పోలీసుల అదుపులో పలువురు గంజాయి విక్రేతలు, విక్రయించిన , వినియోగించిన చట్టప్రకారం కఠిన చర్యలు డి ఎస్పీ రఘు చందర్
జగిత్యాల ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు)
గంజాయి అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో ఐదుగురు గంజాయి విక్రేతలను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పి తెలిపారు. బుధవారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించి నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు. జగిత్యాల రూరల్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని కండ్లపల్లి శివారులో గంజాయి కలిగి ఉన్న 1 మానుక కులదీప్ 21 (జగిత్యాల గాంధీ నగర్) 2 బొక్కనపల్లి పవన్ కుమార్ 20 జగిత్యాల రూరల్ మండలం (గుట్రాజుపల్లి) 3 మగ్గిడి రాకేష్ 21 జగిత్యాల టౌన్ కు చెందిన వీరిని పట్టుకొని వారి వద్ద నుండి 130 గ్రాముల నిషేధిత గంజాయి మూడు మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు .అదే విధంగా బుధవారం మధ్యాహ్నం రఘురాముల కోట శివారులో గంజాయి కలిగి ఉన్న జగిత్యాలకు చెందిన కోరేపు సాయి 22 ,జగిత్యాల మార్కండేయ నగర్ కు చెందిన ఆనుమల్ల లోకేష్ కుమార్ 25 లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్రేతలు ఉట్నూర్ లోని ఒక వ్యక్తి వద్ద నుండి గంజాయి కొనుక్కొని వారి జల్సాల డబ్బుల కోసం ఇక్కడ యువకులకు అమ్ముతున్నారని సమాచారం మేరకు వారి వద్ద నుండి 1211 గ్రాముల నిషేధిత గంజాయి రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీన పరుచుకున్నారన్నారు. సమాచారం తెలిసినవారు పోలీసులకు తెలపాలన్నారు. నిషేధిత గంజాయిని విక్రయించిన, వినియోగించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి నిందితులను పట్టుకున్న జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి ,రూరల్ ఎస్సై ఎన్. సధాకర్ కానిస్టేబుల్ ఎం. శ్రీనివాస్, ఉమర్, మోహన్, శ్రీనివాస్ లను డీఎస్పీ రఘు చందర్ అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష
.jpeg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
.jpg)
భయం వీడితే విజయం మనదే...

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
.jpg)