భక్తుల కొంగు బంగారం భక్త మార్కండేయ దేవాలయం నేటి నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు

On
భక్తుల కొంగు బంగారం భక్త మార్కండేయ దేవాలయం నేటి నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు

భక్తుల కొంగు బంగారం భక్త మార్కండేయ దేవాలయం
నేటి నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు

గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలోని నడి బొడ్డున ఉన్న శ్రీ భక్త మార్కండేయ దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ ఆలయం జిల్లా కేంద్రంలో దివ్య క్షేత్రంగా వెలుగుతుంది. 49వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని పద్మశాలి సేవా సంఘం, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముస్తాబు చేశారు. కాగా శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో శ్రీ గాయత్రీ మాత, శ్రీ భక్త మార్కండేయుడు, శ్రీ సీతారామంజనేయ స్వామి, శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ గణపతి స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, కొలువై ఉన్నారు. నిత్యం భక్తులు ఈ ఆలయానికి వస్తూ పూజలు నిర్వహిస్తూ మొక్కలు చెల్లించుకోవడంతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది.  

ఆదివారం 09 ఫిబ్రవరి  నుంచి  13వ తేదీ  వరకు ఆలయంలో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలను వేద బ్రామ్మణుల  మంత్రోచ్ఛారణ మధ్య బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు. మొదటి రోజు ఆదివారం రోజున ఉదయం 9.00 ని'లకు  గణపతి, గౌరీ పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కంకణధారణ, ఋత్విక్ వర్ణనం, నవగ్రహ చతుషష్టి యోగిని, వాస్తుక్షేత్రపాలక, లింగతోభద్ర దేవతల స్థాపన, సాయంత్రం నుండి  ధ్వజారోహణం, అంకురారోపణ, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణతో ప్రారంభమై సోమవారం ఉ"9:00ని"లకు స్థాపిత దేవతారాధన, అగ్ని ప్రతిష్ట, గణపతి హవనం, తీర్థప్రసాద వితరణ, మంగళవారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతల పూజ, వేదమాత గాయత్రీ మాతకు పంచామృత అభిషేకం, స్థాపిత దేవత హవనం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది.

సాయంత్రం సామూహిక లలిత సహస్రనామ పారాయణం, డోలోత్సవం, వేద సదస్సు, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, బుదవారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతలకు రుద్రాభిషేకం, రుద్ర హవనం, మన్యుసూత్ర పారాయణం, పంచసుక్త హవనం, వసంతోత్సవం, మంగళహారతి, మంతపుష్పం, తీర్థప్రసాద వితరణ, గురువారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతల పూజ, హవనం, బలిహరణం, పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ, నాకబలి, ధ్వజారోహణం, కుంభోద్వాసన, దేవతాప్రొక్షణం, పల్లకి సేవ, ఏకంతసేవ, మహదాశిర్వచనం, ఆచార్య రుత్విక్ సన్మానం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు  ముగుస్తుందని పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

IMG-20250208-WA0228 ఐదు రోజుల పాటు వేడుకలు బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా దేవాలయంలో ప్రధాన అర్చకులు మేడిపెల్లి శ్రీనివాస్ శర్మ పాటు, శ్రీ తిగుళ్ల విష్ణు శర్మ, ఆంజనేయ శర్మ, ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల వేడుకలు నిర్వహించనున్నారు.

Tags

More News...

Local News 

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. గొల్లపల్లి / మల్యాలమార్చి 11 (ప్రజా మంటలు): మల్యాలలో అస్మా సుల్తానా నిన్న రాత్రి తన ఇంటి కి తాళాలు వేసి వారి బిడ్డ ఇంటికి జగిత్యాల కు వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, ఇంట్లోని బీరువాలో గల 5 తులాల బంగారు ఆభరణాలు,...
Read More...
Local News 

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం     అగంతకున్ని పట్టుకొని దేహశుద్ది    * అనంతరం పోలీసులకు అప్పగింత సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు):పద్మారావునగర్​ శ్రీసాయిబాబా టెంపుల్​ పక్కనున్న శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం ఓ అగంతకుడు చోరికి విఫల యత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలోనికి ప్రవేశించిన దాదాపు 50 ఏండ్ల వయస్సు కలిగిన ఓ వర్గానికి...
Read More...
Local News 

