అంగరంగ వైభవంగా గీత భవన్ లో సౌందర్యలహరి ప్రారంభం

On
అంగరంగ వైభవంగా గీత భవన్ లో సౌందర్యలహరి ప్రారంభం

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల జులై 7 (ప్రజా మంటలు) : 

జిల్లా కేంద్రంలోని గీత భవనంలో పురాణ బ్రహ్మ తిగుళ్ల విశు శర్మచే సౌందర్యలహరి పురాణ ప్రవచన కార్యక్రమం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది.

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమం ప్రతినిత్యం ఉదయము 9:30నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఈ కార్యక్రమం కొనసాగును.

ఈనెల 13 వరకు 7 రోజులపాటు కార్యక్రమం కొనసాగును. కాగా ఆదివారం ప్రారంభం రోజున 9 మంది బాలికలచే కుమారి పూజ నిర్వహించారు.

ప్రతినిత్యం కార్యక్రమ అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగునని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమం అనంతరం భజన కార్యక్రమం కొనసాగింది.

భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

Tags