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ  గొల్లపల్లి  (జగిత్యాల)మార్చి 17 (ప్రజా మంటలు) నర్సింగాపూర్ గ్రామం 437, 251 సర్వే నంబరులో వందల కొద్ది ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా ధరణి పట్టాలు సృష్టించుకున్న వాటిని రద్దు చేయాలని బిజెపి నాయకులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నాయకులు మాట్లాడుతూ నర్సింగాపూర్లో ప్రభుత్వ భూమిని కబ్జా...
Read More...
Local News  State News 

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష మెట్ పల్లి మార్చ్ 17 :  మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించిన కేసులో మెట్ పల్లి కోర్టు, ఇద్దరు నిందితులకు 2 నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి పదివేల రూపాయలు జరిమానా విధించింది  మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన పీట్ల సూరి (21)  కొమిరి నరేష్ (20 )...
Read More...
Local News 

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.    జగిత్యాల మార్చి 17(ప్రజా మంటలు) ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ బి.ఎస్.లత తో...
Read More...
Local News 

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .జగిత్యాల మార్చి 17(ప్రజా మంటలు)  సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు,తహసిల్దార్లు,అదనపు కలెక్టర్ బి.ఎస్ లత తో కలసి సమీక్ష నిర్వహించారు.ఆయా మండల వారిగా ధరణి దరఖాస్తులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో వున్న అన్ని దరఖాస్తు ఈ నెల చివరి వరకు పూర్తి...
Read More...
Local News 

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు *  కాంగ్రెస్ అంటే మహిళలని మోసం చేయడమే...        *  బీజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి... సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు):   వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడిన మాటలు అన్ని తప్పుల తడక అని కాంగ్రెస్ అంటే మహిళాభివృద్ధి కాదని మహిళలను మోసం చేయడమే కాంగ్రెస్ విధానం అని ముఖ్యమంత్రి...
Read More...
Local News  State News 

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

 ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు (రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494) ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగానంద), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాల సందర్భంగా, దేవస్థానం లోని ప్రధానాలయాలలో సోమ వారం విధివిదాన  సాంప్రదాయ ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన యజ్ఞా చార్యులు కందాల పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, ఆలయాల...
Read More...
Local News 

విద్యకు బడ్జెట్​ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

విద్యకు బడ్జెట్​ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి *  సికింద్రాబాద్​ పీజీ కాలేజీ వద్ద ఏబీవీపీ ధర్నా  * ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు): నేడు ప్రవేశపెట్టబోయే రాష్ర్ట బడ్జెట్ లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ 15 శాతం నిధులను కేటాయించాలని, తక్షణమే విద్యామంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం సికింద్రాబాద్​ పీజీ కాలేజీ వద్ద...
Read More...
Local News  State News 

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ మహిళలను మోసం చేశామని ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటు -  *కాంగ్రెస్ మెనిఫెస్టో చిత్తుకాగితమని తేలిపోయింది* *మహిళా వ్యతిరేక సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలుస్తారు  శాసన మండలి సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ బండారం  మిర్చికి 25 వేల మద్ధతు ధర ప్రకటించాలి: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ మార్చ్ 17:   మహిళలకు మోసం చేశామని స్వయంగా కాంగ్రెస్...
Read More...
Local News 

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత 

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత  సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు) : పద్మారావు నగర్ లోని శ్రీవత్స నృసింహ పాలపర్తి మోరంపూడి ఫౌండేషన్ కార్యాలయం ఆవరణలో సోమవారం స్వర్గీయ పాలపర్తి వెంకటేశ్వర్లు వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం పలువురు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేశారు. ముగ్గురికి వీల్ చైర్లు, ఒకరికి కమోడ్ తో కూడిన వీల్ చైర్, ఒకరికి ఎడమ కాలు,...
Read More...
Local News 

భయం వీడితే విజయం మనదే...

భయం వీడితే విజయం మనదే...   * టెన్త్​ విద్యార్తులకు  వీడ్కోలు సికింద్రాబాద్​, మార్చి 17 ( ప్రజామంటలు): పరీక్షలంటే భయపడకూడదని, జాగ్రత్తగా, ప్రశాంతంగా చదివితే పరీక్షల్లో విజయం మన సొంతం అవుతుందని పలువురు వక్తలు విద్యార్థులకు సూచించారు. సోమవారం భోలక్​ పూర్​ కృష్ణవేణి టాలెంట్​ స్కూల్​ లోని పదవతరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి..మంచి ఫలితాలు...
Read More...
Local News  State News 

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక     *  డీఎంఈ డా.నరేంద్ర కుమార్​ వార్నింగ్​    *  గాంధీ ఆసుపత్రి తనిఖీ సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు) : గాంధీ ఆసుపత్రి,మెడికల్ కాలేజీలో ప్రతి ప్రొఫెసర్​, అసోసియేట్​ ప్రొఫెసర్లు, హెచ్​ఓడీ లందరూ ఓపీ, ఐపీ టైమింగ్స్​ పాటించాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్టేట్​ డైరెక్టరేట్​ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్​( డీఎంఈ) డా.నరేంద్రకుమార్​ వార్నింగ్ ఇచ్చారు....
Read More...
Local News 

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత ▪️ ▪️జగిత్యాల మార్చి 17( ప్రజా మంటలు)  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్ లో కలిసి శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి  నవమ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు విశ్వ బ్రాహ్మణ సంఘం బాధ్యులు జగిత్యాల  విశ్వ బ్రాహ్మణ సంఘం  జిల్లా...
Read More...