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్    సికింద్రాబాద్​, మార్చి 11 ( ప్రజామంటలు):   సంజీవరెడ్డి నగర్ పరిధిలోని గురుమూర్తి నగర్‌లో గల వినాయక స్వామి ఆలయంలో శనివారం రాత్రి దుండగులు పంచలోహ విగ్రహాలను దొంగిలించిన విషయం విదితమే. ఈనేపద్యంలో  ఘటనపై సమాచారం అందుకున్న సనత్‌నగర్ కాంగ్రెస్​ ఇన్‌చార్జ్ డా. కోట నీలిమ వెంటనే స్పందించారు. చోరీకి గురైన విగ్రహాలను త్వరగా గుర్తించి, దొంగలను...
Read More...
Local News 

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్​ పై దారి వదలండి

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్​ పై దారి వదలండి సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు.  సిటీలోని వివిధ ప్రాంతాల  నుంచి బస్సులు, వివిధ వాహనాల ద్వారా వచ్చే భక్తులకు ఇక్కడున్న మెయిన్​ రోడ్డు మద్యలోని మెట్రో డివైడర్ ఇబ్బందిగా మారింది. ఆలయానికి ఎదురుగా అవతల వైపు...
Read More...
Local News 

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు   ఎస్ ఈ సాలియా నాయక్    జగిత్యాల మార్చి11( ప్రజా మంటలు) రాబోవు వేసవి కాలానికి విద్యుత్ డిమాండ్ అనుగుణంగా అన్ని రకాల నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్ తెలిపారు అందులో భాగంగా జగిత్యాల డివిజన్ పరిధిలోని టౌన్ 1 సెక్షన్  లో వీక్లీ బజార్ స్కూల్ ఏరియా లోని  SS-234/100 కె.వి.ఏ నియంత్రిక సామర్థ్యంని...
Read More...
Local News 

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష. 

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.     జగిత్యాల మార్చి 11(ప్రజా మంటలు)జిల్లాలో  మంగళవారం జరిగిన ప్రథమ సంవత్సర గణిత శాస్త్రము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రము మరియు ఒకేషనల్ పరీక్షలలో 8021 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 7771 మంది విద్యార్థులు హాజరైనారు 250 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు పరీక్షల కన్వీనర్ బి. నారాయణ తెలిపారు. మొత్తం 96. 9 శాతం...
Read More...
Local News 

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ  ముఠా అరెస్ట్..

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ  ముఠా అరెస్ట్.. మెటుపల్లి / ఇబ్రహీంపట్నం మార్చి 11 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): మెట్ పల్లి,ఇబ్రహింపట్నం మండలాల పరిసర ప్రాంతాలలో గత కొంత కాలం నుండి అక్రమ ఇసుక, మొరం రవాణా, భూమి సెటిల్‌మెంట్ దందాలు చేస్తూ, వారి అక్రమాల పై ఎదురు తిరిగిన వారిపై  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీ...
Read More...
Local News 

ధరూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

ధరూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి    జగిత్యాల మార్చి 10(ప్రజా మంటలు) రూరల్ మం ధరూర్ గ్రామంలో   శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శివ పంచాయతన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజులపాటు జరిగినాయి.ఈ సందర్భంగా సోమవారం  ఏకకుండాత్మక హవనము, కళాన్యాస హోమము, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట ,ప్రాణ ప్రతిష్టాపన ,నేత్రోన్మీలనము, దృష్టి
Read More...
Local News 

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం  జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల మార్చి 11( ప్రజా మంటలు)భావోద్వేగాలకు తగ్గట్టుగా సంగీత బాణులను  వినిపించే పోలీస్ బ్యాండ్ పోలీసు శాఖలో ఎంతో ప్రాధాన్యత కలిగిన భాగంగా నిలుస్తుందని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఎస్పి  చేతులమీదుగా  పోలీస్ బ్యాండ్ సిబ్బంది కి స్పోర్ట్ డ్రెస్ ను...
Read More...
Local News 

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ 

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్     జగిత్యాల మార్చి 10(ప్రజా మంటలు) ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపాలని జిల్లా  కలెక్టర్ బి,సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా...
Read More...
Local News 

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు ప్రజామంటలు మార్చి 10 భీమదేవరపల్లి : మండలంలోని ముల్కనూర్ అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మార్పీఎస్ కడారి ప్రభాస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు, గ్రూప్ 1,2,3 లతోపాటు అన్ని రకాల ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు చేపట్టారు. ఈ...
Read More...
Local News 

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు.  సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు.   సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.    బుడగ జంగాల కాలనీలో ఘనంగా గాయత్రి మహాయజ్ఞం.  జగిత్యాల. మార్చి 10(ప్రజా మంటలు) హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడే జాతి బేడ బుడగ జంగాల ది అని, సంస్కృతి పరిరక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. జగిత్యాల సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సోమవారం బేడ...
Read More...