25 మెడికల్ కాలేజీల ఫ్యాకల్టీకి గాంధీలో శిక్షణ
* మూడు రోజుల పాటు ట్రైనింగ్ క్యాంప్
సికింద్రాబాద్ ఫిబ్రవరి 20 (ప్రజామంటలు) :
వైద్య విద్య బోధనలో ఆధునిక పద్ధతులను అవలంబించాలని, అందుకోసం అధ్యాపకులు కూడా తగిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే ఇందిరా అన్నారు. గురువారం గాంధీ మెడికల్ కళాశాలలోని రీజినల్ ట్రైనింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డా.ఇందిరా, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారితో కలిసి ప్రారంభించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు తెలంగాణలోని 60 మెడికల్ కళాశాలలను మూడు రీజియన్ లుగా విభజించారని, గాంధీ మెడికల్ కళాశాల కూడా ఒక రీజనల్ కేంద్రంగా ఉన్నదని, తమ పరిధిలో ఉన్న 25 వైద్య కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో తాము ఈ శిక్షణ ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు కేవలం మార్కులు మాత్రమే ప్రామాణికం కాకుండా వారి కమ్యూనికేషన్స్ కూడా మెరుగుపరచడానికి నూతన బోధన పద్ధతులు ఎంత ఉపయోగపడతాయి అని ఆమె చెప్పారు. ఈ అంశంపై మూడు రోజులపాటు శిక్షణ కూడా అందిస్తున్నామని తెలిపారు.
1998 లో రూపొందించిన మెడికల్ ఎడ్యుకేషన్ పద్దతిని 20 ఏండ్ల తర్వాత 2018 లో ఎన్ఎమ్సీ మార్చి, ఎంబీబీఎస్ స్టూడెంట్లకు కొత్త విద్యావిధానాన్ని తీసుకువచ్చిందని కన్వీనర్ డాక్టర్ కిరణ్ కుమార్ మాదాల తెలిపారు. ఈ నేపద్యంలో ఆయా మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీకి కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో రీజనల్ సెంటర్ కన్వీనర్ డాక్టర్ కిరణ్ కుమార్ మాదాల, కో కన్వీనర్ డాక్టర్ సుబోద్ కుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే.రవి శేఖర రావు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
