కాళోజీ అవార్డు ఎంపిక కమిటీ ఏర్పాటు

On
కాళోజీ అవార్డు ఎంపిక కమిటీ ఏర్పాటు

కాళోజీ అవార్డు ఎంపిక కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ సెప్టంబర్ 02 :

2024కు గానూ ప్రతిష్టాత్మక ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు అర్హులైన సాహితీవేత్తను ఎంపిక చేసేందుకు ప్రముఖ కవి అందెశ్రీ గారి అధ్యక్షతన  ఒక కమిటీ నియామకమైంది. సాహితీ ప్రముఖులు ఏనుగు నర్సింహారెడ్డి గారు, సంగనభట్ల నర్సయ్య గారు, పొట్లపల్లి శ్రీనివాస్ గారు కమిటీ సభ్యులుగా, మామిడి హరికృష్ణ గారు మెంబర్ కన్వీనర్ గా వ్యవహారిస్తారు. 

భాషా సాంస్కృతిక విభాగం సిఫార్సులతో ఈ మేరకు కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాకవి 'పద్మభూషణ్ 'కాళోజీ నారాయణరావు గారి పేరుమీద  ఏటా సాహితీ అవార్డు కింద గ్రహీతను సన్మానించి, జ్ఞాపికతో పాటు రూ.1,01,116 నగదును అందజేస్తారు.

Tags