జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారి ని 4 లేన్ల రహదారిగా విస్తరించాలని మాజీ కౌన్సిలర్ జయశ్రీ లేఖ
జగిత్యాల ఎప్రిల్ 03:
జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారి ని 4 లేన్ల రహదారిగా విస్తరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కు జగిత్యాల పట్టణ 35 వ వార్డు మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ లేఖ రాసారు.
జగిత్యాల నుండి కరీంనగర్ నేషనల్ హైవే "563" నాలుగు లైన్ల రహదారి గురించి జగిత్యాల పట్టణ మరియు కరీంనగర్ పట్టణాన్ని కలుపుతూ ఉన్న అన్ని మండలాల ప్రజలు మరియు గ్రామాల ప్రజల దశాబ్దాల కల అయిన ఈ రోడ్డును 2014 లో గుర్తించినప్పటికీ గతంలో ఉన్న M.P పట్టించు కోకపోవడంతో ప్రస్తుతం B.J.P. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిగా మీరు కరీంనగర్ M.P గా గెలవడంతో ఇక్కడి ప్రజలు అందరు కూడ మా కల నేరవేరుతుందని అనుకున్న ప్రజల కలలు, కలలు గానే మిగిలి పోయాయni లేఖలో పేర్కొన్నారు.
మెన్నటికి మొన్న ప్రధాన మంత్రిగా "3వ " సారి "నరేంద్ర మోడీ" గారు బాద్యతలు తీసుకున్న "100" రోజుల ప్రణాళికలో భాగంగా ప్రమాదకరముగా ఉన్న రోడ్లు, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నరోడ్లను గుర్తించిన రోడ్లలో మన జగిత్యాల నుండి కరీంనగర్ రోడ్డును గుర్తించి "100" రోజుల లోపు పనులు మొదలు పెట్టాలని చెప్పి ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడం చాల బాధాకరమని అన్నారు.
జగిత్యాల నుండి కరీంనగర్ రోడ్ కు ఇప్పటి వరకు పూర్తిస్థాయి భూసేకరణ కాలేదని మరియు ఇప్పటి వరకు నాలుగు సార్లు టెండర్లు పిలిచినారని వాటిని రద్దు పరుస్తు వస్తున్నారు. ఈ రోడ్డు అయ్యే ఖర్చు మొదటి అంచనా 1503 కోట్ల రూపాయలుగా తిరిగి మళ్ళీ టెండర్ అంచనా వేయగా రూ,, 2,151కోట్లకు అంచనా, June, 2024 నాటికి అంచనా విలువ 2, 300 కోట్ల రూపాయలకు చేరుకుంది, సంవత్సరాలు గడిచిన కొద్ది అంచనా విలువ పెరుగుతూ వస్తుంది. కానీ, ప్రజలకు అవసరమయిన రోడ్డు పనులకు టెండర్ కాకపోవడం శోచనీయం. వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో నిత్యం ఒక రోడ్డు ప్రమాదం జరుగుతూ కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మీరు ఇప్పటికైనా పూర్తి స్థాయి బాద్యతగా తీసుకొని సమయాన్ని వెచ్చించి భూసేకరణ పూర్తి చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంబించే విధంగా చర్యలు చేపట్టాలని జగిత్యాల ప్రజలు మరియు జగిత్యాల నుండి కరీంనగర్ వరకు ఉన్న ప్రజలందరి పక్షాన కోరుతున్నానని హనుమండ్ల జయశ్రీ లేఖలో కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహిళా సంఘాలకు కేంద్రం 15 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బౌద్దనగర్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం

మెట్ పల్లి పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర

ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన సదస్సు

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వినియోగంపై అవగాహన

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ రఘు చందర్

హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం

ఆడబిడ్డ పెళ్లికి వెండి ఆభరణాల బహుకరణ

కిమ్స్ -సన్షైన్ హాస్పిటల్ -లో రీనల్ డెనర్వేషన్ థెరపీ సెంటర్ ఏర్పాటు

బార్ అసోసియేషన్ నాయకులకు సన్మానం

దమ్ముంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల పై అధికారులతో కలెక్టర్ సమావేశం
