పట్టభద్రుల అభ్యర్థితో "ఎమ్మెల్యే బిజి - బిజీ" ప్రజలను పట్టించుకోని ప్రజా "ప్రతినిధి" రమ్మన్న చోటుకు పోతే ఎవరూ లేరు ఎమ్మెల్యే ఎక్కడ అంటే.... గుడిలో....
గుడికి వెళ్తే.... ఇంటికి రమ్మని పిలుపు
ఇంటికి వస్తే... గంటల సేపు నిరీక్షణ
ప్రజలను పట్టించు కోకుండా "కారెక్కిన ఎమ్మెల్యే"
మళ్ళీ పలాన కాడికి రావాలని సూచించిన ఎమ్మెల్యే
నిరీక్షించి విసిగి "వేసారిన ప్రజలు"
ఆటోల కిరాయి లేక "తిప్పలు పడ్డ తల్లులు"
ఇదేమి పద్ధతి అంటూ "ముక్కున వెలేసుకున్న ప్రజలు", పార్టీ కార్యకర్తలు, అభిమానులు
"పట్టభద్రులు ఓటేసేనా.... అభ్యర్థి గెలిచేనా" ...? అంటూ సొంత పార్టీ కార్యకర్తల గుస గుసలు
(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)
(ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు)
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే.... పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థితో బిజి - బిజీగా ఉన్నారు పాపం.
శుక్రవారం తనను కలవడానికి వచ్చిన ప్రజలను, మహిళలను, దూర ప్రాంతం నుండి వచ్చిన వృద్ధులను సైతం ఆ ఎమ్మెల్యే పట్టించుకోకుండా వెళ్లి పోయాడని ఆరోపణలు.
నియోజక వర్గంలోని ఆశావాహులు ఎమ్మెల్యే ను కలిసి తమ బాధలు చెప్పుకోవాలని, వినతి పత్రాలు అందించాలని, తగిన న్యాయం, తగు లబ్ధి పొందాలని, వారి - వారి సమస్యలు పరిష్కరించు కోవాలని కలలు గన్నారు. ఎన్నెన్నో ఆశలతో ఉదయత్ పూర్వమే నిద్రలేచి, చలికి గజ - గజ వణుకుతూ... ఎన్నెన్నో వ్యవ ప్రయాసలకు ఓర్చుకొని పొద్దు పొడిసే లోపు సదరు ఎమ్మెల్యేను కలువడానికి వచ్చారు.
కానీ.... ఆ ఎమ్మెల్యే మాత్రం ప్రజలను కలువకుండానే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం పరుగు - పరుగున వెళ్ళిపోయారు. పలాన సంఘం కాడికి రండి అక్కడ కలుద్దాం అంటూ ఎమ్మెల్యే తన కారెక్కి వెళ్లి పోయారు.
సదరు ప్రజలు ఎలాగో తిప్పలు పడుతూ.... అవసరం మనది కదా అంటూ... గులుగుకుంటూ ఆయన సూచించిన సంఘం వద్దకు హుటాహుటిన వెళ్లారు.
అక్కడ సదరు ఎమ్మెల్యే లేక పోవడంతో.... ఆశ్చర్య పోయారు. అరే.... మా ఎమ్మెల్యే ఏరి ఇక్కడికి రమ్మన్నారు కదా.... అని ఆరా తీయగా గుడికి వెళ్లారని తెలిసింది.
తీరా గుడి వద్దకు వెళ్లి గుడి ఎదుట భిక్షాటన లాగా ఎమ్మెల్యే కొరకు పడిగాపులు కాశారు ఆ ఆశావాహులు.
గుడి దర్శనం చేసుకొని వచ్చిన ఆ ఎమ్మెల్యే తాను చెప్పిన సంఘం వద్ద తన పార్టీ కార్యకర్తలు ఎవరూ లేరని తెలుసుకొని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థితో కారెక్కి తన ఇంటి ముఖం పట్టారు.
అయ్యా .... మీ కొరకే వచ్చాం.... అని ప్రజలు సదరు ఎమ్మెల్యే ను వేడుకోగా.... ఇంటికి రండి అక్కడ కలిసి మాట్లాడుదాం అంటూ... కారెక్కి ఇంటికి వెళ్లి పోయారు.
ఇక గత్యంతరం లేక ఆ ప్రజలంతా ఎమ్మెల్యే గారి ఇంటి దారి పట్టి ఎలాగో... తిప్పలు పడుతూ ఎమ్మెల్యే నివాసానికి చేరుకొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థితో లోపల ఉన్న ఎమ్మెల్యే కొరకు అక్కడ గంటల తరబడి వేచి ఉన్నారు ఆశావాహులు.
ఎమ్మెల్సీ అభ్యర్థితో కాసేపు ముచ్చటించి, తనకి కావలసిన వారిని మాత్రమే లోపలికి పిలిపించుకొని మాట్లాడి తేనీటి విందు కూడా ముగించుకొని సదరు ఎమ్మెల్యే.... కారెక్కి వెళ్లి పోసాగారు.....
మళ్ళీ ప్రజలంతా... తన పార్టీ కార్యకర్తలు సైతం ఎమ్మెల్యే కారు వద్దకు వెళ్లి అయ్యా.... మీ కొరకే కదా ఇంత సేపటి నుండి వేచి చూస్తున్నాము... అక్కడికి అంటే అక్కడికి వచ్చాం..., అక్కడ మీరు లేకపోవడంతో గుడి కాడ ఉన్నారంటే... గుడి ముందు కాపు కాశాం.... మళ్ళీ ఇంటికి రమ్మని అంటే ఇంటికి వచ్చి గంటలు అయిపాయే... అని ఎమ్మెల్యేతో అనబోయే సరికే.... ఆయన కారెక్కి వెళ్తూ.... అదే.... పలాన సంఘం కాడికి రండీ అంటూ ఎమ్మెల్యే మళ్ళీ కారెక్కి వెళ్ళిపోయారు.
ముచ్చటగా మూడు సార్లు ఎమ్మెల్యే మాటలు విని విసిగి వేసారిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే వైఖరిపై మండి పడుతూ పలు ఆరోపణలు చేస్తూ.... అక్కడి నుండి కొందరు విసుగుతో వెళ్ళిపోయారు. గంత్యంతరం లేక ఇంకొందరు ఎమ్మెల్యే చెప్పిన సంఘం కాడికి వెళ్లారు. మరికొందరు సంఘం కాడికి వెళ్ళడానికి వాహనాలు లేక, ఆటోలకు చార్జీలకు డబ్బులు లేక తిప్పలు పడ్డారు.
ఇదంతా గమనించిన పార్టీ కార్యకర్తలు సైతం ఎమ్మెల్యే ప్రవర్తన పట్ల అసంతృప్తి వెళ్లగక్కారు.
ఏది ఏమైనా ఎమ్మెల్యే వైఖరి, ఆయన ప్రవర్తన ఇలాగే ఉంటే చాలా కష్టం అని అక్కడ ఉన్న ప్రజలంతా, పార్టీ కార్యకర్తలతో సహా ముక్కున వేలేసుకున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో "పట్టభద్రులు ఓటేసేనా....? అభ్యర్థి గెలిచేనా" ...?? అంటూ సొంత పార్టీ కార్యకర్తలే గుస గుసలాడారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

భయం వీడితే...జయం మనదే..
.jpg)
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్
